కాలువలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి వ్యక్తి మృతి

Jun 4 2025 12:17 AM | Updated on Jun 4 2025 12:17 AM

కాలువలో పడి వ్యక్తి మృతి

కాలువలో పడి వ్యక్తి మృతి

లక్ష్మణచాంద:నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే వడ్యాల్‌ గ్రామానికి చెందిన రావులబండి ముత్తన్న(51) మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని సరస్వతీ కాలువవైపు కాలకృత్యాల కోసం వెళ్లాడు. ఆకస్మాత్తుగా కాలువలోకి జారీపడిపోయాడు. అటువైపుగా వెళ్లిన స్థానికులు సరస్వతీ కాలువలో మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. సోన్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట మామడ ఎస్సై అశోక్‌, ఏఎస్సై నారాయణరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement