
తహసీల్దార్లకు ప్రశంసా పత్రాలు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రశంసాపత్రాలను అందించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కలికిరి, కోడూరు మండలాల తహసీల్దార్లకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కోడూరు మండలం చియ్యవరం గ్రామంలో 25 ఏళ్లుగా పరిష్కారం కాని దారి సమస్యను తహసీల్దార్ మహబూబ్చాంద్ గ్రామస్తులతో మాట్లాడి శాంతియుతంగా పరిష్కరించారని పేర్కొన్నారు. అలాగే కలికిరి మండలం పారపట్ల గ్రామంలోని కురువపల్లెల్లో 20 ఏళ్లుగా ఉన్న దారి సమస్యను తహసీల్దార్ మహేశ్వరీబాయి గ్రామస్తులతో మాట్లాడి శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని దారి సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం చూపడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు.