-
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్లో భారీగా లీజింగ్ హైదరాబాద్లోనూ ఆఫీస్ స్థలం లీజింగ్ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ లీజింగ్లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది. -
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
ఐటీకి నీటి ట్రాన్స్ఫర్
వరంగల్కు చెందిన నిఖిలేశ్ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ బహుళజాతి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కావడంతో భార్యతో సహా కేఆర్ పురంలో నెలకు రూ.20 వేల అద్దెతో ఓ గేటెడ్ కమ్యూనిటీలో కాపురం పెట్టాడు. అయితే ఈమధ్య కాలంలో బెంగళూరు ప్రధాన నగరంలో నీటి ఎద్దడి తీవ్రం కావడంతో యాజమాన్యం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. కానీ, అపార్ట్మెంట్లో నీటి వినియోగం, సరఫరాలో రెసిడెన్షియల్ సొసైటీ ఆంక్షలు విధించింది.దీంతో అటు ఆఫీసుకు వెళ్లలేక, ఇటు ఇంట్లో ఉండలేక ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ ఆఫీసు నుంచి పని చేయాలని సూచించింది. అతడు భార్యను పుట్టింట్లో వదిలిపెట్టి ప్రస్తుతం హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్:.. ఇదీ బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగికి జరిగిన నీళ్ల బదిలీ. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు కేంద్రమైన వైట్ఫీల్డ్, వర్తూర్ వంటి ఐటీ హబ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.దీంతో ఐటీ సంస్థలు, ఉద్యోగుల కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ఐటీ హబ్లు, ఉద్యోగుల నీటి కష్టాలు వీడియో పలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడం గమనార్హం. హైదరాబాద్, పుణేలకు బదిలీ దేశీయ ఐటీ పరిశ్రమ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీంతో రాజకీయ అస్థిరత, స్థానిక సమస్యలతో సంబంధం లేకుండా గడువులోగా ప్రాజెక్ట్లను పూర్తి చేయడం సాఫ్ట్వేర్ కంపెనీలకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఐటీ పరిశ్రమ నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. తాత్కాలికంగా కొద్దికాలం పాటు ఉద్యోగులను సొంతూళ్ల నుంచి పని చేసే వీలు కల్పించడం, హైదరాబాద్, పుణే వంటి ఇతర నగరాల్లోని బ్రాంచ్ ఆఫీసులకు బదిలీ చేయడం వంటివి చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఎదురయ్యే సందేహాలు, టాస్క్లను నివృత్తి చేసేందుకు సాంకేతిక నిపుణులను జూమ్ వంటి ఆన్లైన్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే ఉద్యోగుల పనితీరుపై ఒత్తిడి ప్రభావం పడకుండా వారాంతాల్లో వర్చువల్గా శిక్షణ, మీటింగ్లను సైతం నిర్వహిస్తున్నాయి. వేతన పెంపు, అలవెన్స్లు కూడా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినా బెంగళూరు నుంచే పని చేస్తారని, దీంతో అపార్ట్మెంట్లలో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందని భావించిన పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం బదులుగా వర్క్ ఫ్రం హోంటౌన్ (సొంతూర్ల నుంచి పని) చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇతర పట్టణాలు/మెట్రో సిటీల నుంచి పని చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. కుటుంబంతో సహా వేరేచోటుకు మారడం, ప్రయాణ ఖర్చులతోపాటు అప్పటికే బెంగళూరులో ఉండే ఇంటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు భారం కావడంతో పలు కంపెనీలు తాత్కాలిక వేతన పెంపు, అలవెన్స్లు వంటివి ఇస్తున్నాయి. బెంగళూరులో నీటి సమస్య తీరిన తర్వాత తిరిగి ఆఫీసుకు రావాలని చెబుతున్నాయి. రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ప్రస్తుతం కర్ణాటకలో సుమారు 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 18 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక, లోటు వర్షపాతం, తలసరి నీటి వినియోగం పెరుగుదల వంటి కారణాలతో బెంగళూరులో నీటి సమస్య జఠిలమైంది. నగరంలో రోజుకు తాగునీరు, పరిశ్రమ అవసరాలకు 2,600 ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్లు) నీరు అవసరం ఉండగా.. ఇందులో 1,450 ఎంఎల్డీలు కావేరి నది నుంచి, 650 ఎంఎల్డీలు బోరు బావుల నుంచి సమకూరుతుండగా, 500 ఎంఎల్డీల నీటి కొరత ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద నివాస సముదాయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఐటీ ఆఫీసులపై ప్రభావం బెంగళూరులో నీటి సమస్య ఐటీ కార్యాలయాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మహాదేవపుర,కెంగేరి, వైట్ ఫీల్డ్, సజ్జాపుర్ రోడ్, కోర మంగళ వంటి ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు, ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు సంస్థలు రిమోట్ వర్కింగ్, హైబ్రిడ్ మోడల్ పని విధానంతోపాటు ఇతర నగరాల్లోని బ్రాంచీల నుంచి పని చేయాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇలా పని చేస్తున్నారు. –సందీప్ కుమార్ మఖ్తల, ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ -
ఎంప్లాయిస్ కి చుక్కలే ! ప్రమోషన్లకు దానికీ లింకా?
-
ఆఫీస్కు రాకపోతే ప్రమోషన్ కట్.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులు ఆఫీస్కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెక్ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. తాజాగా డెల్ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్, రిమోట్ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్ రోల్లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది. -
మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్!
ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది. నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని, మండుతున్న ఎండల నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపశమనం కలగడమే కాకుండా విలువైన సంక్షోభ సమయంలో నీటి సంరక్షణకు దోహదపడుతుందని వాదిస్తున్నారు. "బెంగళూరు నగరంలో పెరిగిన ఎండ వేడి, తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొని ఉండటం, ఈ నెలలో పెద్దగా వర్షాలు లేనందున వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను కర్ణాటక ప్రభుత్వం పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది" అని ‘గో బై కర్ణాటక వెదర్’ (@Bnglrweatherman) అనే వాతావరణ ఔత్సాహికుల బృందం ‘ఎక్స్’లో పేర్కొంది. "నీటి సంక్షోభం.. ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా? విద్యార్థులు, ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తే, చాలా మంది వారి స్వస్థలాలకు వెళతారు. నగరంపై ఒత్తిడి తగ్గుతుంది!" అని సిటిజన్స్ ఎజెండా ఫర్ బెంగళూరు (@BengaluruAgenda) రాసుకొచ్చింది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం వల్ల చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే దృష్టాంతం ఏర్పడవచ్చని మరికొంత హైలైట్ చేశారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి ఇంటి నుండి పని కోసం ఆదేశాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ నమ్మ వైట్ఫీల్డ్ అని పిలిచే నగరంలోని వైట్ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితులు, నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇటువంటి చర్య ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, తద్వారా బెంగళూరుపై భారం తగ్గుతుందని పేర్కొంది. -
ఐటీ కారిడార్లో మారుతున్న ట్రెండ్..
వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లోని ఐటీ కారిడార్లు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ మోడల్ను అనుసరిస్తుండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలలుగా ఐటీ కారిడార్లో క్రమంగా కార్యకలాపాలు గాడిన పడ్డాయి. హాస్టళ్లలో గదులు నిండుతున్నాయి. మాల్స్ సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు, హోటళ్లు, ట్రావెల్స్, డ్రైవర్ల జీవన ప్రయాణం గాడిలో పడింది. ఏమిటీ హైబ్రిడ్ మోడల్? ఐటీ కంపెనీల్లో అన్ని విభాగాల ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మిగతా రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ విధానానికి హైబ్రిడ్ మోడల్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. చిన్న కంపెనీల్లో ఉద్యోగులు వంద శాతం కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ భవనాలు 65 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. బహుళజాతి కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎత్తేసే ఆలోచన చేయడం లేదు. అలాగని ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి చేయడం లేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం వంద శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి సందేశాలు పంపించాయి. అత్యధిక ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్ను పాటించేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ కంపెనీల్లో ఇలా.. ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ నెలలో 11 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. ప్రయోజనాలివే.. ఉద్యోగులకు కొంతకాలంపాటు హైబ్రిడ్ వర్క్కు అనుమతించడం ద్వారా కంపెనీలు మౌలిక సదుపాయాల ఖర్చులను గణనీయంగా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ పని వాతావరణం కారణంగా ఐటీ కంపెనీలు తమ మౌలిక సదుపాయాల ఖర్చుల్లో కనీసం 50% ఆదా చేసుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆసక్తిమేరకు పనిచేస్తే ఆఫీస్లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా సమర్థంగా పనిచేస్తారు. అయితే కావాల్సిందల్లా వారిలో ఆసక్తిని రేకిత్తించడమే. అందుకు కంపెనీ యాజమాన్యాలు, టీమ్ నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. హైబ్రిడ్ వర్క్లో తక్కువ ముందే ఆఫీస్కు వస్తారు కాబట్టి ఫోకస్గా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు సృజనాత్మకతతో విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. టీమ్లోని సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆఫీస్కు రావాల్సి ఉంటుంది. దాంతో క్రాస్-కల్చరల్ వాతావరణం పెంపొందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్న్యూస్! మూన్లైటింగ్కు చెక్.. హైబ్రిడ్ మోడల్లో భాగంగా ప్రధానంగా పనిచేస్తున్న కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలకు చెందిన రహస్య పని ఒప్పందాలు(మూన్లైటింగ్ ) ఇకపై సాగవు. దాంతో కంపెనీల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొందరు ఉద్యోగులు రహస్యంగా రెండో ఉద్యోగం (మూన్ లైటింగ్) కూడా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ఉద్యోగుల నైతికత మీద ఆధారపడి ఉంది. -
ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్న్యూస్!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కంపెనీలు బలవంతంగా ఆఫీస్లకు పిలిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కాస్త ఊరట కలిగిస్తోంది. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తోంది. తాజాగా ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ ఇన్ఫీమీ (InfyMe) కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. "మనం ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్లో ఉన్నాం. మీరు నెలకు పేర్కొన్న కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను పొందవచ్చు మిగిలిన రోజులలో ఆఫీస్ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి" అని ఇన్ఫీమీ ప్లాట్ఫామ్లోని సందేశం పేర్కొంది. వారానికి ఐదు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా కల్పించిన వెసులుబాటుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఊరట కలుగుతుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్లను సమన్వయం చేయడంలో, వారి టీమ్ల కోసం ఆఫీస్లో స్పేస్ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
ఐటీ ఉద్యోగం.. వర్క్ఫ్రం హాస్పిటల్!
ఇంట్లో ఏవరైనా చిన్నపిల్లలు, పెద్దవారికి లేదా తమకే ఆరోగ్యం బాగులేనపుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుంది. అయితే వీక్ డేస్లో అయితే ఫరవాలేదు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రత్యేకంగా డాక్టర్ అపాయింట్మెంట్ సందర్భాల్లో మాత్రం ఉద్యోగరీత్యా వెళ్లడం కుదరకపోవచ్చు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సివస్తే ఆ రోజు సెలవు పెట్టాల్సిందే. డాక్టర్ చూసేది కొద్దిసేపే అయినా అక్కడ గంటల తరబడి ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవాల్సిందే. వర్క్ఫ్రంహోమ్ చేసే టెకీలకు ఇకపై ఈ ఇబ్బంది తీరనుంది. హాస్పిటల్స్లో ల్యాప్టాప్ల ద్వారా వర్క్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో డాక్టరును సంప్రదించే సమయంలోనూ చేసే పనికి అంతరాయం కలగకుండా చూసుకోవచ్చు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలోనే పనిచేసుకునేందుకు అవకాశం కల్సిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ల్యాప్టాప్పైనే పనిచేస్తున్నారు. వీరు ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు. ఒక డెస్క్, వైఫై ఉంటే చాలు. అయితే వర్క్ఫ్రంహోం ద్వారా పని చేస్తున్న ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి అటెండర్లకు ఈ తరహా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. సెలవు దొరక్కపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నా ఆసుపత్రికి వెళ్లడం కుదరక చాలామంది వాయిదా వేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు, దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. పిల్లల ఉద్యోగాలు, సెలవుల వంటి పరిస్థితి చూసి వీరే సర్దుకుంటుంటారు. ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తున్న సదుపాయాలతో రోగులు, వారి సహాయకులు ముఖ్యంగా టెకీలకు కొంత వరకైనా ఉపయోగకరంగా ఉండనుంది. WFH evolves - Work from Hospital 🏥. @YashodaHospital in Hitech City introduces desks for those needing to work while attending family treatments. Post-COVID, #WFH has surged, but does this hospital-work blend boost productivity, or is it just helping to fool companies?… pic.twitter.com/d1kouDDNfM — Ravi Korukonda (@RaviKorukonda) February 21, 2024 ఇదీ చదవండి: అక్రమ రుణయాప్లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా.. ఐటీ కారిడార్లోనే ఓ ప్రముఖ ఆసుపత్రి అక్కడికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎవరైనా పనిచేసుకునేందుకు ‘వర్క్ఫ్రమ్ ఆసుపత్రి’ సదుపాయాలు కల్పిస్తుంది. అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా వర్క్డెస్క్ను ఏర్పాటు చేసింది. -
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు బంపరాఫర్.. ఐడియా వర్కవుట్!
Tulsa Remote program: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అమెరికాలోని ఓ నగరం కొన్నాళ్ల క్రితం బంపరాఫర్ ప్రకటించింది. యూఎస్లోని ఎక్కడ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులైనా తమ నగరానికి వచ్చి నివాసం ఉంటే 10,000 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు) డబ్బులిస్తామని వెల్లడించింది. ఇప్పుడా ఐడియా వర్కవుట్ అయినట్లు కనిస్తోంది. అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న తుల్సా (Tulsa) అనే నగరం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘తుల్సా రిమోట్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అందించిన ఈ ఆఫర్ యూఎస్లోని ఇతర ప్రాంతాల నుంచి రిమోట్గా పూర్తి సమయం పని చేయగల నిపుణులను తమ నగరానికి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ఆలోచన ఏమిటంటే ఉద్యోగులు ఇక్కడికి స్థిరపడతారు. ఇక్కడే ఖర్చు చేస్తారు. తుల్సా నగరం తుల్సా రిమోట్ ప్రోగ్రామ్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రోగ్రామ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి తుల్సాకు 2,000 మందికి పైగా మకాం మార్చారు . 2022 చివరి నాటికి, తుల్సా రిమోట్ దాదాపు 307 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష కార్మిక ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చింది. నగరానికి వచ్చిన ప్రతి ఇద్దరు తుల్సా రిమోట్ సభ్యులతోపాటు పాటు మరో ముగ్గురు వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 76 శాతం మంది ఇక్కడే స్థిరపడిపోయారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉద్యోగి.. స్పాట్లో రిజైన్! ఎందుకంటే..
Employee Quits Job On Spot: ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ చాలా మంది ఒత్తిడికి ఇదే మూల కారణం. సోషల్ మీడియా ముఖ్యంగా రెడ్డిట్ (Reddit).. ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న బాధలను పంచుకునే కేంద్రంగా మారింది. ఇటీవల CrazieIrish అనే పేరుతో ఉన్న ఒక రెడ్డిట్ యూజర్ తమ టాక్సిక్ బాస్ బూతు మాట అనడంతో స్పాట్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు షేర్ చేశారు. దీని గురించి మరింత వివరణ అడిగినప్పుడు ఆ యాజర్ కామెంట్స్లో పూర్తిగా తెలియజేశారు."నేను ఇంటి నుంచి పని చేస్తున్నా. కొత్త కంప్యూటర్కు యాక్సెస్ పొందడానికి సపోర్ట్ కోసం అతనికి (బాస్) కాల్ చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో కంప్యూటర్ను సెటప్ చేయనందుకు కోపంగా ఉన్న అతను బూతు మాట (F*** Off) అన్నాడు. దీంతో స్పాట్లో జాబ్ వదిలేస్తున్నట్లు చెప్పాను" అని రాసుకొచ్చారు. ఈ ఈమెయిల్కు తమకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు. ఈ రెడ్డిట్ పోస్ట్ షేర్ చేసిన కేవలం 20 గంటల్లోనే 37,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా మంది ఇంటర్నెట్ యాజర్లు కామెంట్ల రూపంలో స్పందించారు. ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు. So, I Quit My Job byu/CrazieIrish inantiwork -
‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఐటీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
కొవిడ్ పరిణామాల్లో ఐటీ పరిశ్రమలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానమైంది పూర్తిగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయడం. వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పనిచేయడం కొవిడ్ ముందునుంచే ఉంది. అయితే కరోనా సమయంలో ఐటీ ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడకుండా, పూర్తిగా ఇంటి నుంచే పనికి అనుమతించారు. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత పలు సంస్థలు క్రమంగా కార్యాలయాలు తెరిచాయి. ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మెయిళ్లు పంపాయి. కానీ రోజూ ఆఫీస్కు వచ్చి పనిచేయడానికి ఉద్యోగులు విముఖత చూపుతున్నారని తేలింది. ప్రతిరోజూ తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందిగా సంస్థలు ఆదేశిస్తే ఉద్యోగం మారడానికి సైతం సిద్ధపడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాడ్యూల్కు మారాలంటే మెజారిటీ ఉద్యోగులు భయంతో ఉన్నట్లు తెలిసింది. ఈ విధానానికి హఠాత్తుగా మారడం సాధ్యం కాదని తాజా సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది స్పష్టం చేశారని స్టాఫింగ్ సొల్యూషన్స్ హెచ్ఆర్ సర్వీస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ రిపోర్ట్ తెలిపింది. కేవలం 25 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, తయారీ వంటి రంగాల్లో పనిచేసే 1,213 మందిని పరిగణించి గతేడాది అక్టోబర్ 26 నుంచి నవంబర్ 30 వరకు రిపోర్ట్ తయారు చేశారు. ఆఫీసుకు రమ్మని ఆదేశించడం వల్ల రాజీనామాలు పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేసింది. 12 శాతం మంది రాజీనామాలను ప్రధాన సమస్యగా భావించలేదు. 82 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే.. కంపెనీలు ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఇవ్వాలని చాలా మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇంటితోపాటు ఆఫీసు నుంచీ పనిచేయడానికి అనుమతించాలని కోరారు. ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇల్లు దూరం ఉన్న వారికి మినహాయింపులు ఉండాలని 56 శాతం మంది అన్నారు. దీనికి విరుద్ధంగా, 33 శాతం మంది మాత్రం మినహాయింపులు అవసరం లేదన్నారు. -
ఇదే ఫైనల్.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్ డెడ్లైన్!
ఇదే ఫైనల్.. ఇక ఆఫీసులకు రాకపోతే మీ ఇష్టం.. ఇది ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇచ్చిన్న వార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు మార్చి ఆఖరికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని డెడ్లైన్ విధించినట్లు సమాచారం. రిటర్న్-టు-ఆఫీస్ మ్యాండేట్కు అనుగుణంగా ఉద్యోగుల హైక్లు, వేరియబుల్ పేఅవుట్లను టీసీఎస్ లింక్ చేస్తున్నట్లు నివేదికలు వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఈ డెడ్లైన్ రావడం గమనార్హం. కొత్త ఆదేశాల గురించి యూనిట్ హెడ్లు తమ టీం సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రహ్మణ్యంను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. డెడ్లైన్కు సంబంధించి టీసీఎస్ ఉద్యోగులకు తుది కమ్యూనికేషన్ పంపించింది. విస్మరించినవారు పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోం ఇటు ఉద్యోగులు, అటు కంపెనీ ఇద్దరికీ ఇబ్బందికరమని సంస్థ పేర్కొంటోంది. ఇప్పటికే 65 శాతం మంది టీసీఎస్ జనవరి 11 నాటి డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల ప్రకటనలో 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నారని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికర ప్రాతిపదికన 5,680 పడిపోయింది. టీసీఎస్కు హెడ్కౌంట్ తగ్గడం ఇది వరుసగా రెండో త్రైమాసికం. క్యూ2లో ఉద్యోగుల సంఖ్య 6,333 తగ్గింది. గత డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 603,305. -
ప్రముఖ టెక్ కంపెనీ కఠిన నిర్ణయం.. ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేసింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయాలకు రావాలని పిలుపు నిచ్చింది. లేని పక్షంలో మీ కెరియర్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో డెల్ ఇతర టెక్ కంపెనీల తరహాలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిచ్చింది. ఉద్యోగులు ఆఫీస్కు వచ్చే అవసరం లేకుండా 60 శాతం మంది సిబ్బందికి రిమోట్ వర్క్ను సౌకర్యాన్ని కల్పిచ్చింది. అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీ తన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను పునఃసమీక్షించింది. మార్చి 2023లో డెల్ తన కార్యాలయాలకు ఒక గంట ప్రయాణానికి లోపల నివసించే ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడు రోజులు హాజరు కావాలని తప్పనిసరి చేసింది. తాజాగా, ఆ నిబంధనను అందరికి అమలు చేసింది. కెరీర్ ఫణంగా పెట్టి కానీ వారిలో తక్కువ వేతనం పొందుకు ఉద్యోగులు రిమోట్ వర్క్కి మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్యాలయానికి కొన్ని గంటల దూరంలో నివసించే వారు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని, లేదంటే కెరీర్ను ఫణంగా పెట్టి రిమోట్ వర్క్ చేస్తామంటూ డెల్తో కాంట్రాక్ట్ కుదర్చుకునే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. లేఆఫ్స్ ఉన్నప్పటికీ డెల్ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వర్క్ ఫోర్స్లో సుమారు 6వేల మందిని లేఆఫ్స్ ప్రకటించింది. అయినప్పటికీ డెల్ స్టాక్ గణనీయమైన పెరుగుదలను చూసింది. గత 12 నెలల్లో దాని విలువను రెట్టింపు చేసి సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
రెబల్గా మారుతున్న ఐటీ ఉద్యోగులు.. తలలు పట్టుకుంటున్న కంపెనీలు!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీలు స్వస్తి చెప్పేశాయి. కొంతకాలం హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మొత్తంగా ఆఫీస్కి రావాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్కు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీస్కు రాబోమంటూ ఎదురు తిరుగుతున్నారు. జర్మన్ సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (SAP) ఇటీవల రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తీసేసింది. దీంతో ఉద్యోగులు ఎదురుతిరిగారు. బలవంతంగా ఆఫీసులకు పిలిస్తే రాజీనామా చేస్తామంటూ సుమారు 5 వేల మంది ఉద్యోగులు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి అందరూ తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆన్-సైట్ వర్క్ గైడెన్స్ జారీ చేయడం ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు లొకేషన్ ఫ్లెక్సిబులిటీ ఇచ్చిన కంపెనీ ఆకస్మికంగా విధానాలను మార్చడం అసమంజసమని శాప్ యూరోపియన్ వర్క్స్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లైన్ మాత్రం ఉద్యోగులను సాంస్కృతికంగా దగ్గర చేయడం, మార్గదర్శకత్వం, ఉత్పాదకత వంటి వాటి కోసం క్యాంపస్ కో-లొకేషన్ చాలా అవసరమని నొక్కి చెబుతున్నారు. ప్రమోషన్లకు కీలకం.. రిమోట్, ఆన్-సైట్ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి హైబ్రిడ్ విధానంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను పరిశ్రమ ఉత్తమ పద్ధతులు, అంతర్గత అభ్యాసాలు తెలియజేస్తున్నాయని శాప్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు అనువైన పని అవకాశాన్ని కల్పించిన మొదటి టెక్ కంపెనీలలో శాప్ కూడా ఒకటి. కానీ 2022 తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఆన్-సైట్ వర్క్ విధానంపై దృష్టి పెట్టాయి. ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆఫీసుకి హాజరును నిర్ణయాత్మకంగా చూస్తున్నాయి. టీసీఎస్ కూడా.. ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా పెరగనున్న జీతాలు, ప్రమోషన్లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టు ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనట్లు నివేదికలు వచ్చాయి. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం కంపెనీ చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. -
‘వర్క్ ఫ్రం హోమ్’లో ఐటీ ఉద్యోగులు.. షాకిచ్చిన టీసీఎస్!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు షాకిచ్చింది. త్వరలో పెరగనున్న జీతాలు, ప్రమోషన్లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టూ ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనిట్లు సమాచారం. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అంతేకాదు ఉద్యోగులు ఇకపై వర్క్ ఫ్రం హోమ్ చేస్తామంటే కుదరదని, తప్పని సరిగా వాళ్లు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబడుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఉద్యోగులు తాము నివాసం ఉంటుంన్న ప్రాంతాలకు సమీపంలోని ఆఫీస్ కార్యాలయాలను ఎంపిక చేసుకోవద్దని కోరింది. తామే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేయాలని చెబుతామని సూచించింది. కోవిడ్-19 కేసుల వారీగా పరిమిత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను హెచ్ఆర్ విభాగం అనుమతిస్తోందని నివేదిక తెలిపింది. కాగా, ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో సహా పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో వర్క్ ఫ్రం హోమ్ విధానం ముగిసినట్లేనని ఐటీ నిపుణులు భావిస్తుండగా.. విప్రో తప్పనిసరి హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తోంది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది’అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
Layoffs In 2024: వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 2024లో పోయే జాబ్స్ వీళ్లవే..!
