ఒక్కోమెట్టు ఎక్కుదాం.. గమ్యాన్ని చేరుకుందాం

Anand Mahindra Commented On a Village In Kashmir - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్‌ మహీంద్రా. దేశవ్యాప్తంగా మరుగన పడిపోయిన ప్రతిభావంతులు, స్ఫూర్తిని అందించే ఘటనలు చోటు చేసుకునప్పుడు ట్విటర్‌ వేదికగా వాటికి మరింత ప్రచారం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో కల్లోల కశ్మీరానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను మనతో పంచుకున్నారు. 

జమ్ము కశ్మీర్‌లోని పల్లి పంచాయితీ దేశంలోనే తొలి సోలార్‌ విద్యుత్‌ గ్రామ పంచాయితీగా మారి రికార్డు సృష్టించింది. ఇక​‍్కడ  గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోలార్‌ పలకలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా గ్రామానికి అవసరమైన విద్యుత్‌ని సమకూర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో గమనించిన ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు. పల్లి గ్రామ పంచాయతీ తరహాలో పంచాయతీ తర్వాత పంచాయతీ లక్ష్యంగా పని చేసుకుంటూ పోతే కాలుష్య రహితంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి: నేను తర్వాత కొనేది అదే.. ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top