-
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి. -
‘పోలీస్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ అనాసక్తితో.. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశించింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.డ్రైవర్ల డబుల్ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే, జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. -
‘పోలీస్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ అనాసక్తితో.. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశించింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.డ్రైవర్ల డబుల్ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే, జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. -
ఆర్థిక మోసాలపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం కేవైసీ నిబంధనలను కఠినతరం చేయడం, బిజినెస్ కరెస్పాండెంట్లను (బీసీ) చేర్చుకునేటప్పుడు మదింపు ప్రక్రియను మరింత పటిష్టం చేసేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించడం మొదలైన అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే వ్యాపారులు, బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) మదింపు ప్రక్రియను పటిష్టం చేయడమనేది మోసాల నివారణతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు దోహదపడగలదని వివరించాయి. సాధారణంగా వ్యాపారులు, బీసీల వద్దే డేటా ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే డేటాకు భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. సైబర్ మోసాలకు హాట్స్పాట్స్గా ఉన్న ప్రాంతాల్లో బీసీలు ఎక్కువగా ఉండటాన్ని, వారి ఆన్బోర్డింగ్ ప్రక్రియను పునఃసమీక్షించుకోవాలని, మోసాల్లో ప్రమేయమున్నట్లుగా తేలిన మైక్రో ఏటీఎంలను బ్లాక్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక మోసాల నివారణపై ఇటీవల జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ మేరకు సూచనలు వచి్చనట్లు పేర్కొన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2023లో రూ. 7,489 కోట్ల సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించి 11,28,265 కేసులు నమోదయ్యాయి. -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
సర్కారుపై ‘విరమణ’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తక్షణ బెనిఫిట్లను చెల్లించేందుకు ఏటా రూ.3,500 వేలకోట్ల భారం పడనుంది ఈ మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్టు సమాచారం. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన తక్షణ బెనిఫిట్ల కింద రూ.3,200 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఇక నుంచి ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరగనుండటం ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. సరాసరి రూ.40 వేల మూల వేతనం ఈ ఏడాది రిటైర్మెంట్లను పరిశీలిస్తే 1,419 మంది గెజిటెడ్ స్థాయి, 5,360 మంది నాన్ గెజిటెడ్ స్థాయి, 1,216 మంది క్లాస్–4 ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. నాన్ గెజిటెడ్ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రిటైరయ్యే వారి సగటు మూల వేతనం రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. దీనికి హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి. అంటే సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి రూ.38లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను వారి హక్కుగా ఇవ్వాలి. ఈ ఏడాది రిటైరయ్యే 7,995 మందికి ఈ బెనిఫిట్లను చెల్లించాలంటే రూ.3 వేల కోట్లకుపైగా అవసరం. ఇక 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని లెక్కలు చెప్తున్నాయి. అంటే వారికి తక్షణ బెనిఫిట్ల కింద సగటున ఏటా రూ.3,500 కోట్ల వరకు చెల్లించాలి. దీనితో ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితేమిటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరిలో చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదో డీఏ (జూలై, 2024) కూడా ముందుకు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ నాలుగు డీఏల చెల్లింపును సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రిటైరైన ఉద్యోగులకు వారి జీఎల్ఐతోపాటు జీపీఎఫ్పై వడ్డీ చెల్లించాలని.. ఇవన్నీ కలిపితే చాలా భారం పడుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచి అప్పటికి ఈ భారం నుంచి గట్టెక్కిందని.. ఇప్పుడు చెల్లించక తప్పదని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం నెలకు రూ.250 కోట్లదాకా అవసరమన్నారు. ఎప్పటికప్పుడే బెనిఫిట్లు చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు రిటైర్మెంట్లతో సర్కారుపై భారమన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి రిటైరవడానికి మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఉద్యోగుల హక్కు కింద ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసును మరోసారి పెంచడం వంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నాయి. -
గ్రూప్–2, గ్రూప్– 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్– 2, గ్రూప్–3 ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. శాఖల వారీగా గుర్తించిన గ్రూప్–2, గ్రూ ప్–3 ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమ ర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులను ఆదేశించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేశారు. 2022 ఆగస్టు 30వ తేదీ నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా భర్తీకి అప్పట్లో ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈమేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఆగస్టు 2022 తర్వాత నుంచి గుర్తించిన ఖాళీలు, మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రానున్న ఏడాది కా లంలో ఖాళీ కానున్న గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల వివరాలను గురువారం సాయంత్రం 5గంటల్లోగా సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్ను ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ అధికారులు పంపించారు. కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగ వంతం చేసింది. గ్రూప్–2 కేటగిరీలో 783 ఖాళీలుండగా... వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అదేవిధంగా గ్రూప్–3 కేటగిరీలో 1388 ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో అర్హత పరీక్షలను నిర్వహించనుంది. తాజాగా ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా... కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలా? అనే కోణంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. -
అప్పుల్లో అడుగునే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. పేదలను ఆదుకున్న డీబీటీ.. కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే. -
దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘వికసిత భారత్’నాలుగు స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను మరింత శక్తివంతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అని కొనియాడారు. గురువారం బడ్జెట్ అనంతరం ఆయన టీవీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’పునాదిని బలోపేతం చేసే హామీని ప్రస్తుత బడ్జెట్ ఇస్తోందని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సమగ్రంగా, వినూత్నంగా ఉందని, దేశ పురోభివృద్ధిపై పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రశంసించారు. భారతదేశ యువ త ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించిన ట్లు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ప్రకటించినట్లు గుర్తుచేశారు. గ్రామాలు, నగరాల్లో పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని, మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. తొ లుత 2 కోట్ల మంది మహిళలను ’లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించకున్నామని, ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇకపై అంగన్వాడీ సభ్యు లు, ఆశావర్కర్లు సైతం లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తాజా బడ్జెట్లో ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయాలను భారీగా పెంచినట్లు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయించారని, ఆర్థికవేత్తల భాషలో చెప్పాలంటే ఇది తీపి కబురేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల 21వ శతాబ్దంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని, కోట్లాది మంది యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘వందేభారత్ స్టాండర్డ్’కింద 40 వేల ఆధునిక కోచ్లను తయారుచేసి, సాధారణ ప్యాసింజర్ రైళ్లలో చేర్చాలని బడ్జెట్లో ప్రకటించారని, ఇది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే మార్గాల్లో లక్షల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించారు. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ పేద, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించడం, వారికి కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించడంపై బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్ల ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని అన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆదాయపు పన్ను ఉపశమన పథకంతో దాదాపు కోటి మంది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన లబ్ధి కలుగుతుందన్నారు. నానో డీఏపీ వినియోగం, పశువుల కోసం కొత్త పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని వివరించారు. -
Interim Budget 2024: ఆర్థికమంత్రి హల్వా విందు...
2024 మధ్యంతర బడ్జెట్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు ప్రతీకాత్మకంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికశాఖ నార్త్బ్లాక్లో హల్వా విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ అధికారికంగా ప్రారంభమవుతుంది. లోక్సభలో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టేంతవరకూ ముద్రణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ‘లాక్–ఇన్’లో ఉంటారు. బడ్జెట్కు ముందు సంప్రదాయంగా వస్తున్న ఈ హల్వా రుచుల ఆస్వాదన కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి కరాద్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంతా పాండే తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో భారీ అంచనాలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో ఆర్భాటాలకు పోవద్దని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిపాదనల తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాలను పంపాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు 52 పేజీలతో కూడిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపారు. ఈ నెల 9లోగా ఆన్లైన్లో ఈ ప్రతిపాదనలను పరిపాలన విభాగాల నుంచి సచివాలయానికి పంపాలని, ప్రతిపాదనలను పరిశీలించి అదే నెల 11లోగా సచివాలయ అధికారులు ఆర్థిక శాఖకు పంపించాలని ఆ విధివిధానాల్లో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచనలివే: ♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను కొనసాగించాలో వద్దో నిశితంగా పరిశీలించాలి. ♦కొత్త పథకాలను ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఎప్పటి నుంచి అమలు కావాలి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చవుతుందన్నది స్పష్టంగా పొందుపర్చాలి. ♦ ప్రభుత్వ శాఖల పరిధిలో పూర్తి కావాల్సిన పనుల వివరాలను పేర్కొనాలి. వాస్తవిక అవసరాల మేరకే వాటికి ప్రతిపాదనలివ్వాలి. ♦ అన్ని ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, పనుల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను వివరంగా తెలపాలి. ♦ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అమలు చేసిన పథకాల వివరాలు, వాటి అమలు కోసం సంవత్సరాలవారీగా అయిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్యను తెలియపర్చాలి. ♦2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 30 వరకు వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాల వివరాలను ప్రత్యేక ఫార్మాట్లో పంపించాలి. ♦కేంద్ర ప్రాయోజిత పథకాల (సీసీఎస్)ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమయ్యే ప్రతిపా దనలను పొందుపర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్య క్రమాలతో కలిసి కేంద్ర పథకాలను వినియో గించుకునే క్రమంలో ఈ ప్రతిపాదనలుండాలి. ♦ ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా అ న్ని శాఖలు ఆస్తుల వివరాలు, పన్ను రాబడు లు, రుణాల వివరాలను పొందుపర్చాలి. ♦ అన్ని శాఖలకు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పంపాలి. ♦ బడ్జెట్ ప్రతిపాదనలు పంపే క్రమంలో వాస్తవిక అంచనాలుండాలే తప్ప గొప్పలకు పోయి భారీ అంచనాలను పంపొద్దు. గ్రాంట్ఇన్ ఎయిడ్ ఖర్చును తగ్గించి పంపాలి. అన్ని విభాగాల ఖర్చులను ఒక్క శాఖ కిందనే పంపాలి. ♦ కార్యాలయ నిర్వహణ, వాహనాలు, అద్దెలు, నీరు, విద్యుత్ ఖర్చులు, స్టేషనరీ, అవుట్ సోర్సింగ్ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాల ప్రతిపాదనలు వాస్తవ అవసరాలకే పరిమితం కావాలి. ♦ ప్రభుత్వ రాబడులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్ల ప్రకారమే అంచనాలను పంపాలి. ♦ ప్రతి శాఖల్లోని ఉద్యోగుల వివరాలను వారు వేతనాలు తీసుకొనే పద్దులవారీగా విభజించి పంపాలి. హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, వీఆర్ఏలు, రోజువారీ వేతన ఉద్యోగులు, ఫుల్టైం, పార్ట్టైం కంటింజెంట్ ఉద్యోగులు, మినిమమ్ టైం స్కేల్ సిబ్బంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్లో పంపాలి. ♦ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ శాఖలోకి వచ్చే అవకాశమున్న ఉద్యోగుల వివరాలను కేడర్వారీగా పంపాలి. -
పెరిగిన తలసరి ఆదాయం
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి పెరిగింది. 2022–23లో జాతీయ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 47,518 ఎక్కువగా నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518లకు చేరింది. అలాగే గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 1.65 లక్షలకు పెరిగినట్లు ఇటీవల లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 19.79 లక్షల ఉండగా 2022–23లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 21.65 లక్షలకు పెరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. పన్ను లేకపోయినా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పైసా కూడా ఆదాయపు పన్ను చెల్లించని వారు 2020–21లో 12.55 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే, వారి సంఖ్య 2022–23లో 13.04 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారీగా పెరిగిన ఐటీ రిటర్న్లు దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య గత మూడు సంవత్సరాల్లో భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశం మొత్తం మీద 2020–21లో 6.72 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లించగా 2022–23లో ఆ సంఖ్య 7.40 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించని వారు 4.84 కోట్ల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే 2022–23లో ఆ సంఖ్య 6.16 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరించారు. దేశ సగటును మించి.. జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయంలో పెరుగుదల రూ. 23,476 ఉండగా.. అదే ఏపీలో రూ. 26,931లకు పెరిగింది. దీంతో దేశ, రాష్ట్ర తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం 2022–23లో రూ. 47,518గా నమోదైంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు డబ్బులిస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా లబి్ధదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,54,031తో దేశంలో 17వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2022–23 నాటికి రూ. 2,19,518తో 9వ స్థానంలో నిలిచింది. -
దుబారా వద్దు..
సాక్షి, హైదరాబాద్: ‘అసలైన ప్రజల తెలంగాణ వచ్చిందనుకోండి. అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. వాస్తవికతను ప్రతిబింబించేలా 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఉండాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలి.’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, ప్రభుత్వం ముందున్న లక్ష్యాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆర్థిక శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంపదను దుబారా చేయవద్దని, వృథా ఖర్చులు అరికట్టేవిధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ‘వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత ఉంది? ఉద్యోగుల జీతభత్యా లు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇతర పనులకు ఎంత ఖర్చవుతుంది? ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థం కావాలి. గొప్పలు, ఆర్భాటాలకు పోవద్దు.’అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలవారీగా చేయాల్సిన ఖర్చులపై స్పష్టతతో ఉండాలని, ఓ అవగాహన మేరకు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాలని సూచించారు. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని విస్మరించవద్దన్నారు. కొందరు వ్యక్తులను సంతృప్తిపర్చాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తిపర్చాల్సిన బాధ్యత గుర్తెరగాలని చెప్పారు. ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు జరపాలని, గతంలో ఉన్న అప్పులు దాచిపెట్టడం, ఆదాయ, వ్యయాలను భూతద్దంలో చూపెట్టడం లాంటివి చేయొద్దని, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. తప్పనిసరైతేనే ప్రభుత్వ ప్రకటనలు.. కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దు రాష్ట్ర ఆదాయవనరులను సద్వినియోగం చేసుకోవాలని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, అడ్డగోలు ఖర్చు, అనవసర వ్యయం మంచి ది కాదని సీఎం రేవంత్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు. తప్పనిసర యితేనే ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇవ్వాలని, కొత్త వాహనాలను కొనుగోలు చేయవద్దని, ఇప్పుడున్న వాహనాలనే వినియోగించుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలవకముందే 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన సీఎం ఇలాంటి ఖర్చులను అస్సలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. నేడు నాగ్పూర్కు ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి గురువారం ఉదయం నాగ్పూర్ వెళ్తున్నారు. అక్కడ జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వివరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. కేంద్రానికి పేరొస్తుందని ఆలోచించకండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో ఎక్కడా వెనుకడుగు వేయొద్దని సీఎం రేవంత్ చెప్పారు. ‘కేంద్రం ఇచ్చే గ్రాంట్లను నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ గ్రాంట్లు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వివిధ శాఖలు, పథకాల వారీగా కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ను వినియోగించుకోవాలి. కొంత వాటా రాష్ట్రం ఇస్తే కేంద్రం మిగిలిన నిధులను ఇచ్చే ప్రాయోజిత పథకాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో, రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పెద్దగా రాదనో బేషజాలకు అస్సలు పోవద్దు.’అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కార్యదర్శి టి.కె.శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ కె.హరితతో పాటు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి కృష్ణభాస్కర్తో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్హెచ్సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
రూ.242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. -
‘కాంట్రాక్టు’.. ఇక ‘పర్మినెంట్’
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సర్క్యులర్ మెమో ద్వారా బుధవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10 వేల మందికి మేలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రెగ్యులరైజేషన్ ఇలా.. 2014 జూన్ 2కి ముందు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులై అర్హులైన వారందరూ రెగ్యులరైజేషన్కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా శాఖాధిపతులు, శాఖల్లో మంజూరు చేసిన పోస్టులో రిజర్వేషన్, రోస్టర్ విధానంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్హులైన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో విధానంలో కాకుండా ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో వీలైనంత త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను ఆయా శాఖాధిపతులు తొలుత వెరిఫికేషన్ చేసి సర్టిఫై చేయాలి. ♦ ఆ తర్వాత సచివాలయ శాఖలు ఆయా దరఖాస్తులను ధ్రువీకరించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ♦ పిదప ట్రెజరీస్ డైరెక్టర్ దరఖాస్తులను ఆడిట్ చేసి సిఫార్సు చేయాలి. ♦ చివరగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) విభాగం అర్హులైన ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఆమోదం తెలుపుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు పుట్టిన తేదీ, విద్యా అర్హతలు, కమ్యూనిటీ, మంజూరైన పోస్టులో నియమించారా, లేదా అనే విషయాలను ఆయా శాఖాధిపతులు ్ర«ధువీకరణ చేయాల్సి ఉంటుంది. సీఎం జగన్కు ఉద్యోగులుబాసటగా నిలవాలి.. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగులందరూ బాసటగా నిలవాలి. దశాబ్దాల కాంట్రాక్టు ఉద్యోగుల కలను నెరవేర్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కొన్ని పత్రికలు, చానళ్లు ప్రభుత్వంపై నిత్యం విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని అక్కసుతో దించేసే కుట్రను ఉద్యోగులు అడ్డుకోవాలి. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి 100 మందిని లక్ష్యంగా పెట్టుకుని వాస్తవాలు వివరించాలి. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, బడుల రూపురేఖలు మార్చి, ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించుకోవాలి. – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ అరవ పాల్ 20 ఏళ్ల కల సాకారం కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధికరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉంది. 20 ఏళ్ల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్మీడియెట్ విభాగంలో 3 వేల మందికి, పాలిటెక్నిక్, డిగ్రీ స్థాయిల్లో మరో 1,000 మందికి మేలు జరుగుతుంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ, కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేలాది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారు.. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. మేనిఫెస్టోలో చేర్చి మరీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మేలు చేశారు. తాజా నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం. – వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధికరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధీకరించిన సీఎంకు మా కృతజ్ఞతలు. – కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ -
18 నుంచి 22 వరకు మూడో విడత గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడవ విడత డిసెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 12–16 తేదీల్లో నాల్గవ విడత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటి విడత జూన్ 19 నుంచి 23 వరకూ (బాండ్ జారీ ధర గ్రాముకు రూ.5,926), రెండవ విడత సెపె్టంబర్ 11 నుంచి 15 వరకూ (ధర గ్రాముకు రూ.5,923) అమలయిన సంగతి తెలిసిందే. -
‘గ్యారంటీల’ భారమంతా మనపైనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆదాయం పెంచుకోవడం ద్వారానే వాటి అమలు సక్రమంగా సాగుతుందని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రిగా శనివారం తొలి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం రూ. 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ఈ శాఖను గాడిన పెట్టగలననే నమ్మకంతోనే ఈ బాధ్యతలు స్వీకరించినట్లు భట్టి అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయవ్యయాలు, అప్పుల గురించి ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలసికట్టుగా సాధిద్దాం.. సంపద సృష్టించడం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వే షణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని భట్టి వారికి సూచించారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు పనిచేయాలని కోరారు. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న ఆలోచనతో విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని.. తద్వారా ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలసికట్టుగా సాధిద్దామని పిలుపునిచ్చారు. రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలు మా చిత్తశుద్ధికి నిదర్శనం.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అమలు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలనే ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కె. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్. రవి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవి ఉచితాలు కాదు.. మానవవనరులపై వ్యయం ప్రతిపక్షంలో ఉండగా తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్నాక తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించానని భట్టి పేర్కొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించామన్నారు. ఇళ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, కొలువులు రాక పెళ్లిళ్లలో కేటరింగ్ సప్లయర్స్గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశా నని ఈ సందర్భంగా భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదని మానవవనరులపై వ్యయంగా చేస్తున్నట్లు భావించాలని ఆయన సూచించారు. మానవ వనరులు పెరిగితే అందుకు అనుగుణంగా ఆదాయాలు పెంచే అవకాశం ఉంటుందన్నారు. -
ఉత్తమ్కుమార్రెడ్డికి ఆర్థిక శాఖ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. అందులో తొమ్మిది నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఉండనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రుల శాఖల కేటాయింపుపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉత్తంకుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ అప్పగించనున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారు కావడంతో వారి సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. రాజగోపాల్రెడ్డికి మరో పదవి మునుగోడు నుంచి రెండోసారి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆయనకు మంత్రి పదవి లేదంటే మరేదైనా ప్రాధాన్యం కలిగిన పదవిని ఇచ్చే అవకాశం ఉంది. నేడు ప్రమాణ స్వీకారోత్సవం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గురువారం తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన మంత్రివర్గంలో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలకు చోటు దక్కింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో మొదటిసారి ఐటీ, క్రీడలు, యూత్, కమ్యూనికేషన్లు, ఓడరేవులు, విమానశ్రయాలు, సహజవాయువు పరిశ్రమలకు మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలోనూ మంత్రిగా పనిచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ తరువాత జిల్లా నుంచి ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి పదవికి అవకాశం కల్పించారు. ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో ఉత్తమ్ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరిద్దరూ మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వమే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం రేవంత్రెడ్డి మంత్రి వర్గంలో జిల్లా నుంచి మాజీ మంత్రులు ఇద్దరికి ఇప్పుడు మంత్రి పదవులు దక్కాయి. -
వచ్చే బడ్జెట్కు ప్రతిపాదనలు పంపండి
సాక్షి, అమరావతి: నవరత్న పథకాలతోపాటు కేంద్ర పథకాలకు సంబంధించి 2024–25 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఈ నెల 14లోగా ఆన్లైన్లో పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. మహిళలు, బాలికలకు ప్రత్యేకం గాజెండర్ బడ్జెట్కు ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమానికి ఉప ప్రణాళికలను ప్రతిపాదించాల్సిందిగా ఆయా శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రధానంగా రహదారులు, గృహాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేలా మూలధన వ్యయ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. ఈ ప్రతిపాదనలు తప్పనిసరిగా మిషన్ లక్ష్యాల ఆధారంగా ఉండాలని స్పష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలపైనే బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేయని పనుల కోసం ఎటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదని సూచించారు. అలాంటి పనులకు బిల్లులను కూడా అంగీకరించబోమని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లేని పనుల ప్రతిపాదనలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయరాదన్నారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల సమర్థ వినియోగం ద్వారా ఫలితాలు సాధించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవి.. ♦ ప్రస్తుత పథకాలను సమీక్షించి.. ఆ పథకాలకు వ్యయం ఎంత అవుతోంది? ఆ మేరకు ఫలితాలు, ప్రయోజనాలు వస్తున్నాయా లేదా పరిశీలించాలి. ప్రయోజనం లేని పథకాలను ఆర్ధిక శాఖతో సంప్రదించి నిలిపివేయాలి. ఇలా ఆదా అయిన సొమ్ముతో కొత్త పథకాలను రూపొందించాలి. ♦ అన్ని శాఖాధిపతుల వేతనాలేతర వస్తువులు, ఇతర వ్యయాలను సమీక్షించి 20 శాతం మేర పొదుపును ప్రతిపాదించాలి. ♦ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల ఉప ప్రణాళికలకు ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించాలి. ప్రస్తుత ప్రతిపాదనలను సమీక్షించి, మార్పులు అవసరం ఉంటే చేయాలి. ♦అన్ని శాఖలు వాస్తవికంగా అంచనాలు వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలి. తప్పనిసరి వ్యయాలైన సబ్సిడీలు, సామాజిక భద్రత పెన్షన్లు మొదలైన వాటికి లబ్ధిదారుల సంఖ్య ఆ«దారంగా తగిన నిధులను ప్రతిపాదించాలి. కన్సల్టెంట్స్, ఔట్సోర్సింగ్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేయకూడదు. ♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను అత్యంత జాగ్రత్తతో రూపొందించాలి. అంచనాలు, వాస్తవాల మధ్య భారీ వ్యత్యాసాలను నివారించాలి. ప్రస్తుత పన్ను రేట్లు ఆధారంగానే రెవెన్యూ రాబడుల అంచనాలను ప్రతిపాదించాలి. వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి పెట్టాలి. అందుకు అనుగుణంగా ఆదాయ వనరుల అంచనాలను పంపాలి. ♦ సవరించిన అంచనాలు వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 నెలల వ్యయ పురోగతి, మిగిలిన నెలల్లో ఖర్చయ్యే అవకాశం ఆధారంగా సప్లిమెంటరీ గ్రాంట్లు కోసం అదనపు నిధులకు ప్రతిపాదనలు చేయాలి. -
6 నెలలు... రూ.1.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది. ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం. ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. -
ఆదాయంతోపాటు అభివృద్ధి
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత సర్కారు హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే ఆదాయం పెరగడంతోపాటు అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ హయాం కంటే ఇప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా నమోదైందని, గత ప్రభుత్వంతో పోల్చితే అప్పులు కూడా ఇప్పుడే తక్కువని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి గత సర్కారు కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేసిందని గణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పులు, ఆదాయం, వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖలు ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఒకసారి రూ.పది లక్షల కోట్లు మరోసారి రూ.11 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.నాలుగున్నర లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గణాంకాలను పేర్కొనటాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి కూడా ఇదే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ఆర్ధిక శాఖ, కాగ్, ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అప్పులు, రాష్ట్ర ఆదాయం, స్థూల ఉత్పత్తిపై తాను చెబుతున్న లెక్కల్లో తప్పులుంటే చెప్పాలని యనమలకు సవాల్ విసిరారు. స్కిల్ స్కామ్కు సంబంధించి రూ.250 కోట్లకు లెక్కలు కనిపించడం లేదని బుగ్గన వెల్లడించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రూ.370 కోట్లకు నామినేషన్పై డిజైన్ టెక్కు ఇచ్చారని, ఈ స్కామ్ 2017లోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీ విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. సెబీ, ఈడీ కూడా దీనిపై విచారణ చేశాయన్నారు. ఎవరి హయాంలో అప్పులు ఎలా? 2018–19 నాటికి (టీడీపీ హయాంలో) రూ.2,57,210 లక్షల కోట్లు 2021–22 నాటికి (వైఎస్సార్సీపీ హయాంలో) రూ.3,93,718 లక్షల కోట్లు మూడేళ్లలో వైఎస్సార్సీపీ హయాంలో పెరిగిన అప్పులు రూ.1,36,500 కోట్లు సగటున ఏడాదికి రూ.45,500 కోట్లు అప్పులు ♦ టీడీపీ హయాంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.33,032 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమానికి రూ.74,249 కోట్లు వ్యయం. ♦ టీడీపీ హయాంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11,400 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్ సీపీ పాలనలో ఎస్టీల సంక్షేమానికి రూ.25,323 కోట్లు వ్యయం ♦ టీడీపీ హయాంలో బీసీ సంక్షేమానికి రూ.30,970 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో బీసీ సంక్షేమానికి చేసిన వ్యయం రూ.1,12,960 కోట్లు ♦ మైనారిటీలకు టీడీపీ హయాంలో వ్యయం సున్నా ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం రూ.11,157 కోట్లు ♦ చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు డిస్కమ్లకు చెల్లింపు రూ.20,165 కోట్లు ♦ వైఎస్సార్సీపీ పాలనలో నాలుగేళ్లలో రూ.57,417 కోట్లు చెల్లింపు టీడీపీ హయాంలో గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి గ్యారెంటీ అప్పులు రూ,13,247 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.57,687 కోట్లు ♦ 2014 నాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.22,000 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.66,664 కోట్లు వైఎస్సార్సీపీ వచ్చాక నాలుగేళ్లలోగ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ♦ వైఎస్సార్ సీపీ హయాంలో గ్యారెంటీ అప్పులు రూ.1,18,000 కోట్లు ♦ నాన్ గ్యారెంటీ అప్పులు రూ.83,000 కోట్లు బాబు హయాంలో ఓవర్ డ్రాప్ట్ 2018–19లో 74.3 శాతం వినియోగం ♦ వైఎస్సార్సీపీ పాలనలో అనుమతించిన రోజుల్లో 2019–20లో 39.5 శాతం వినియోగం ♦ 2020–21లో అనుమతించిన రోజుల్లో 51.5 శాతమే ఓవర్ డ్రాప్ట్ వినియోగం ♦ 2014–15లో ద్రవ్యలోటు మూడు శాతానికి అనుమతిస్తే 3.95 శాతానికి చేరింది ♦ 2018–19లో మూడు శాతానికే అనుమతి ఉంటే 4.06 శాతానికి చేరింది. ♦ ఇప్పుడు 2021–22లో 4.5 శాతానికి అనుమతి ఉంటే ద్రవ్యలోటు కేవలం 2.01 శాతమే ఉంది. ♦ టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.1,62,828 కోట్లను అసెంబ్లీ అనుమతి లేకుండా అధికంగా వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి అప్పు రూ.1,34,600 లక్షల కోట్లు ♦ 2019 మే నాటికి మొత్తం అప్పు రూ,3,28,700 లక్షల కోట్లు.. అంటే అప్పుల పెరుగుదల 19.55 శాతం వైఎస్సార్సీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2022–23 నాటికి మొత్తం అప్పు రూ.4,99,895 లక్షల కోట్లు. అంటే అప్పు పెరుగుదల శాతం 15.46 శాతమే ♦ టీడీపీ హయాంలో ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.76,139 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.15,227 కోట్లే ♦ వైఎస్సార్సీపీ హయాంలో మూడేళ్లలో మూల ధన వ్యయం రూ.55,086 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.18,362 కోట్లు ♦ టీడీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ34,73,477 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.6,95,695 లక్షల కోట్లు ♦ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ.43,34,192 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.10,83,548 లక్షల కోట్లు. -
పోలవరం ఫలాలు త్వరగా అందాలి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి, ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం జగన్.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందించడానికి సహకరించాలని కోరారు. పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్గా నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించడం సంతోషకరమని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని తెలిపారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జూలైలో వచి్చన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలి దశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచనాలు రూపొందించామని చెప్పారు. పోలవరం తొలి దశను పూర్తి చేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆ మేరకు నిధులు విడుదలచేయాలని కోరారు. రూ.1,355 కోట్లు రీయింబర్స్ చేయాలి ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని సీఎం జగన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. 