ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 26 2025 1:25 AM | Updated on May 26 2025 1:25 AM

ప్రజల

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బాపట్ల: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఆ ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రభావంతో తీర ప్రాంతాలలో 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

నృసింహస్వామి సేవలో

దేవదాయ శాఖ కమిషనర్‌

మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన కమిషనర్‌ దంపతులకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశ్వీరచనాలు అందజేశారు.

ముగిసిన హనుమాన్‌ దీక్షలు

నగరంపాలెం: స్థానిక మారుతీనగర్‌లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్‌ మండల వ్రత దీక్షలు ఆదివారంతో ముగిశాయి. హనుమత్‌ హవనము మన్యుసూక్త హోమం, గణపతి హోమం నిర్వహించారు. దీక్షాధారులు ఇరుముడులు ధరించి ఆలయ ప్రదక్షిణలు అనంతరం మాల విరమణ చేశారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా మాస శివరాత్రి గంగా గౌరీ సమేత శంకరునికి ప్రదోషకాల అభిషేకం, కల్యాణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కొరపాటి రామారావు, ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్‌, జిల్లా దేవాలయ పరిరక్షణ సమితి కార్యదర్శి నరేంద్రగౌతమ్‌, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం

తెనాలి: పట్టణ నాజరుపేటలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠం శ్రీసదనం శ్రీపరశివానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్‌ కె.చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుక అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

గేట్‌ మేన్‌పై సస్పెన్షన్‌ వేటు

నాదెండ్ల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతులూరు రైల్వే గేట్‌మేన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ నెల 23న ఉదయం 5 గంటల సమయంలో గుంటూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. సాతులూరు సమీపంలో మూడు రైల్వే గేట్లుండగా, 290–291 చందవరం–బుక్కాపురం రోడ్డు వద్ద గేట్లు వేశారు. 289 కనపర్రు రోడ్డు వద్ద వేయకపోవడంతో గూడ్స్‌ రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది. గేట్‌మేన్‌ నిర్లక్ష్యంపై లోకో పైలట్‌ గుంటూరు స్టేషన్‌ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గేట్‌మేన్‌ ఆర్‌. కోటేశ్వరరావును రైల్వే అధికారులు సస్పెండ్‌ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు.

ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి 
1
1/1

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement