
పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!
నగరి : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడు ఉన్నవాటికే ఎసరు పెడుతున్నారని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉపాధి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వాహనాలను నిలిపి నిరసన తెలిపారు. ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 326 మంది ఆపరేటర్లు ఉన్నారన్నారు. ప్రభుత్వ విధానంతో వందల కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు. రేషన్ దుకాణాల ఎదుట ప్రజలు పడిగాపులు కాయకుండా ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న తమను కొనసాగించాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందనే కారణంతో జనాలకు ఉపయోగపడే ఎండీయూ వాహనాలను నిలిపివేయడం సరికాదన్నారు. వీటిని రద్దు చేసి తమ పొట్టకొట్టవద్దని విన్నవించారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్ర అందించారు.
ఎండీయూ ఆపరేటర్ల నిరసన
రోడ్డున పడే పరిస్థితి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులు అందించే పని అప్పగించింది. వాహనాలు బ్యాంకు రుణాల ద్వారా తీసుకుని ఇప్పటికీ ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని నిలిపేస్తే రుణ వాయిదాలు కూడా చెల్లించలేం. దీంతో మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.
– వేణు, జిల్లా అధ్యక్షుడు, ఎండీయూ యూనియన్
వాహనమే జీవనాధారం
ఎండీయూ వాహనం ద్వారా ఉపాధి పొందుతున్నాం. నాలుగేళ్ల నుంచి ఇదే నడుపుతూ జీవనం సాగిస్తున్నా. ప్రతి నెలా 15వ తేదీ లోపు ఇంటింటికీ వెళ్లి సరుకుల పంపిణీ పూర్తి చేసేవాళ్లం. ప్రభుత్వం ఇప్పుడు ఈ వాహనాలను రద్దు చేయడంతో దిక్కుతోచని
– వీపీ శ్రీనివాసన్, జిల్లా ఉపాధ్యక్షులు, ఎండీయూ యూనియన్

పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!

పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!

పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!