పేదోడి ఆకలి తీరాలంటే జగన్‌ సీఎం కావాలి | - | Sakshi
Sakshi News home page

పేదోడి ఆకలి తీరాలంటే జగన్‌ సీఎం కావాలి

Jun 5 2025 8:00 AM | Updated on Jun 5 2025 8:00 AM

పేదోడి ఆకలి తీరాలంటే జగన్‌ సీఎం కావాలి

పేదోడి ఆకలి తీరాలంటే జగన్‌ సీఎం కావాలి

తాడిపత్రి టౌన్‌: పేదోడి ఆకలి తీరాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట కార్యదర్శి సుధాకర్‌బాబు అన్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎంగా చేసేందుక ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో బుధవారం జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సీఎం చంద్రబాబు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ వెన్నుపోటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. తాడిపత్రిలో అప్రజాసామ్యం రాజ్యమేలుతోందన్నారు. ఇక్కడ పోలీస్‌ వ్యవస్థ లేదన్నారు. ప్రజాస్వామ్యం అనేది కంటికి కూడా కనిపించదన్నారు. వింత పోకడలు, విచిత్ర పోకడలతో ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్రమంగా నిర్బందిస్తున్నారన్నారు. నిర్బంధాలను ఛేదించుకుని ఏదో ఒక రోజు పెద్దారెడ్డి బయటకు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్‌రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, యువ నేత కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట కార్యదర్శి సుధాకర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement