ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 17 2024 3:30 AM | Updated on Jul 17 2024 3:30 AM

ఉపకార

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటి (జగదాంబసెంటర్‌): జిల్లాలో 9,10 తరగతులు( ప్రీ మెట్రిక్‌),ఇంటర్‌ ఆపై తరగతులు(పోస్టు మెట్రిక్‌) చదువుతున్న విభిన్న ప్రతిభావంతుల నుంచి జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల సహాయ సంచాలకుడు ఆర్‌వీ కృష్ణకిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. http://scholarships/gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రీ మెట్రిక్‌ విద్యార్థులు ఆగస్టు 31లోగా, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులు అక్టోబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు పొడిగింపు

రాయచోటి (జగదాంబ సెంటర్‌): భారత ప్రభుత్వ విద్యాశాఖ, న్యూ ఢిల్లీ వారు జాతీయ ఉపాధ్యాయ అవార్డు– 2024కు దరఖాస్తుల గడు వును పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.శివప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరా లకు http:// nationalwardstoteacher.education.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

రైతు సేవా కేంద్రం తనిఖీ

వీరబల్లి: గడికోట గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మాలకొండయ్య తనిఖీ చేశారు. పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో ఆయన మాట్లాడుతూ నీలి నాలుక వ్యాధి రాకుండా టీకాలు వేయాలని సిబ్బందికి సూచించారు. రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు అందించాలన్నారు. పాడి ఆవులు, మేకలు, గొర్రెల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రవికుమార్‌, గోపాల మిత్ర, రవి, ఏహెచ్‌ఏ బాలు తదితరులు పాల్గొన్నారు.

ఉపకార వేతనాలకు  దరఖాస్తుల ఆహ్వానం   
1
1/1

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement