సత్తా చాటిన అన్నదమ్ములు | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన అన్నదమ్ములు

Jun 3 2025 12:11 AM | Updated on Jun 3 2025 12:11 AM

సత్తా చాటిన అన్నదమ్ములు

సత్తా చాటిన అన్నదమ్ములు

కె.గంగవరం: ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాల్లో కె.గంగవరానికి చెందిన కొడవటి ప్రసాద్‌చౌదరి (విశ్రాంత ఉపాధ్యాయుడు) మనవడు సువర్ణ రామ్‌ప్రత్యూష్‌కు అత్యుత్తమమైన ఆలిండియా 510 ర్యాంక్‌ సాధించినట్టు కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాల్లో అతని అన్నయ్య కొడవటి సాయిప్రణీత్‌ ఆలిండియా 565 ర్యాంక్‌ సాధించడం గమనార్హం. తమ ఇద్దరు కుమారులు ప్రఖ్యాత ఐఐటీ కాలేజీల్లో సీట్లు సాధించడంపై తండ్రి కొడవటి సురేష్‌ (డీఈ, ఏపీ ట్రాన్స్‌కో), తల్లి వసుధ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌)తో పాటు, తాతయ్య కొడవటి ప్రసాద్‌చౌదరి, సుశీల, ఇతర కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష్‌ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి వారం పరీక్ష రాసి, పొరపాట్లు సరిదిద్దుకోవటం, సందేహాల నివృత్తి, సమయ పాలన, రోజుకు 14 గంటలు శ్రమించడం వంటివి తన విజయానికి ప్రధాన కారణాలుగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement