
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బూర్గంపాడు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఐటీసీ పీఎస్పీడీలో కార్మికులు పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ పీఎస్పీడీ ఆధ్వర్యాన అడవుల పెంపకం, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ ఉన్నతాధికారులు శ్యామ్కిరణ్, చెంగలరావు, కార్మిక సంఘాల నాయకులు కనకమేడల హరిప్రసాద్, గాదె రామకోటిరెడ్డి, యారం పిచ్చిరెడ్డి, గొనె రామారావు, సానికొమ్ము శంకర్రెడ్డి, బిజ్జం అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.