అప్పటి సేవలు ఇప్పుడు లేవు | - | Sakshi
Sakshi News home page

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

May 31 2025 12:19 AM | Updated on May 31 2025 12:19 AM

అప్పట

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు సైతం పీహెచ్‌సీలు, పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. ప్రభుత్వం గతంలో చేసినట్టుగా ఇంటి వద్దనే వైద్య సేవలు, మందులు అందేలా చేయాలి.

– పోతుల చంద్రావతి, కొత్తపేట

ఆర్‌బీకేలను మరింత పటిష్టం చేయాలి

రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే సేవలపై సన్న, చిన్న కారు రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. వరదలకు, భారీ వర్షాలకు పంట నష్టపోతే ఒకటి రెండు రోజుల్లోనే ఆర్‌బీకేల సిబ్బంది వచ్చి పంట నష్టం నమోదు చేసేవారు. నాలుగైదు నెలల్లో పరిహారం వచ్చేలా చూసేవారు. మాకు పెద్దగా పని ఉండేది కాదు.

– పినిశెట్టి నాగబాబు, మామిడికుదురు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత

ఒకవైపు సంక్షేమ పథకాల ఎత్తివేత

మరోవైపు సామాన్యుల సేవలకు దూరం

వలంటీర్లను నిలిపివేశారు

ఇక ఇంటి వద్ద రేషన్‌ లేనట్టే...

ఇంటి ముంగిట అందని వైద్యం

కూటమి ఏడాది పాలనలో అన్నీ కష్టాలే

నాడు ప్రభుత్వం పరంగా

ఏం కావాలన్నా గుమ్మాల వద్దకే..

నాటి పరిస్థితులు

గుర్తు చేసుకుంటున్న జనం

సాక్షి, అమలాపురం: సంక్షేమ పథకాల లబ్ధి సకాలంలో అందించడం... పదుల సంఖ్యలో సేవలను సామాన్యులకు చేర్చడం.. వలంటీర్లు ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్లతోపాటు పలు పథకాల్లో లబ్ధి చేకూరేలా పనిచేయడం.. పంట నష్టపోతే తరువాత రోజే రైతు ఇంటికి వచ్చి పంట నష్టం నమోదు చేయడం.. పంట యాజమాన్యం గురించి రైతులకు చెప్పే రోజులకు కాలం చెల్లిపోయింది. ఇంటింటికీ వచ్చి ఆరోగ్యం గురించి క్షేమ సమాచారం తెలుసుకునే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్లూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మూడొంతుల ప్రభుత్వ సేవలు గడప వద్దనే అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. వలంటీర్‌ వ్యవస్థ నిలిచిపోయింది. సచివాలయంలో మూడొంతుల సేవలు ఆగిపోయాయి. ఇప్పటికే వలంటీర్‌ వ్యవస్థను దాదాపు ఎత్తివేసిన ప్రభుత్వం.. సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్ల నిర్మాణ పనులను నిలిపివేయడం ద్వారా ఈ వ్యవస్థలను పక్కనబెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఇబ్బందులు పడుతున్నా..

ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం సచివాయాల ద్వారానే ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు అందించేది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలంటే పోస్టాఫీసుకు వచ్చి నమోదు చేయించుకోవల్సి వస్తోంది. ఇక్కడకు వచ్చాక సర్వర్‌ డౌన్‌ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

– సరెళ్ల వెంకట్రావు, మాజీ ఉప సర్పంచ్‌,

జి.అగ్రహారం, అంబాజీపేట మండలం

నేడు

నాడు

అప్పటి సేవలు ఇప్పుడు లేవు 
1
1/5

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

అప్పటి సేవలు ఇప్పుడు లేవు 
2
2/5

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

అప్పటి సేవలు ఇప్పుడు లేవు 
3
3/5

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

అప్పటి సేవలు ఇప్పుడు లేవు 
4
4/5

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

అప్పటి సేవలు ఇప్పుడు లేవు 
5
5/5

అప్పటి సేవలు ఇప్పుడు లేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement