సీపీఎస్‌ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

సీపీఎస్‌ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి

సీపీఎస్‌ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి

● కలెక్టరేట్‌ ఎదుట ఏపీసీపీఎస్‌ఈఏ నాయకుల ధర్నా

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షు లు బాజీ పఠాన్‌, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆ సంఘ నాయకులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వా రు మాట్లాడుతూ రాష్ట్రంలో 3.5 లక్షల సీపీఎస్‌ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. సీపీఎస్‌ ఉద్యోగు లు ఆర్థికంగా, సామాజికంగా, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు పరిస్థితిని మే డే రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా నిర్వహించామన్నారు. సీపీఎస్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు సీపీఎస్‌ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరగడమే కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనులకి పొంతన లేకుండా ఉందన్నారు. ఎన్నికల సమయంలో సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా లో ఆ సంఘం నాయకులు దేవకుమార్‌, హరిప్రసాద్‌రెడ్డి, మోహన్‌కుమార్‌, నరసింహులు, సుబ్బలక్ష్మి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement