పుష్పయాగానికి పూలు తరలింపు | - | Sakshi
Sakshi News home page

పుష్పయాగానికి పూలు తరలింపు

May 3 2025 7:32 AM | Updated on May 3 2025 7:32 AM

పుష్పయాగానికి పూలు తరలింపు

పుష్పయాగానికి పూలు తరలింపు

ఎంవీపీ కాలనీ (విశాఖ): తిరుపతిలోని శ్రీ కొండండరామస్వామి వారి పుష్పయాగం కోసం విశాఖ నుంచి వివిధ రకాల పూలను తరలించారు. కార్తీక దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పుష్పాలను శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్‌ వద్ద భక్తుల సందర్శన కోసం ఉంచారు. మహిళా భక్తులు ముందుగా పూలను అందంగా తీర్చిదిద్ది ప్యాకింగ్‌ చేశారు. అనంతరం సంకల్పం చేసి, శాస్త్రోక్తంగా ఈ పూలను తిరుమలకు పంపించారు. కలువలు, తామరలతో పాటు పలు రకాల పూలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్త హిమాన్షు ప్రసాద్‌ తెలిపారు. నగరానికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement