
జేఈఈలో ప్రవీణ్కుమార్కు 328వ ర్యాంకు
మామిడికుదురు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పాశర్లపూడిలంకకు చెందిన కోలా ప్రవీణ్కుమార్ సత్తా చాటాడు. ఇతను జాతీయ స్థాయిలో 328వ ర్యాంకు సాధించాడు. విజయవాడ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ప్రవీణ్కుమార్కు ముంబయి సీఎస్ఈలో సీటు వచ్చింది. తండ్రి గోపాలకృష్ణ రైతు, తల్లి జ్యోతి గృహిణి. పేరెంట్స్ ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. ప్రతి రోజు 14 గంటలు చదవడం వల్ల మంచి ర్యాంకు వచ్చిందని ప్రవీణ్కుమార్ మంగళవారం తెలిపాడు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. అతడిని స్థానికులు అభినందించారు.
మద్యం తాగి
బైక్ నడిపిన వారికి జైలు
కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ఒకరికి ఐదురోజులు, తొమ్మిది మందికి రెండు రోజుల చొప్పున జైలు, 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో 27 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
పోలీసుల అదుపులో
కారు యజమాని
అమలాపురం టౌన్: స్థానిక ఏఎస్ఏ ఆస్పత్రి వద్ద 216 జాతీయ రహదారిపై ఓ మోటారు సైకిలిస్ట్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అక్కడ నుంచి కారుతో సహా పరారైన వ్యక్తిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు యజమాని దీపక్ను అదుపులోకి తీసుకుని రోడ్డు ప్రమాదంలో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపారు. స్థానిక పితానివానిపాలేనికి చెందిన దీపక్ స్థానికంగా రోల్స్ ఆన్ రోడ్డు పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడని ఎస్సై పేర్కొన్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసును విచారిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జేఈఈలో ప్రవీణ్కుమార్కు 328వ ర్యాంకు