వాడపల్లి స్వామికి లక్ష్మీ కటాక్షం | - | Sakshi
Sakshi News home page

వాడపల్లి స్వామికి లక్ష్మీ కటాక్షం

Jun 8 2025 12:11 AM | Updated on Jun 8 2025 12:11 AM

వాడపల్లి స్వామికి లక్ష్మీ కటాక్షం

వాడపల్లి స్వామికి లక్ష్మీ కటాక్షం

కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తోంది. దేవస్థానం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ వివరాలు తెలిపారు. హుండీలు, టికెట్లు, లడ్డూ ప్రసాదం ద్వారా దేవస్థానానికి గత ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకూ రూ.17,73,72,207 ఆదాయం వచ్చిందన్నారు. నెలకు సగటున రూ.2,21,71,525 సమకూరిందన్నారు. శనివారాల్లో రూ.38,78,288 ఆదాయం లభించిందన్నారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకూ రూ.26,11,62,698 రాబడి వచ్చిందన్నారు. అంతకు ముందు కాలంతో పోలిస్తే ఆదాయం రూ.8,37,90,491 పెరిగిందన్నారు. ఈ కాలంలో నెలకు సగటున రూ.3,26,45,337 వచ్చిందన్నారు. శనివారాల్లో రూ.55,86,962 మేర ఆదాయం రాగా అంతకు ముందుతో పోలిస్తే రూ.17,08,764 పెరుగుదల నమోదైందని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.1.14 కోట్లతో వివిధ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆలయ నిధులు రూ.11.17 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రూ.19.30 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. కల్యాణోత్సవాలకు గత ఏడాది రూ.89,67,000, ఈ ఏడాది రూ.71,14,806 మేర ఖర్చయిందని చెప్పారు. మొత్తం మీద ఖర్చు రూ.18,52,194 తగ్గిందన్నారు. గోదాదేవి కల్యాణోత్సవాలకు గత ఏడాది రూ.99,14,800, ఈ ఏడాది రూ.54,07,220 చొప్పున ఖర్చయ్యాయని, ఈ వ్యయం రూ.45,07,580 తగ్గిందని చక్రధరరావు వివరించారు.

ఫ గణనీయంగా పెరిగిన ఆదాయం

ఫ రూ.1.14 కోట్లతో సౌకర్యాల కల్పన

ఫ ఈఓ చక్రధరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement