
నాడు ప్రగతి.. నేడు అధోగతి
నాడు–నేడు ద్వారా జిల్లావ్యాప్తంగా 1488 పాఠశాలల్లో రూ. 804.1 కోట్ల వ్యయంతో 2048 పనులు జరిగాయి. అద్దంకి నియోజకవర్గంలోని 280 పాఠశాలల్లో రూ.75.09కోట్లతో 458 పనులు జరిగాయి. బాపట్లలోని 210 పాఠశాలల్లో రూ.45.08 కోట్లతో 237 పనులు, చీరాలలోని 125 పాఠశాలల్లో రూ.38.16కోట్లతో 180 పనులు, పర్చూరులోని 263 పాఠశాలల్లో రూ.53.70కోట్లతో 371 పనులు, రేపల్లెలోని 282 పాఠశాలల్లో రూ.46.21కోట్లతో 381 పనులు, వేమూరు నియోజకవర్గంలోని 273 పాఠశాలల్లో రూ.45.86కోట్లతో 424 పనులు జరిగాయి. నేటి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత ప్రభుత్వంలో మంజూరైన పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి.