వెన్నుపోటుపైజనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపైజనాగ్రహం

Jun 5 2025 8:50 AM | Updated on Jun 5 2025 8:50 AM

వెన్నుపోటుపైజనాగ్రహం

వెన్నుపోటుపైజనాగ్రహం

సూపర్‌–6 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా వాటిని అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. వాగ్దానాల అమలును గాలికొదిలేసి, తమను రోడ్డున పడేసిన వైనంపై జనం కన్నెర్ర చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనంటూ వైఎస్సార్‌ సీపీ నేతలతో కలిసి కదం తొక్కారు. కూటమి ప్రజాకంఠక పాలన పోవాలంటూ నినదించారు. పోలీసు ఆంక్షలను ఛేదించి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు.

సాక్షి ప్రతినిధి,బాపట్ల: సూపర్‌సిక్స్‌ పథకాలను ఇస్తామని ఎన్నికల్లో ఓట్లేయించుకున్న కూటమి పాలకులు గద్దెనెక్కాక ఒక్కహామీనీ నెరవేర్చక ప్రజలను వంచించారు. పథకాల ఆశచూపి నిరుపేదల కడుపుపై కొట్టారు. ఏడాది పాలనలో ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క పథకాన్నీ ప్రజలకు ఇవ్వలేదు. మాటచెప్పి అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కూటమి సర్కార్‌ ప్రజలను వంచించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ బుధవారం వెన్నుపోటు దినం పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ వంచనను ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై నిరసన తెలిపారు.

కొల్లూరులో కదం తొక్కిన శ్రేణులు

కొల్లూరులో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు చేపట్టిన నిరసనకు పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. ఆయనను తహశీల్దారు కార్యాలయానికి వెళ్లనివ్వలేదు. వాస్తవానికి ఉదయం కొల్లూరు మండలం మొసలిపాడు వద్దనుంచి వైస్సార్‌ సీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దమైంది. కూటమి వంచనను వివరించేలా అశోక్‌బాబు వినూత్న నిరసన చేపట్టారు. ఎండీయూ వాహనాలకు కూటమి మోసపూరిత సూపర్‌సిక్స్‌ హామీలను ఫ్లెక్సీలుగా వేసి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వాహనాలను అనుమతించబోమంటూ డ్రైవర్ల వద్దనుంచి తాళాలు లాక్కున్నారు. ఆ తర్వాత ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల మధ్య పలుదఫాలుగా తోపులాట జరిగింది. మధ్యాహ్నం సమయానికి ర్యాలీ రేపల్లె – తెనాలి రోడ్డుపైకి చేరింది. అప్పటికే ఎండతీవ్రత పెరగడం, పోలీసులు అడ్డకోవడం ఆగకపోవడంతో అశోక్‌బాబు సొమ్మసిల్లి పడిపోయారు. నేతలు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ అక్కడే బైటాయించారు. ఆ తర్వాత వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తామన్నా పోలీసులు అనుమతించలేదు. చివరకు నిరసన కార్యక్రమం వద్దకే తహసీల్దారును పిలిపించి అక్కడే వినతిపత్రం ఇప్పించారు. పోలీసుల తీరుపై అశోక్‌బాబు మండిపడ్డారు. కూటమి సర్కార్‌ తీరుకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నినాదాలతో విరుచుకుపడ్డాయి.

బాపట్లలో పోటెత్తారు

బాపట్లలో మాజీ డిప్యూటీ స్వీకర్‌ కోన రఘుపతి ఆధ్వర్యంలో కూటమి సర్కార్‌ మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోన భవన్‌ నుంచి పాతబస్టాండు మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి వాటిని నెరవేర్చక వంచించారని కోన విమర్శించారు. కార్యక్రమంలో వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య కూటమి వెన్నుపోటుకు నిరసనగా తలనీలాలు సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో కోకి రాఘవరెడ్డి, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బూటకపు హామీలను నిరసిస్తూ..

రేపల్లెలో సమన్వయకర్త ఈవూరు గణేష్‌ నాయకత్వంలో పార్టీ శ్రేణులు పట్టణశివారు ఇసుకపల్లి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమిప్రభుత్వం ప్రజలను వంచించిందని గణేష్‌ విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

చీరాలలో..

చీరాలలో సమన్వయకర్త కరణంవెంకటేశ్‌ ఆదేశాలతో పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జైషన్‌బాబు తదితరుల నేతృత్వంలో పార్ర్‌టీశ్రేణులు స్థానిక గడియారం స్థంభం సెంటర్‌ నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి కొద్దిసేపు అక్కడే ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చక ప్రజలను వంచించిందని విమర్శించారు. వెన్నుపోటు చంద్రబాబుకు బుద్ధి చెబుతామని ప్రజలు నినదించారు.

వంచనపై జనాగ్రహం

పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి ఆధ్వ ర్యంలో పార్టీశ్రేణులు పర్చూరు బొమ్మలసెంటర్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు మహానేత వైఎస్సార్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. చంద్రబాబు సర్కార్‌ ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కాక వాటిని నెరవేర్చక ప్రజలను వంచిందన్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు భవనం శ్రీనివాసరెడ్డి, కొల్లా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొల్లూరులో వేమూరు సమన్వయకర్త ఆధ్వర్యంలో వినూత్న నిరసన బాబు సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేయకపోవడంపై ఫ్లెక్సీల ప్రదర్శన నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగిన అశోక్‌బాబు ఈవూరు గణేష్‌ ఆధ్వర్యంలో రేపల్లెలో ర్యాలీ కోన రఘుపతి నేతృత్వంలో బాపట్లలో నిరసన ప్రదర్శన పర్చూరులో ర్యాలీ నిర్వహించిన గాదె మధుసూదన్‌రెడ్డి హనిమిరెడ్డి నాయకత్వంలో అద్దంకిలో ఆందోళన కరణం వెంకటేశ్‌ ఆదేశాలతో చీరాలలో నిరసన కార్యక్రమం

వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి కదం తొక్కిన జనం

ప్రజాగ్రహానికి అద్దం పట్టిన ర్యాలీ

అద్దంకిలో పానెం హనిమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కూటమి వంచన పాలనకు నిరసనగా కార్యక్రమం నిర్వహించాయి. స్థానిక వైఎస్సార్‌ విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న మహానేత వైఎస్సార్‌, డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆతర్వాత తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక వంచనకు పాల్పడిందని హనిమిరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, రైతువిభాగం నేత ఈదా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement