
మురికి కూపంగా మారుతోంది
ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి..పట్టణం మురికి కూపంగా మారుతోంది. ప్రధాన రహదారుల్లో మాత్రమే చెత్తను తొలగిస్తూ..శివారు కాలనీలను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీల శుభ్రత గాలికొదిలేయడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికితోడు చెత్తా చెదారం పేరుకుపోతుండడంతో వ్యాధులు ముసిరే ప్రమాదముంది. – లక్ష్మి, గృహిణి, రాయదుర్గం