2014 జూన్ నుంచి 2017 జూన్న్వరకు సరఫరా చేసిన విద్యుత్కు ఇప్పటి వరకు ఛార్జీలు చెల్లించలేదని, తొమ్మిదేళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని గుర్తు చేశారు. ఏపీ జెన్కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందని తెలిపారు. తద్వారా వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ నుంచి సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సొమ్ము ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. ఏపీ విద్యుత్ సంస్థలకు ఆ సొమ్ము వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఏపీలో విద్యుత్ రంగం బాగుంది అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించానన్నారు. ఏపీలో విద్యుత్ రంగం పనితీరుపై కేంద్రం సంతృప్తిగా ఉందని స్పష్టం చేశారు. రీ వ్యాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)కు ఏపీ క్వాలిఫై అయిందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ బకాయిలపై మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. -
జీఎస్టీ వసూళ్లు @ రూ. 1.62 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు నాలుగోసారి రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. సెపె్టంబర్తో పోలిస్తే అక్టోబర్లో 10 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్ల నుంచి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గత నెల స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,62,712 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 37,657 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ. 83,623 కోట్లు, సెస్సు రూ. 11,613 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ. 9,92,508 కోట్లకు చేరాయి. సగటున ప్రతి నెలా రూ. 1.65 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. రూ. 1.60 లక్షల కోట్ల వసూళ్లు ఇకపై సర్వసాధారణమైన విషయంగా మారవచ్చని కేపీఎంజీ పరోక్ష పన్నుల విభాగం హెడ్ అభిõÙక్ జైన్ తెలిపారు. రాబోయే పండుగ సీజన్లో వసూళ్లు మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. ఎకానమీ స్థిరంగా వృద్ధి బాటన కొనసాగుతుండటాన్ని ఇది సూచిస్తుందని ఈవై ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. జమ్మూ .. కశీ్మర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతుండటమనేది ఆయా ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకు బ్రాంచీలు ఏర్పాటు చేయాలంటూ పెద్దఎత్తున వినతులు వస్తున్న దృష్ట్యా అవసరమైన గ్రామాల్లో మరిన్ని బ్యాంకు బ్రాంచీలు నెలకొల్పాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి సూచించారు. విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగ్గా.. సమావేశ అంశాలను బ్యాంకర్ల కమిటీ ఆదివారం విడుదల చేసింది. కేంద్ర మంత్రి సూచనలివీ ♦ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఏ సూచనలు చేశారంటే.. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్యాంకు బ్రాంచిల ఏర్పాటుకు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లతో సర్వే జరిపించాలి. ♦ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులను నిబంధనల మేరకు అనుమతించాలి. ♦ గిరిజన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో నీతి ఆయోగ్ ప్రకటించిన ఆకాంక్ష జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ జిల్లాల్లో కనెక్టివిటీ సమస్యలుంటే టెలీ కమ్యూనికేషన్ శాఖ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం ద్వారా అవసరమైన ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచిలు ఏర్పాటు చేయాలి. ♦ రాష్ట్రంలో 186 గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేవు. ఆయా గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఆ గ్రామాల్లో సర్వే నిర్వహించడంతో పాటు బ్రిక్ అండ్ మోటార్ బ్రాంచిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల 109 గ్రామాల్లో చాలా గ్రామాలు వెయ్యి కంటే తక్కువ జనాభాతో రహదారి, నెట్ వర్క్ కనెక్టివిటీ లేకుండా మండల ప్రధాన కార్యాలయాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి మేజర్ పంచాయతీల్లోని 11 ప్రాంతాల్లో కొత్తగా బ్యాంకు బ్రాంచిలు ఏర్పాటు చేయాలి. బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్యాంకులు కేంద్ర మంత్రి సూచనల మేరకు రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి లేదా రాజవొమ్మంగిలో ఏపీ జీవీబి బ్రాంచి ఏర్పాటు చేయనుంది. మారేడుమిల్లిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎటపాకలో ఎస్బీఐ, కొయ్యూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జనాభా ఆధారంగా ఆరు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. బొమ్మికలో స్టేట్ ఎస్బీఐ, గంగరేగువలసలో బ్యాంక్ ఆఫ్ బరోడా, మొండెంఖల్లులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మత్తుమూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా, పి.కోనవలసలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గురండిలో ఎస్బీఐ బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 3 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 21 గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్రిక్ అండ్ మోర్టార్ శాఖలు లేవని జిల్లాల లీడ్ బ్యాంక్ మేనేజర్లు గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సెంటర్ కూడా లేదని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో బ్యాంకింగ్ సేవల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement