
జిల్లా స్థాయి సీనియర్ చెస్ విజేత ధ్రువేష్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ పోటీల్లో విజేతగా డి.ధ్రువేష్ నిలిచాడు. ఆ తర్వాత మూడు స్థానాల్లో కె.హర్షవర్ధన్, ఎ.హరిసూర్యనారాయణ, కీర్తి రానా నిలిచారు. ఈ నెల 7, 8వ తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ నలుగురు పాల్గొంటారని నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి తెలిపారు. అనంతరం విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాజు, హిందూ ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి రామకృష్ణమూర్తి, చక్రవర్తి బహుమతి ప్రదానం చేశారు.