సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు

Jun 4 2025 12:11 AM | Updated on Jun 4 2025 12:11 AM

సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు

సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు

రాజమహేంద్రవరం రూరల్‌: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామ సచివాలయంలో జయబున్నీసా బేగం గ్రేడ్‌–5 హోదాలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆ సచివాలయంలో వారంతా ఒకే నోటిఫికేషన్‌లో నియమితులయ్యారు. దీంతో వారి మధ్య సీనియారిటీ సమస్య కూడా లేదు. అయితే, బేగంకు కొన్నాళ్ల క్రితం డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్సింగ్‌ ఆఫీసర్‌(డీడీవో)గా అదనపు బాధ్యతలు కేటాయించారు. డీడీవోగా సిబ్బంది జీతాల ఫైల్‌ సిద్ధం చేయడం ఆమె చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆ సచివాలయ సిబ్బంది రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లోని డీఎల్‌డీవో, వార్డు, గ్రామ సచివాలయాల ఇన్‌చార్జి వీణాదేవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే నెల జీతాలు నేటికీ రాలేదని బేగం ఫైల్‌ సిద్ధం చేయకపోవడమే అందుకు కారణమని డీఎల్‌డీవో దృష్టికి తీసుకెళ్లారు. బేగం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డీఎల్‌డీవో సిబ్బంది ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement