
సినిమా థియేటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
అమలాపురం టౌన్: స్థానిక సినిమా థియేటర్లపై మొదటి రెండు రోజులూ రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి మౌలిక సదుపాయాలు, తిను బండారాల విక్రయాలు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్ల నిర్వహణపై వరస తనిఖీలు చేశారు. తాజాగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం థియేటర్లపై ఆకస్మిక దాడుల చేసి తినుబండారాల దుకాణాలను తనిఖీలు చేసి ఆహార పదార్థాల నిర్వహణ సక్రమంగా లేదని నోటీసులు జారీ చేశారు. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీకాంత్ చౌదరి ఆధ్వర్యంలో ఆహార భద్రత అధికారులు ఈ దాడులు చేశారు. స్థానిక రమా, వీపీసీ, శేఖర్ థియేటర్లను అధికారుల బృందం తనిఖీలు చేసింది. ఆయా థియేటర్లకు ఫుడ్ లైసెన్స్లు లేనట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. పనిచేసే సిబ్బందికి ఫిజికల్ ఫిటెనెస్ చేయించాలని, ఆయా థియేటర్ల అధికారులు సూచించారు. పరిశుభ్రమైన ఆహారాన్ని నిర్ధేశించిన ధరలకే విక్రయించాలన్నారు. గడువులోపే థియేటర్లలో ఫుడ్ లైసెన్స్లు రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
3 థియేటర్లకు నోటీసులు జారీ
ఫుడ్ అండ్ సేఫ్టీ
ఆఫీసర్ శ్రీకాంత్ చౌదరి