-
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
ఇసుక మాఫియా రోజురుజుకీ రెచ్చిపోతుంది. వారి రాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారింది. తాజాగా మధ్యప్రదేశ్లో షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్ అధికారి బలయ్యారు. అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపేశారు.ఈ హేమమైన ఘటన మధ్యప్రదేశ్లోని షాడోల్లో చోటుచేసుకుంది. షాడోల్ అసిస్టెంట్ ఎస్సై మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రసాద్ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఘటనా ప్రాంతానికి అక్రమ మైనింగ్ తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ఓ ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న ట్రాక్టర్ను ఆపేందుకు యత్నించగా.. డ్రైవర్ దానిని ఆయనపై నుంచి పోనిచ్చాడు. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్ ఓనర్, ఆయన కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్ ఓనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ ఓనర్ కోసం గాలిస్తున్నారు.ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు పోటీ
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపిన హంతకుడి బంధువు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందిరా గాంధీని హత్య చేసిన ఇద్దరిలో ఒకరైన బీయాంత్ సింగ్ కొడుకు సరబ్జిత్ సింగ్ ఖల్సా.. పంజాబ్లోని ఫరీధ్కోట్ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. 45 ఏళ్ల ఈయన 12 తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. గతంలోనూ పలు ఎన్నికల బరిలో నిలిచిన సరబ్జిత్.. ప్రతిసారి ఓటమినే చవిచూశారు. 2014, 2009లో, సరబ్జిత్ సింగ్ ఖల్సా వరుసగా ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్డ్) మరియు భటిండా స్థానాల నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. అలాగే 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో ఎన్నికల అఫిడవిట్లో సరబ్జిత్ సింగ్ తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా ప్రకటించారు. 2019 ఎన్నికలలో,బహుజన్ సమాజ్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. సరబ్జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ బఠిండా నుంచి విజయం సాధించారు. ఇక 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఫరీద్కోట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సాదిఖ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచిఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో నిలిచారు. . శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. చదవండి: పాకిస్తాన్కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్నాథ్ సింగ్ -
ఎన్ఆర్ఐ అభిజిత్ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి?
అమెరికాలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పరుచూరి అభిజిత్ది హత్యకాదని అమెరికా పోలీసులు తేల్చారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తమ ప్రాథమిక విచారణలో హత్య అని అనుమానించేందుకు ఆధారాలేవీ లేవని చెప్పినట్లు న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు. అభిజిత్ అకాల మరణంపై విచారాన్ని వ్యక్తం చేసిన కాన్సులేట్, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ ఎక్స్( ట్విటర్) పోస్ట్లో పేర్కొంది. దీంతో అభిజిత్ ఆత్మహత్య చేసుకున్నాడా?అనే అనుమానాలు తలెత్తెతున్నాయి. అదే నిజమైతే అభిజిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అసలు డెడ్ బాడీ అడవిలోకి ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తమ తనయుడు అభిజిత్ను మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో అడవిలో వదిలివెళ్లారని ఆరోపించిన సంగతి తెలిసిందే. చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులు చాన్నాళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతని సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే రోజు గుర్తించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిజిత్ భౌతిక కాయానికి స్వస్థలం బుర్రిపాలెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏడాది (2024) ప్రారంభం నుండి, అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు తొమ్మిది మంది మరణించడం విషాదం. Deeply saddened to learn about the unfortunate demise of Mr. Abhijeeth Paruchuru, an Indian student in Boston. Mr. Puruchuru’s parents, based in Connecticut 🇺🇸, are in direct touch with detectives. Initial investigations rule out foul play. @IndiainNewYork rendered… — India in New York (@IndiainNewYork) March 18, 2024 -
లైంగిక కోరిక.. కాదన్నందుకు వ్యక్తిని హత్య చేసిన స్నేహితులు
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. మంచి, మర్యాద మరిచి నీచానికి తెగబడుతున్నారు. అసభ్యంగా ప్రవర్తించి మానవత్వానికి మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. లైంగిక కోరిక(ఓరల్ సెక్స్) తీర్చలేదని తోటి స్నేహితులే ఓ వ్యక్తిని హత్య చేశారు.. ఈ దారుణం బరన్ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న ఓం ప్రకాష్ బైర్వా(40), అతని స్నేహితులు మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్తో కలిసి మద్యం సేవించారు. అనంతరం ముగ్గురు ప్రజాపతి సోదరుడిని చూడటానికి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రజాపతి, మురళీధర్ తమతో ఓరల్ సెక్స్ చేయాలని బైర్వాను బలవంతం చేశారు. అందుకు అతను ససేమిరా అనడంతో బలమైన ఆయుధంతో నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు సురేంద్ర యాదవ్, మురళీధర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని విచారిస్తుండగా.. మరొరకు అరెస్ట్ భయంలో విషం తాగడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బరన్ ఎస్పీ రాజ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. కాగా ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, సరేంద్ర యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు అని బరన్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాంవిలాస్ తెలిపారు. చదవండి: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా? -
అండగా ఆదిశక్తి
మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు.. అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్ భూతం బాలికలపై వికృత చేష్టలు.. ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయ్యాకగానీ స్పందన, న్యాయం జరిగేది కాదు. ఇదంతా గతం. మగువలు బాధితులుగా మారక ముందేరక్షణ ఛత్రంగా నిలవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఆ ఆలోచనల్లో నుంచే అలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన సంధించిన పాశుపతాస్త్రం ‘దిశ’ అన్ని సమస్యలకూ ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్ మన ఆడపిల్లల రక్షణ ‘దిశ’గా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం. అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం.. ఆపత్కాలంలో దిశ యాప్లోని బటన్ నొక్కితే.. మహిళలకు నిశ్చింతే.. సత్వర సాయమే కాదు.. దిశ పోలీసు స్టేషన్లతో సత్వర న్యాయమూ.. –సాక్షి, అమరావతి సీఎం జగన్ మది నుంచి పుట్టిన ‘దిశ’ అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామంటే చాలు క్షణాల్లో పోలీసులు చేరుకుని భద్రత కల్పించే వ్యవస్థ ఏర్పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన. అందులో నుంచి పుట్టిందే దిశ మొబైల్ యాప్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్ మహిళల భద్రతకు పర్యాయపదంగా మారింది. మగువలకు అనుక్షణం రక్షణగా నిలిచే దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లు ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టాయి. యావత్ దేశానికి ఇవి దిక్సూచిగా నిలిచాయి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరు కుని రక్షణ కవచంలా నిలుస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దిశ’కు జాతీయస్థాయిలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. అవార్డులు వరించాయి. ఎన్నో రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. రికార్డు స్థాయిలో 1.50 కోట్ల డౌన్లోడ్లు 2020 డిసెంబర్ 15న అందుబాటులోకి వచ్చిన దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. ఈ యాప్ను ఇంతవరకు కోటీ 50 లక్షల 10 వేల 15 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్లోడ్తోనే ఆగిపోకుండా కోటీ 29 లక్షల 8 వేల 530 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్లలో దేశంలో దిశ యాప్దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల పరిధిలోనైతే 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలైతే 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇంతవరకు 10 లక్షల 80 వేల 454 ఎస్ఓఎస్ కాల్ రిక్వెస్ట్లు వచ్చాయి. కొత్తగా యాప్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి, రెండుసార్లు ఎస్ఓఎస్ బటన్ నొక్కి చూస్తారు. వాటిని మినహాయిస్తే పోలీసు చర్యలు తీసుకునే కాల్స్ 31,607 ఉన్నాయి. వీటన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన న్యాయం అందించారు. దిశ యాప్లో సగటున రోజుకు 250 కాల్స్ వస్తున్నాయి. దశ‘దిశ’లా నిఘా లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2 లక్షల 17 వేల 467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచారు. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలు సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలు నిర్మిస్తున్నారు. గతంలో ఫోరెన్సిక్ నివేదికకు మూడు నాలుగు నెలలు పడితే.. ప్రస్తుతం 48 గంటల్లోనే వస్తున్నాయి. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమం దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇంతవరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కచెల్లెమ్మల రక్షణకు దిశ పోలీస్ స్టేషన్లు ♦ దిశ యాప్ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్లతో ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలు ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చారు. 60 రోజుల్లోనే దర్యాప్తు 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. జాతీయ స్థాయిలో ప్రశంసలు దిశ వ్యవస్థకు ఇంతవరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించాయి. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. నేరం చేస్తే శిక్ష ఖాయం మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. ఇంతవరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. -
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా?
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం జరిగింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి ఉంది అనగా.. వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతకంగా 15సార్లు పొడిచి మరి ప్రాణాలు తీశారు అగంతకులు. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్ జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఇతడికి గురువారమే పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా మరికొన్ని గంటల్లో వధువు మెడలో తాళి కడతాడనే సమయంలో తన ఇంట్లోనే తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. అతని ముఖం, ఛాతీపై 15 సార్లు కత్తితో పొడిచిన గుర్తులు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే సింఘాల్ హత్య విషయంలో తమ కుటుంబంలో ఎవరిని అనుమానించడం లేదని మృతుడి మేనమామ జావవర్ తెలిపారు. అతడ్ని ఎవరూ చంపారే విషయంలో కుటుంబానికి తెలియదని, ఇంటి దగ్గర బ్యాండ్ సౌండ్ వస్తుండటంతో తమకు ఎలాంటి అరుపులు వినపడలేదని తెలిపారు. హత్యపై పోలీసులు సరైన విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. మరోవైపు మృతుడికి, అతడి తండ్రితో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసిందని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ కేసుపై అయిదు బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందిడిని అదుపులోకి తీసుకొని, హత్యకు దారితీసిన కారణాలను వెల్లడిస్తామని తెలిపారు. -
రాజీవ్ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ మృతి!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిర్రోసిస్తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు. 2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు. -
చేతబడి నెపంతో తల్లీకొడుకుల హత్య
గూడూరు: మంత్రాలతో చేతబడులు చేస్తున్నారనే నెపంతో పట్టపగలే తల్లీకొడుకులను స్వయానా వారి బంధువే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘ టన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా.. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క (55), కొమురయ్య దంపతులకు కుమారుడు సమ్మయ్య (32) ఉన్నాడు. సమ్మయ్య దివ్యాంగుడు. వరంగల్లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన వారికి బంధువైన శివరాత్రి కుమారస్వామి తన కుటుంబానికి హాని కలిగించేలా సమ్మయ్య, సమ్మక్క మంత్రాలు, పూజలు చేస్తున్నారని, వారి తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్సై రాణాప్రతాప్ ఇరువురినీ పిలి పించి మాట్లాడారు. మంగళవారం పెద్దల సమక్షంలో మరోసారి మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారు. అనుకున్న ప్రకారం.. మంగళవారం సమ్మక్క కు టుంబసభ్యులు స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదుదా రుడు కుమారస్వామి రాకపోవడంతో పోలీసులు అతనికి ఫోన్ చేయగా తనకు వేరే పని ఉందని, మ రోరోజు మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో పోలీసులు సమ్మక్క కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లమని చెప్పారు. పోలీసులు పిలిచినా రాకుండా.. మాటు వేసి పోలీస్స్టేషన్ నుంచి సమ్మక్క కుటుంబసభ్యులు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే కాపుకాసిన కుమారస్వామి మరోవైపు నుంచి ఆటోలో వచ్చి అ డ్డుగా పెట్టాడు. తన ఆటోలోని ఇనుపరాడ్డును తీ సుకొని అందరూ చూస్తుండగానే ముందుగా సమ్మ క్క తలపై బలంగా కొట్టాడు. ఆమె తల పగిలి కిందపడగా, భర్త కొమురయ్య ఆడ్డుకోబోగా అతన్ని కూడా రాడ్తో కొట్టడంతో అతని చేయి విరిగి పడి పోయాడు. వికలాంగుడైన సమ్మయ్య ఆడ్డురాగా అతని తలపై రాడ్తో బాదాడు. అందరూ చూస్తుండగా అక్కడికక్కడే తల్లీకొడుకులు రక్తపు మడుగు లో చనిపోయారు. స్థానికులు, సమీప వ్యాపారస్తు లు ఘటనాస్థలంలోనే కుమారస్వామిని బంధించి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోలీ సులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రయత్నం చేయగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యు లు, బంధువులు అడ్డుకున్నారు. హత్యలకు కార ణం పోలీసులేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆందోళనకారులు శాంతించారు. మృతుడు సమ్మయ్య భార్య రజిత ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడి భార్యకు అరోగ్యం బాగాలేకపోవడానికి సమ్మక్క కుటుంబం చేస్తున్న పూజలే కారణమని కొంతకాలంగా ఆ కుటుంబంపై వైరం పెంచుకున్నట్లు స్థానికులు తెలిపారు. -
కోరుట్లలో దారుణ హత్య!
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో అనుమల్ల వెంకటరమణ (54) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో నివాసముండే అనుమల్ల వెంకటరమణ డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తాడు. పట్టణ శివారులోని అర్బన్ కాలనీలోనూ వెంకటరమణకు ఓ ఇల్లు ఉండటంతో అక్కడి వాళ్లకు ఇచ్చిన రుణాల వసూలుకు ప్రతిరోజూ సాయంత్రం కాలనీకి వెళ్తాడు. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీలో డబ్బులు వసూలు చేసుకుని మోటార్ సైకిల్పై వెళుతుండగా, అదే కాలనీలో ఉంటున్న వాసాల రఘు (32) అనే యువకుడు వెంటపడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ, వీపు భాగాల్లో గాయాలతో వెంకటరమణ కింద పడిపోయాడు. కిందపడిపోయిన వెంకటరమణపై రఘు మరోసారి కత్తితో దాడిచేయడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం రఘు మోటార్సైకిల్పై పరారయ్యాడు. దాడికి పాల్పడిన సమయంలో రఘును అడ్డుకోవాలని వెంకటరమణ స్థానికులను ప్రాధేయపడినా.. రఘు బెదిరింపులతో వారు దగ్గరకు రాలేకపోయారు. కాగా, హత్యకు గురైన వెంకటరమణకు కాలనీలో ఉన్న ఓ మహిళతో పరిచయం ఉన్నట్లు సమాచారం. అనంతరం సదరు మహిళ బంధువుతోనూ సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసినట్టు.. ఈ క్రమంలోనే వెంకటరమణకు, రఘుకు మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వెంకటరమణను హత్యచేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనకాపల్లి: పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ దారుణ హత్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ను దారుణంగా హత్య చేశారు. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయుల విద్యార్ధుల మరణాలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు సైనీ తలపై 50 సార్లు సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్ధి అమెరికాలో ప్రాణాలు విడిచాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్లో మాస్టర్స్చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్లోని మారిస్ జే జుకక్రో లాబొరేటరీస్ సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది. Our son Neel Acharya is missing since yesterday Jan 28( 12:30 AM EST) He is studying in Purdue University in the US. He was last seen by the Uber driver who dropped him off in Purdue university. We are looking for any info on him. Please help us if you know anything. pic.twitter.com/VWIS5uyJde — Goury Acharya (@AcharyaGoury) January 29, 2024 తల్లి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే.. తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్స్టాగగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కొడుకు జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను యూఎస్లోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు తెలిపారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. తాము పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
పుణె హోటల్లో దారుణం.. సాఫ్ట్వేర్ యువతిని కాల్చిచంపిన ప్రియుడు
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రియుడి చేతితో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలి క్యారెక్టర్పై అనుమానం పెంచుకున్న ప్రియుడు.. ఆమెను పుణెలోని హోటల్కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన పింప్రి చించ్వాడ్లోని హింజవాడిలో ఓయో టౌన్ హౌజ్లో ఆదివారం వెలుగుచూసింది. నిందితుడిని రిషబ్ నిగమ్గా గుర్తించిన పోలీసులు ముంబైలో అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన వందన ద్వివేది అనే యువతి హింజావడిలోని ప్రముఖ ఐటీసంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన రిషబ్ నిగమ్కు.. వందనకు పదేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వందనను కలిసేందుకు రిషబ్ పుణె వచ్చాడు. ఇద్దరు కలిసి హింజవడిలో హోటల్లో గదితీసుకొని జనవరి 25 నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి వందనను తుపాకీ కాల్చి చంపిన రిషబ్.. అనంతరం హోటల్ నుంచి పరారయ్యాడు. ఆదివారం హోటల్ సిబ్బందికి గదిలో వందన మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వందనపై అనుమానం పెంచుకుని, ఆమెను చంపేయాలన్న ఆలోచనతోనే పుణె వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వందనను కాల్చి చంపిన తరువాత శనివారం రాత్రి 10 గంటలకు ఒక్కడే గది నుంచి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. హత్య అనంతరం నిందితుడు ముంబైకు పారిపోవడంతో అక్కడే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి -
అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్యచేసిన స్నేహితులు
న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో స్నేహితులే అతన్ని కుట్ర పన్ని అంతమొందించారు. పెళ్లికి తీసుకెళ్లి... తిరిగిరాని లోకాలకు పంపించారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్పాల్ సింగ్కు 24 ఏళ్ల కుమారుడు లక్ష్య చౌహాన్ ఉన్నాడు.ఇతడు తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహిలు వికాస్ భరద్వాజ్, అభిషేక్లతో కలిసి హర్యానాలోని సోనేపట్లో జరిగిన వివాహ వేడుకకు ముగ్గురు హారయ్యారు.. ఆ తర్వాత లక్ష్య చౌహాన్ తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన తండ్రి ఎసీపీ అధికారి యశ్పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్యతో కలిసి కారులో వెళ్లిన స్నేహితుడు అభిషేక్నును అదుపులోకి తీసుకొచిన విచారించగా అసలు విషయం చెప్పాడు. వికాస్ భరద్వాజ్, లక్షయ్, తాను ముగ్గురం కలిసి కారులో సోనెపట్కు వెళ్లామని, వివాహం అనంతరం అదేరోజు రాత్రి ఇంటికి బయలుదేరామని చెప్పాడు. చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కూలీలతో వెళ్తున్న ఆటో.. ముగ్గురు దుర్మరణం మార్గంమధ్యలో పానిపట్ దగ్గర మునక్ కాలువ వద్ద మూత్రవిసర్జన కోసం కారు ఆగినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్, తాను కలిసి చౌహాన్ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం అదే కారులో వికాస్ తనని ఢిల్లీ సమీపంలోని నెరెలా వద్ద విడిచిపెట్టాడని తెలిపాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకున్నారు. నిందితుడు వికాస్ భరద్వాస్ కూడా తీస్ హజారీ కోర్టులోనే క్లర్క్గా పనిచేస్తున్నాడు. వికాస్ గతంలో లక్షయ్కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే లక్షయ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న వికాస్ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మరో స్నేహితుడు అభిషేక్ను ఇందుకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద సెక్షన్లు నమోదు చేశారు. -
Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదంటున్నాడని పక్కా పథకంతో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడు తన సన్నిహితురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. షేక్పేట సమీపంలోని జైహింద్నగర్ కాలనీలో నివసించే గౌస్ మొహినుద్దీన్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దుబాయ్లో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఇటీవలే నగరానికి వచ్చి భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన భార్య మీనా రూహీ 2002 ఫిబ్రవరిలో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లింది. మూడు నెలలకే ఆమె భర్త గౌస్ మొహినుద్దీన్ కూడా ముగ్గురు పిల్లలను తీసుకుని లండన్ వెళ్లి ఆమెతో పాటు కొన్నాళ్లు ఉన్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. గౌస్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నగరానికి వచ్చారు. భార్య మీనా లండన్లో ఉంది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన అద్నాన్ హుస్సేన్ (26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్యసానిహిత్యం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని మీనా రూహీని బలవంతం పెట్టాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్కు తిరిగివచ్చింది. గత నవంబర్ 14న అద్నాన్పై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అద్నాన్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. మీనాను తనతో పాటు తీసుకెళ్లాలని పక్కా పథకంతో అద్నాన్ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దని ఒప్పందం చేసుకుని వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. కాగా.. ఈ నెల 14న రాత్రి గౌస్ మొహినుద్దీన్ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని పుప్పాలగూడలో ఓ విందుకు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్పై తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న అద్నాన్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లి మీనా రూహీని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించగా ఆమె భర్త గౌస్ అడ్డుకున్నాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అద్నాన్ ఆగ్రహంతో ఊగిపోతూ గౌస్ గుండైపె గట్టిగా పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గౌస్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
Suchana Seth: కసాయిగా మారిన కన్నతల్లి.. కొడుకునెందుకు చంపింది?
గోవాలో కన్నకొడుకుని హతమార్చిన బెంగుళూరు సీఈఓ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్టార్టప్ కంపెనీకి సీఈఓ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్లో మేధావి అయిన మహిళ నాలుగేళ్ల పసివాడిని గోవాలో అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతేగాక చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి రహస్యంగా బెంగుళూరుకు తీసుకురావడాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పుడుస్తోంది పనాజీ/ బెంగళూరు: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో నిందితురాలిని చిత్రదుర్గ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కన్నతల్లి అంత కసాయిరాలుగా ఎందుకు మారింది.. పేగు బంధాన్ని తెంపుకొని కొడుకును హత్య చేయడానికి గల కారణాలేంటనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని చంపేందుకు అదే కారణమా? 39 ఏళ్ల సుచనకు, ఆమె భర్త వెంకట్ రామన్కు మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఈఓకు భర్త వెంకట్ రామన్ మద్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచిదూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది. అనంతరం బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ సిబ్బందిని కోరింది. కొడుకుతో కలిసి హోటల్ లోపలికి వెళ్లిన మహిళా.. సోమవారం ఒంటరిగా బయటికి వెళ్లడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంబంధిత వార్త: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అపర మేధావి.. ఎవరీ సుచనా సేథ్! బ్యాగ్లో దాచి.. గోవా నుంచి కర్ణాటకకు.. ఇంతలో ఎవరికి అనుమానం రాకుండా కొడుకు మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టిన మహిళ.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. మరోవైపు గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్కు కాల్ చేసి కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచననాను అడిగారు. తన స్నేహితురాలి వద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చింది. అయితే ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు మళ్లీ క్యాబ్ డ్రైవర్కు కాల్ చేసి సుచనాకు అర్థం కాకుండా ఉండేందుకు కొంకణి భాషలో మాట్లాడారు. దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్కు పోలీసులు చెప్పడంతో అతడు తన కార్ను నేరుగా దగ్గర్లోని చిత్రదుర్గ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాడు. దీంతో చిత్రదుర్గలో సుచనాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన మహిళను.. ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. ఎవరీ సుచనా.. లింక్డ్ఇన్ ఫ్రొఫైల్లోని వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచన.. కలకత్తాలోని యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆస్ట్రోఫిజిక్స్తో పాటు ప్లాస్మా ఫిజిక్స్లో నైపుణ్యం సాధించింది. అదే విధంగా సంసృతంలో పీజీ పట్టా అందుకుంది. తరువాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్గా ప్రావిణ్యం పొందింది. ఈ రంగంలో ఆమెకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ క్రమంలో 2020లో మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి.. దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. కాగా 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్లో ఉన్నారు. -
Divya Pahuja: అశ్లీల ఫొటోలతో బెదిరిస్తోందనే చంపేశాడా?
మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోట్ల నుంచి మృతదేహాన్ని తరలించిన బీఎండబ్ల్యూ కారును పోలీసులు తాజాగా పంజాబ్లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా, లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పటియాలాలోని బస్ స్టేషన్లో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉందని గురుగ్రామ్ పోలీస్, క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. దివ్య మృతదేహాన్ని పంజాబ్కు తరలించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితులు బాల్రాజ్, రవి బంగర్ పరారీలో ఉన్నారని, వీరికోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యతోపాటు ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్కు చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, దివ్య వద్ద మరో ఫోన్ ఉందని ఆమె సోదరి చెప్పిందని, దాని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. కాగా పహుజా తన ప్రియుడు, గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించి గతేడాది జూన్లో బెయిల్పై విదుదల అయ్యారు. బుధవారం గురుగ్రామ్లోని ఓ హోటల్లో విగత జీవిగా కనిపించారు. హోటల్ యజమాని అభిజీత్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వార్త: మాజీ మోడల్ దారుణ హత్య నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు దివ్య ఫోన్లో ఉన్నాయని.. వాటిని డిలీట్ చేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్లే కలిసి అభిజీత్తో హత్య చేయించారని ఆరోపించింది. గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో గడోలీ మరణించాడు. అతడి గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. -
Ex-Model Divya Pahuja: గురుగ్రామ్లోని హోటల్లో మాజీ మోడల్ దారుణ హత్య
హర్యానాలోని గురుగ్రామ్లో ఘోరం జరిగింది. ఓ హోటల్లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితుడిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్గా తేల్చారు. అబిజిత్తోపాటు అతడి హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ప్రకాశ్, ఇంద్రజ్లను గురుగ్రామ్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేదుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అభిజిత్, యువతి, మరో వ్యక్తి జనవరి రెండో తేదిన హోల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి రూమ్ నెంబర్111కు వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తోంది. హోటల్ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం రికార్డయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2016లో గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. అయితే గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్, అభిజీత్తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్లో బెయిల్పై విడుదలైంది. -
‘నందిని మంచితనమే ఆమె పాలిట శాపంగా మారింది’
తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతి.. నందిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా లింగ మార్పిడి(ట్రాన్స్ మెన్) ఆపరేషన్ కూడా చేసుకుంది. పాండి మహేశ్వరి కాస్తా వెట్రిమారన్గా పేరు మార్చుకుంది. చివరికి ఆమెనే నందినిని అత్యంత దారుణంగా హత్య చేయడం విస్మయానికి గురిచేస్తుంది. యువతి చేతులు, కాళ్లకు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చెన్నై శివారులోని పొన్మార్ అనే ఓ నిర్మానుష్య ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసఙఃధఙ మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్గా మారి తన పేరును వెట్రిమారన్గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశాడు. నందిని అతని ప్రేమను నిరాకరించినప్పటికీ అతనితో సన్నిహతంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే అనుమానంతో వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. నందిని పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి, అనాథాశ్రమానికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ పోసి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల ముందే హత్యకు పథకం రచించాడని పేర్కొన్నారు. తాజాగా నందినికి సంబంధించి పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు వెట్రిమారన్ ట్రాన్స్ మెన్గా మారిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబంధాలు తెంచుకున్నా.. నందిని మాత్రం అతనితో స్నిహితురాలుగానే ఉంది. అయితే ఆమె మంచితనమే నేను ఆమె ప్రాణాలు తీసిందని బాధితురాలి సోదరి అముద వాపోయింది. తన సోదరి హత్యకు గురైందన్న నిజాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు నందిని, వెట్రమారన్కు గల బంధాన్ని గుర్తు చేసుకుంది. మహేశ్వరి ట్రాన్స్ మెన్గా మారిన తర్వాత మిగతావారు అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. కానీ స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో సన్నిహితంగా ఉండటానికే ఇష్టపడిందని తెలిపింది. వెట్రిమారన్ ఎప్పుడు మధురై వచ్చినా వాళ్ల ఇంటికి వచ్చేవాడని తానే స్వయంగా తన చేతులతో తినిపించేదాన్నని పేర్కొంది. తన కుమార్తె వెట్రిమారన్తో మానవతా హృదయంతో తన స్నేహాన్ని కొనసాగించిందని బాధితురాలి తండ్రి అన్నారు. ఈ విషయంలో తమకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వెట్రిమారన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కానీ తన కూతురు చూసి తట్టుకోలేకపోతున్నట్లు వాపోయారు. మెట్రిమారన్ ఇంత క్రూరానికి పాల్పడతాడని ఊహించలేదని అన్నారు. ‘నా కూతుర్ని కాలిపోయిన శరీరంతో. చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టివేయడం చూశాము. ఇక వ్యక్తి ఇంత దారుణంగా చంపుతారా? ఆమె జీవితం ఇంత క్రూరమైన రీతిలో ముగిసిందనే విషయం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?
చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు. పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు. కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com 8019 000066 -
పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను తండ్రి సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా భార్యను భర్త, అత్త, మామ వేధిస్తున్నట్లు సమాచారం. హత్య అనంతరం భార్య మాధురితో సహా బంధువులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
పాక్లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్లో కాల్చి చంపారు. అక్రమ్ ఖాన్ అలియాస్ అక్రమ్ గాజీ.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలో గురువారం అంగతకుల కాల్పుల్లో మరణించారు. కాగా అక్రమ్ ఖాన్ 2018 నుంచి 2020 వరకు ఎల్ఈటీ రిక్రూట్మెంట్ సెల్కు నాయకత్వం వహించారు. పాక్లో భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అతడు పేరుగాంచారు. అక్రమ్ చాలా కాలంపాటు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతను ర్రికూట్మెంట్ సెల్ అధిపతిగా ఉన్న సమయంలో సానుభూతిగల వ్యక్తులను గుర్తించి వారిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకపాత్ర వహించారు. ఇదిలా ఉండగా గత నెల అక్టోబర్లో పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో హత్యకు గురైన విషయం విదితమే. పంజాబ్లోని సియాల్ కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. గుజ్రాన్వాలా నగరానికి చెందిన లతీఫ్.. భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్కోట్లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి మాస్టర్మైండ్ లతీఫే. చదవండి: Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement