
ఉన్నతస్థాయికి చేరుకోవాలి
అనంతపురం అర్బన్: బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ, కేజీబీవీ, ఎస్సీ సంక్షేమ శాఖల తరఫున 48 మంది విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రం, మెమొంటో ప్రదానం చేసి సన్మానించారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అనంత ఆణిముత్యాలు ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు.
నెట్టికంటుడి సేవలో
హైకోర్టు జడ్జి
గుంతకల్లు రూరల్: రాష్ట్ర హైకోర్టు జడ్జి హరిహరనందశర్మ శనివారం రాత్రి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు స్వామివారి ఫొటో, శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
న్యూస్రీల్

ఉన్నతస్థాయికి చేరుకోవాలి