
● జిల్లాలో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ● పలుచోట్ల అన
జిల్లాలో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో)
మండలం నమోదైన వర్షపాతం
జైనథ్ 70.5
ఆదిలాబాద్ అర్బన్ 69.0
ఇచ్చోడ 44.5
మావల 37.5
గుడిహత్నూర్ 18.03
ఇంద్రవెల్లి 15.0
బోథ్ 5.5
భీంపూర్ 5.0
బజార్హత్నూర్ 4.8
ఉట్నూర్ 4.5
జైనథ్ 2.3
నార్నూర్ 1.5
తలమడుగు 0.8
కై లాస్నగర్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్ర వేశించాయి. మరోవైపు అల్పపీడనం సైతం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో జిల్లాలో పలు మండలాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్లో మధ్యాహ్నం 2.30గంట ల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన మొదలైంది.గంటన్నర పాటు ఏకధాటిగా కురవడంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయయ్యాయి. అంబేడ్కర్చౌక్, పంజాబ్చౌక్లతో పాటు రాంనగర్లోని రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వికలాంగుల కాలనీలో వరదనీరు ఇళ్లలోకి చేరింది. జై నథ్లోనూ లోతట్టుప్రాంతాలు జలమయమ య్యా యి. ఇంద్రవెల్లి, బోథ్, భీంపూర్, బజార్హత్నూర్, ఉట్నూర్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంద్రవెల్లి, గాది గూడ మండలాల్లో కురిసిన వర్షానికి ఇంటిపైకప్పులు లేచిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడగా, స్తంభాలు నెలకొరిగాయి. పొల్లుగూడలోని పె ర్సపేన్ ఆలయంపై పిడుగు పడింది. అలాగే జొన్నల కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
రాంనగర్లో రహదారిపై నిలిచిన వర్షపునీరు