
గుంటుపల్లిలో ధాన్యం కొనుగోళ్లు
బల్లికురవ: బల్లికురవ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా బుధవారం గుంటుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఈనెల 19న సాక్షిలో ‘ధాన్యం.. కలవరం’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి, వ్యవసాయ శాఖాధికారులు, సొసైటీ అధికారులు తక్షణమే స్పందించారు. గ్రామాల వారీగా ఈ–పంట నమోదుతో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
మండల వ్యవసాయాధికారి ఎస్వీపీ కుమారి రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏలు గ్రామాల వారీగా రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. నెల్లూరు సన్నాలు కొనుగోళ్లకు అనుమతులు లభించటంతో గుంటుపల్లి గ్రామంలోని రైతుల వద్ద సుమారు 300 బస్తాలు నిల్వ ఉన్నట్లు సొసైటీ పర్సన్ ఇన్చార్జి బ్రహ్మయ్య గుర్తించి 75 కేజీల బస్తా రూ. 1740 లెక్కన కాటాలు వేసి ట్రాక్టర్ ద్వారా మిల్లుకు చేర్చారు. స్థానిక వ్యాపారులు బస్తా రూ. 1200 లకు కొనుగోళ్లు చేస్తూ కాటాలో నిలువుదోపిడి చేస్తున్న పరిస్థితులను ‘సాక్షి’లో కథనం ప్రచురించి సొసైటీ ద్వారా కొనుగోళ్లు జరిగేలా చేసి తమను ఆదుకోవటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, వ్యవసాయశాఖ, సొసైటీ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ట్రాక్టర్కు లోడ్
చేస్తున్న కూలీలు
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన
యంత్రాంగం
నెల్లూరు సన్నాలు కొనుగోళ్లు
ప్రారంభం
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

గుంటుపల్లిలో ధాన్యం కొనుగోళ్లు

గుంటుపల్లిలో ధాన్యం కొనుగోళ్లు