
సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025
అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరు మండలం జనకవరానికి చెందిన రైతు తల్లపనేని శ్రీనాథ్ అప్పుల బాధతో మే నెల 23వ తేదీ రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనాథ్ కరోనా ముందువరకు బళ్లారిలో కౌలు వ్యవసాయం చేశారు. అక్కడ అప్పులు అధికమై సొంత గ్రామం జనకవరం వచ్చారు. పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది 7 ఎకరాల్లో నల్లబర్లీ, జూట్, శనగ సాగు చేశారు. మూడు పంటలను కొనేవారు లేకుండా పోయారు. రూ. 30 లక్షల వరకు అప్పులయ్యాయి. రుణాలు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తనకున్న 2.14 ఎకరాల భూమిని అమ్మేశారు. అయినా అప్పులు తీరే పరిస్థితి లేకపోవడంతో మే నెల 23వ తేదీ రాత్రి పొలానికి వెళ్లిన శ్రీనాథ్ అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో కుటుంబం రోడ్డున పడింది.
ఇంకొల్లు మండలం దుద్దుకూరు అంబేడ్కర్ నగర్కు చెందిన రైతు బిల్లా శాంసన్ 30 ఎకరాలకుపైగా కౌలుకు తీసుకొని బ్లాక్ బర్లీ, మిర్చి, శనగ పంటలు సాగు చేశారు. ఇందుకోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి కొంత, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మరికొంత అప్పులు తెచ్చారు. ఈ సంవత్సరం పండించిన పంటలు కొనేవారు లేకుండా పోయారు. అప్పులు తీర్చలేనన్న ఆందోళనతో శాంసన్ మే నెల 9 వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమయానికి బంధువులు చూసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన ఉప్పుటూరు సాంబశివరావు ఎకరా రూ.40 వేలు చొప్పున 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు సాగు చేశారు. సుమారు రూ. 8 లక్షలు అప్పులు తెచ్చారు. పంట చేతికొచ్చి నెల దాటుతున్నా కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. పైగా క్వింటాల్ రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఈ ధరతో పొగాకు అమ్మినా ఖర్చులు కూడా రావు. ఇప్పటికే రూ. 15 లక్షలకుపైగా ఉన్న అప్పులు తీర్చే పరిస్థితి కాన రాలేదు. నిస్సహాయ స్థితిలో సాంబశివరావు మే నెల 6 వ తేదీన ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య యశోద, ఇంటర్ చదివే కూతురు, పది చదివిన కుమారుడు దిక్కులేని వారయ్యారు. కుటుంబం రోడ్డున పడింది.
న్యూస్రీల్

సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025