
నేడు ఏపీ పాలిసెట్
అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్–2025ను బుధవారం నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 22 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 8,879 మంది విద్యార్థులు పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో బాలురు 5,344 మంది, బాలికలు 3,551 మంది ఉన్నారు. ఉదయం 10 గంటలల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జయచంద్రారెడ్డి సూచించారు. 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్ట చేశారు.
1 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్లు
అనంతపురం: జిల్లాలో పలు ప్రాంతాల్లో మే 1 నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి. ఉదయ్భాస్కర్ తెలిపారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కర్రసాము, ఖోఖో, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, వాలీబాల్ ,రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ కార్యాలయం, అశోక్నగర్లో సంప్రదించాలన్నారు.