తాగునీటి సమస్యపై అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యపై అప్రమత్తంగా ఉండాలి

Published Thu, Mar 28 2024 12:50 AM

-

తలమడుగు: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అన్నారు. మండలంలోని ఖోడథ్‌, తలమడుగు జీపీలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీపీవో మాట్లాడారు. వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో నీటిఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పారిశుధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. అనంతరం ఇంటి పన్ను వసూలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేసామని ఎంపీవో వినోద్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజశేఖర్‌,ఈజీఎస్‌ ఏపీవో మేఘమాల తదితరులు పాల్గొనారు.

Advertisement
Advertisement