
ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతి ధ్రువపత్రాలు అందజేత
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, నగరపాలకసంస్థ పాఠశాలల్లో ఉద్యోగోన్నతులపై నియమితులైన ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జనరేట్ అయిన ఉద్యోగోన్నతుల ధ్రువపత్రాలను హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎం ఏ.తిరుమలేష్, హెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందిన షేక్ మొహ్మద్ ఖాసిం పాల్గొన్నారు.