-
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. మార్చి 22న థియేటర్స్లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించి, ఔరా అనిపిస్తోంది. లాజిక్తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. (చదవండి: ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..) ఈ మధ్య కాలంలో ఫుల్లెన్త్ కామెడీ చిత్రాలేవి తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఓం భీమ్ బుష్కి బాగా కలిసొచ్చింది. వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డిటేల్స్ బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఓటీటీలోకి 'ఓపెన్హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది) రిలీజ్కి ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కింకుంది. మంచి రేటుకే ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు వారాల వరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదు. ఏప్రిల్ చివరి వారంలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందే. -
‘ఓం భీమ్ బుష్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్కి థియేటర్స్లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Om Bheem Bush: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్?
తెలుగు తెరపై మరో కామెడీ సినిమా సందడి చేయబోతుంది. అదే ఓమ్ బీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు సెన్సార్ సభ్యులు నవ్వుతూనే ఉన్నారట. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ పోటీపడి నటించారట. శ్రీవిష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటే.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్పాంటేనియస్ డైలాగ్స్తో అదరగొట్టారట. క్లైమాక్స్ లో భారీ ఎమోషన్ తో ఊహించని ట్విస్ట్లు ఉంటాయట. సెన్సార్ సభ్యుల మాదిరే థియేటర్స్లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్? సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ ఓమ్ బీమ్ బుష్. డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి ఈ కథకి హారర్ టచ్ ఇవ్వడంతో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని జతచేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సెన్సార్ సభ్యులు ప్రశంసలు.. ట్రైలర్కు వచ్చిన రెస్పాన్స్ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్ పడేలా ఉంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓమ్ బీమ్ బుష్’ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. -
ఓం భీమ్ బుష్ ట్రైలర్.. టైటిల్కు తగ్గట్టే ఉంది
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ప్రీతి ముకుందన్,ఆయేషా ఖాన్ కథానాయికలుగా ఉన్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్పై సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.. ‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో తెరకెక్కిన ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ట్రైలర్లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ మొత్తం కామెడీ ట్రాక్లో ఉంది. సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
Om Bhim Bush: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ
‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో ‘ఓం భీమ్ బుష్’ ఆసక్తిగా ఉంటుంది. మా పాత్రలకు (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రెండు గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్లో యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘టీజర్ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే ప్రేక్షకులు చూడాలి’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి. -
రాహుల్ రామకృష్ణ హిలేరియస్ ఫన్నీ స్పీచ్
-
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
అన్న నువ్వు ఇట్లనే మాట్లాడితే వెళ్లిపోతా..!
-
నేను నాస్తికుడిని పూజలు చేయను అంటున్న రాహుల్
-
ఆర్జీవీకి పట్టిన గతే మనకు పట్టేలా ఉంది: రాహుల్ రామకృష్ణ
-
అలాంటి లింకులు ఏమి లేవు..!
-
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది
‘‘డైరెక్టర్ శివ ప్రసాద్గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, రైటర్ హను, సినిమాటోగ్రాఫర్ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్ మాట్లాడారు. -
ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది
‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్ సురేష్ నరెడ్ల అన్నారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సురేష్ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటి నవ్య స్వామి అన్నారు. -
రైలు ప్రమాదం.. కమెడియన్ అనుచిత ట్వీట్.. ఆ వెంటనే డిలీట్!
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి ఒకే చోట ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురవడంతో 260కి పైగా మంది మృత్యువాత పడగా వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భయానక రైలు ప్రమాదం దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ అనుచిత ట్వీట్ చేశాడు. కమెడియన్పై మండిపాటు సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వందల కుటుంబాలు ట్రైన్ యాక్సిడెంట్లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు. వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్ సదరు ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు 'ఇంతకు ముందు చేసిన ట్వీట్పై క్షమాపణలు కోరుతున్నాను. ఒట్టేసి చెప్తున్నా.. ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాను.. ఏ వార్తలూ చూడలేదు. అందుకే తప్పు జరిగింది. మరోసారి క్షమాపణలు చెప్తున్నా' అని ట్వీట్ చేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ 'మీ నిజాయితీని మెచ్చుకుంటున్నా. మిమ్మల్ని ట్రోల్ చేయాలనుకోలేదు. కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ.. 'థాంక్యూ.. గత కొన్ని గంటలుగా నేను న్యూస్ ఫాలో అవడం లేదు. కేవలం నా పనిపైనే ఫోకస్ చేశాను. నన్ను అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు. Terribly sorry about the previous tweet. I had no idea about the tragedy on the news. Promise. I’ve been writing a script since midnight and have been cut off from all forms of news. Very sorry, once again. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 Thank you. I have generally not been following the news for a while on account of trying to focus my energies on work. This was definitely a faux pas. Thank you for alerting me about it. Much appreciated. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 A quote tweet I shared of a buster Keaton silent movie gif about trains in films . Doesn’t matter now. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 చదవండి: విషమంగా పంచ్ ప్రసాదం ఆరోగ్యం ఒడిశా రైలు ప్రమాదం: ఈ పాపం ఎవరిది? -
మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్
హీరోలకు అభిమానులు రక్షణ కవచం వంటివారు. తమ అభిమాన హీరోను పల్లెత్తు మాట అన్నా అస్సలు సహించలేరు. అలాంటిది ఏకంగా కించపరిస్తే ఊరుకుంటారా? పట్టపగలే చుక్కలు చూపిస్తారు. యాంకర్, నటి అనసూయ విషయంలో ఇదే జరిగింది. ఎందుకోగానీ ఎప్పటినుంచో అనసూయకు, విజయ్ దేవరకొండ అంటే పడదు. గతంలో ఈ హీరో స్టేజీపైనే బూతు డైలాగ్ చెప్పాడని విమర్శించినందుకు ఫ్యాన్స్ అనసూయనే తిట్టిపోశారు. ఇటీవల డైరెక్ట్గా విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతడు ఖుషి సినిమా పోస్టర్లో పేరుకు ముందు The అని పెట్టుకోవడంపై సెటైర్లు వేసింది. పైత్యం.. అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. ఇంకేముంది, ఆ మాట ఎవరిని ఉద్దేశించి అందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు అభిమానులు. మా రౌడీ హీరో మీద నీకెందుకంత ఒళ్లు మంట ఆంటీ.. అంటూ మళ్లీ ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అటు అనసూయ కూడా ఎక్కడా తగ్గకుండా వీలు దొరికినప్పుడల్లా రివర్స్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. తనపై బూతుల వర్షం కురిపిస్తున్నవారిని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ట్వీట్ వేసింది అనసూయ. 'నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి' అని రాసుకొచ్చింది. దీనిపై కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ 'ఇలా అడుగుతున్నందుకు దయచేసి నన్ను క్షమించగలరు, ఇంతకీ ఇక్కడ జరుగుతున్న లొల్లి ఏంటో తెలుసుకోవచ్చా?' అని అడిగాడు. దీనికి నెటిజన్లు.. 'అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ వార్ జరుగుతోంది', 'ఎప్పుడు చూడూ లైమ్ లైట్ కోసం హంగామా అనిపిస్తోంది, బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయితీలు.. అందరూ ఆమెను ఆంటీ అనడం మేడమ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం', 'విజయ్ The అన్న పదం ఖుషీ పోస్టర్లో వాడినందుకు అనసూయకు కోపమొచ్చింది నోటికొచ్చినట్లు వాగింది, చివరికి ఫ్యాన్స్ చేతిలో చీవాట్లు తింటోంది' అని కామెంట్లతో క్లారిటీ ఇస్తున్నారు. Pardon me for being uninformed but I’m curious to know what this is all about 🧐 — Rahul Ramakrishna (@eyrahul) May 10, 2023 చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్? క్లారిటీ ఇదే! -
రాహుల్ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించాడు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లతో నటిస్తూ.. బీజియెస్ట్ ఆర్టిస్ట్గా మారాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఈ టాలెంటెండ్ యాక్టర్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!) ఇక సంక్రాంతి రోజు అబ్బాయి పుట్టాడని ట్వీట్ చేశాడు. కానీ అతని కొడుకు ఫోటోని మాత్రం చూపించలేదు. ఇన్నాళ్లకు తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కొడుకు పేరు రూమి అని చెబుతూ.. ఓ ఫోటోని ట్విటర్లో షేర్ చేశాడు. అందులో రాహుల్ భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. రూమి.. జూనియర్ రాహుల్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పేరు కొత్తగా ఉందని, దాని అర్థం ఏంటి? అని అభిమానులు కామెంట్ పెడుతున్నారు. కాగా, రూమి పాపులర్ పర్సియన్ కవి. అతడి పేరును తన తనయుడికి రాహుల్ రామకృష్ణ పెట్టడం గమనార్హం. Meet Rumi along with his family 😘 pic.twitter.com/SJefvm2Gho — Rahul Ramakrishna (@eyrahul) April 24, 2023 -
తండ్రి అయిన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ
ప్రముఖ కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. సంక్రాంతి పండుగ రోజున తన భార్య హరిత పండండి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కొడుకు ఫొటోను షేర్ చేస్తూ ‘మగబిడ్డ.. సంక్రాంతి రిలీజ్’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ దంపతులకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతంలో గర్ల్ఫ్రెండ్కు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను కానీ ఆ తర్వాత రాహుల్ వెల్లడించలేదు. కానీ గతేడాది నవంబర్లో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పి అందరికి షాకిచ్చాడు. కాగా కమెడియన్గా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేసి ఫేమస్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. Boy. Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1 — Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023 -
ఆహా ఒరిజినల్ 'ఇంటింటి రామాయణం', అప్పుడే స్ట్రీమింగ్!
షోలు, వెబ్ సిరీస్లు, సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకుంటోంది ఆహా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 25న విడుదల చేయనున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్) కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. ఈ కుటుంబ కథా చిత్రం డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఎంట్రీపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది” అన్నారు. Iga mucchata shuru!😉 Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo... Teaser out on November 25th. An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/9zoRyStvwZ — Sithara Entertainments (@SitharaEnts) November 21, 2022 చదవండి: ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్ నీ నుంచి కంటెంటే రాదు, ఇంకా కోపం కూడానా.. యాంకర్ వెకిలి చేష్టలు -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. -
తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో నెటిజన్లు, అతడి ఫాలోవర్స్ షాకవుతున్నారు. అంతేకాదు అసలు పెళ్లెప్పుడు జరింగింది బ్రో? అని నటుడిని ప్రశ్నిస్తున్నారు. కాగా రీసెంట్గా తన కాబోయే భార్యకు లిప్లాక్ ఇస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లి సంబంధించిన ముచ్చట్లను కానీ ఇప్పటి వరకు రాహుల్ వెల్లడించలేదు. కానీ సడెన్ తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తాజాగా షేర్ చేశాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏంటీ బ్రో పెళ్లి చేసుకున్న విషయం చెప్పనే లేదు, అసలు మీ పెళ్లి ఎప్పుడు జరిగింది’ అంటూ రాహుల్ పోస్ట్లో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత అయితే గత నెలలో మాత్రం ‘సె హాయ్ టూ మై వైఫ్’ అంటూ భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సె హాలో టూ మై లిటిల్ ఫ్రెండ్’ అంటూ తనదైన శైలిలో పోస్ట్ షేర్ చేశాడు. కాగా కమెడియన్గా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO — Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022 View this post on Instagram A post shared by Rahul Ramakrishna (@weirddivide) Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
బ్రో, నువ్వు తాగి ట్వీట్ చేశావా? కమెడియన్ ఆన్సరేంటంటే?
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత జాతిరత్నాలు, కల్కి, స్కైలాబ్ సినిమాలతో అలరించాడు. ఇటీవలే హ్యాపీ బర్త్డే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ఈ కమెడియన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. బోర్ కొడుతోంది.. సినిమా, సాహిత్యం, సంగీతం.. వీటి గురించి ఏదైనా అడగండి.. ఆసక్తిగా ఉన్న ప్రశ్నలకు ఆన్సరిస్తానని ట్వీట్ చేశాడు. ఇంకేముంది.. నెటిజన్లు దొరికిందే ఛాన్సని వరుస ప్రశ్నలు కురిపించారు. మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటి? అన్న ప్రశ్నకు బెటర్ కాల్ సాల్ అని బదులిచ్చాడు. ఈ మధ్య నీలెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువమంది మాట్లాడుతరు. నువ్వు యాస చాలా స్పష్టంగా మాట్లాడుతవు. దానికి ఏమన్నా హోంవర్క్ చేస్తవ భయ్ లేదా సహజంగానే అంతేనా? అని అడగ్గా.. మాతృభాషకు హోం వర్క్ అక్కర్లేదని నా ఫీలింగ్ అని రిప్లై ఇచ్చాడు. తాగేసి ట్వీట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయా గురూ అని అడగ్గా.. చాలా సార్లు అని బదులిచ్చాడు రాహుల్ రామకృష్ణ. Chaala saarlu — Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022 మాతృ భాషకి హోమ్ వర్క్ అక్కర్లేదు అని నా ఫీలింగ్ — Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022 చదవండి: నా మాజీ భార్యకు అతడితో వివాహేతర సంబంధం, ఇద్దరూ నా ఇంట్లోనే తిష్ట వేశారు వాచిపోయిన కాళ్లు... సోషల్ మీడియాలో కష్టాలు చెప్పుకున్న సోనమ్ కపూర్ -
రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే..
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. లిప్లాక్ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి అంటూ శుభవార్త చెప్పాడు. అర్జున్రెడ్డి స్టైల్లో ఢిపరెంట్గా పెళ్లి వార్తను అనౌన్స్ చేయడంతో క్షణాల్లోనే రాహుల్ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్ ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయేది ఎవరు,ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది. మరికొందరేమో ఆమె పేరు బిందు అంటూ నెట్టింట ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హరిత.. బిందు కాదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అల్టీమేట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది.. Small clarification- my fiancé’s name is Haritha, not Bindu. ☺️ — Rahul Ramakrishna (@eyrahul) May 8, 2022
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement