
రైల్వే లైన్పై హామీని నిలబెట్టుకోవాలి
పనుల నత్తనడకపై కోనసీమ జేఏసీ సమీక్ష
అమలాపురం టౌన్: గత ఎన్నికల ప్రచారం సందర్భంగా అమలాపురం సెంటర్లో జరిగన సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ తమ ప్రసంగాల్లో కోనసీమ రైల్వే లైనును తాము అధికారంలోకి వస్తే తొందరగా పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామమోహనరావు గుర్తు చేశారు. స్థానిక జేఏసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం రైల్వే లైన్ పనులపై సమీక్షించింది. జేఏసీ కన్వీనర్ రామమోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీని ఈ కూటమి ప్రభుత్వంలో నిలబెట్టుకోవాలని సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనకు శనివారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ రైల్వే లైన్ పనులపై స్పందించాలని డిమాండ్ చేశారు. లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. కోటిపల్లిలో గౌతమి నదిపై నిర్మించిన రైల్వే వంతెన పిల్లర్స్పై గడ్డర్స్ వేయడానికి టెండర్లు ఖరారు అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు. జేఏసీ ప్రతినిధులు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రదమూర్తి, కరాటం ప్రవీణ్, కల్వకొలను బాబు, జంగా రాజేంద్ర, ఎస్.సంసోను, మాచిరాజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆరోగ్యమైన
జీవనానికి యోగా
అమలాపురం రూరల్: ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ 26 జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలు తీరు, ప్రజా సంతప్తి స్థాయిల పురోగతి, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యోగా ట్రైనర్లను గుర్తించామని, వారితో అన్ని ప్రాంతాలలోని ప్రజలతో యోగాభ్యాసన చేయించడంతోపాటు, యోగా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో 8 లక్షల రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. గ్రామ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై సమీక్షిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవ ర్గంలో 10 వేలు కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యమన్నారు. ఆ మేరకు ట్రాన్స్కో అధికారులు, బ్యాంకర్ల సమన్వయంతో రాయితీలతో ప్రోత్సహిస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జేసీ టీ.నిషాంతి, అధికారులు పాల్గొన్నారు.

రైల్వే లైన్పై హామీని నిలబెట్టుకోవాలి