టెక్ పరిశ్రమలో 2024లోనూ లేఆఫ్లు కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే, ఆల్ఫాబెట్, అమెజాన్, సిటీ గ్రూప్, ఈబే, మాకీస్, మైక్రోసాఫ్ట్, షెల్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్, వేఫెయిర్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. తాజగా యునైటెడ్ పార్సెల్ సర్వీస్ 12,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి ఐదు రోజులు కార్మికులను ఆఫీసులకు రప్పించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సంకేతాలను పంపుతున్న క్రమంలో లేఆఫ్ ప్రకటనలు వస్తున్నాయి. ఒకవైపు యూఎస్ ఉద్యోగ అవకాశాలు కాస్త పెరిగాయి. మరోవైపు హై ప్రొఫైల్ ఉద్యోగాల కోతల జాబితా పెరుగుతున్న వైట్ కాలర్ ప్రపంచానికి అనిశ్చితిని జోడిస్తోంది. రిమోట్ వర్క్పై పెరుగుతున్న అణచివేత కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్ ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుంకు వ్యూహాలను పొందడానికి దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు, కెరీర్ కోచ్లను బ్లూమ్బెర్గ్ న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. వారు ఏం చెప్పారు.. కోతల ప్రమాదం ఎక్కువ ఉన్నది ఎలాంటి ఉద్యోగులకు అన్నది ఇక్కడ చూద్దాం.. మిడిల్ మేనేజర్లు, రిమోట్ వర్కర్లు జాగ్రత్త కంపెనీలు తొలగింపులకు తరచుగా మిడిల్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ‘గ్లాస్డోర్’ ప్రధాన ఆర్థికవేత్త డేనియల్ జావో చెప్పారు. ఇలాంటి సమయంలో మిడిల్ మేజేజర్లు బాధితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత తొలగింపుల రౌండ్ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్న తరుణంలో లేఆఫ్లలో రిమోట్గా పనిచేస్తున్నవారినే లక్ష్యంగా చేసుకుంటారని కొన్ని నివేదికలు సూచించాయి. రిమోట్గా పనిచేస్తున్నవారిని తొలగించడం కంపెనీలకు సులువవుతుందని న్యూయార్క్లోని ఏబీఎస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏరియల్ షుర్ అభిప్రాయపడ్డారు. కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్లో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ పెన్ మాట్లాడుతూ ఎవరిని తొలగించాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యుత్తమ సంస్థలు రెండు అంశాలను చూస్తాయని చెప్పారు. ఒకటి ఆ ఉద్యోగి వల్ల సంస్థకు ప్రస్తుతమైనా లాభదాయకంగా ఉండాలి లేదా భవిష్యత్తులో అయినా లాభం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా అలాంటి ఉద్యోగులు ఇంటికిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. -
‘ఆఫీసుకు వస్తారా.. రారా..?’, ఉద్యోగులకు టెక్ దిగ్గజం వార్నింగ్!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) సీఈఓ అరవింద్ కృష్ణ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేశారు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆఫీస్కు రావాలని, లేదంటే సంస్థను వదిలేయాలని సూచించారు. అమెరికాలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్లకు, హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి జనవరి 16న ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంజెర్ ఓ ఇంటర్నల్ మెయిల్ పంపారు. అందులో ‘ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారో సంబంధం లేకుండా ఆఫీస్ లేదా క్లయింట్ లొకేషన్లో కనీసం వారానికి మూడు రోజులు విధులు నిర్వహించాలని’ మెయిల్లో పేర్కొన్నట్లు మీడియా సంస్థ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఆఫీస్కు వస్తారా? రాజీనామా చేస్తారా? ఈ ఏడాది ఆగస్ట్ నుంచి 80 కిలోమీటర్ల లోపు ఇంటి వద్ద నుంచి ఉద్యోగులు స్థానిక ఐబీఎం కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు, లేదంటే మిలటరీ సర్వీసుల్లో పనిచేస్తున్న ఐబీఎం ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ రిమోట్గా పనిచేస్తున్న మేనేజర్లు క్లయింట్ లొకషన్ లేదంటే లోకల్ ఆఫీస్కు వచ్చేందుకు అంగీకరించకపోతే ఐబీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుందని గ్రాంజర్ స్పష్టం చేశారు. వారానికి మూడు రోజులు ఈ సందర్భంగా మరింత ప్రొడక్టివిటీ, క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. కాబట్టే ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి కాకుండా నేరుగా కార్యాలయాల్లో, క్లయింట్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసే వాతావరణాన్ని రూపొందించడంపై దృష్టిసారించినట్లు ఐబీఎం ప్రతినిధి తెలిపారు. ఈ విధానానికి అనుగుణంగా అమెరికాలోని ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్లు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని మేం కోరుతున్నాము’ అని అన్నారు. కృత్తిమ మేధపై దృష్టి ఐబీఎం ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్, సేవలపై దృష్టి తగ్గించింది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కృత్తిమ మేధకు సంబంధించిన ప్రొడక్ట్లను మార్కెట్కి పరిచయం చేసింది. అదే సమయంలో గత ఏడాది జనవరిలో 3,900 మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఈ ఏడాది సైతం వర్క్ ఫోర్స్ను తగ్గించే పనిలో పడిందని సమాచారం. వారికి అందించే వేతనాన్ని సంస్థ పునర్వ్యవస్థీకరణకు ఖర్చు చేస్తుందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ చెప్పారు. ఇతర కంపెనీల దారిలో ఐబీఎం 2022 చివరి నాటికి ఐబీఎంలో ప్రపంచ వ్యాప్తంగా 288,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించింది. తిరిగి ఇప్పుడు రిమోట్గా పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని కోరుతుంది. ఇలా ఐబీఎంతో పాటు పలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. అందుకు భారీగా ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. తిరస్కరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోమ్తో ప్రమోషన్లు కష్టం ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి హైలెట్ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది మేలో బ్లూమ్బెర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్సైట్లో లేని వారికి ప్రమోషన్లు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ఐబీఎంలోని కొన్ని బృందాలు ఇప్పటికే ఆఫీస్కు వచ్చి పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. -
టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ అండ్ ఎండీ కె కృతివాసన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయం గురించి మాట్లాడుతూ.. రిటర్న్ టు ఆఫీస్ పాలసీ చాలా బాగా పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని వెల్లడించారు. ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి 3 నుంచి 5 రోజులు ఆఫీసుకు వస్తున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) పర్యటనలో ఉన్న కృతివాసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేము రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రకటించిన కొంత కాలానికి ప్రత్యర్థి కంపెనీలు కూడా దీన్నే అనుసరించడం మొదలుపెట్టేశాయి. రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలు చేయడం కంపెనీకి బాగా కలిసొచ్చిందని, దీంతో సిబ్బందిని మరింత మోటివేట్ చేయడానికి అవకాశం లభించిందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత భారీగా పెరిగిన సమయంలో TCSతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థలు రొటేషన్ పద్దతిలో ఉద్యోగులు మళ్ళీ ఆఫీసులకు రావడానికి సన్నాహాలు చేశాయి. ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! అప్పటి సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చే అవకాశం ఉందని భావించారు, కానీ ఇప్పటికే 65 శాతం మంది ఆఫీసుకు వస్తున్నారు. కంపెనీ గత ఏడాది వందల మంది ఉద్యోగులను తొలగించింది కూడా. గతంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. రానున్న రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, వచ్చే త్రైమాసికం నాటికి 5 వేల నుంచి 6 వేల మందిని నియమించుకుంటే కంపెనీ తొలగించిన ఉద్యోగులకు సమానమవుతుందని కృతివాసన్ అన్నారు. -
పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?!
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ‘‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది. వారానికి మూడు రోజులు ఆఫీస్లోనే ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్ వర్క్ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విస్తరిస్తోన్న కరోనా కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్-19 వైరస్ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్-19, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్.. ప్రస్తుతం జేఎన్1 వైరస్గా మన ముందుకొస్తోంది. డిసెంబర్ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది. -
కంపెనీల్లో నయా ట్రెండ్, కాఫీ కప్పులతో ఉద్యోగులు.. బాసుల్లో గుబులు!
ప్రపంచ దేశాల్లోని ఎక్కువ శాతం సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ను రద్దు చేస్తున్నాయి. ఆఫీసుకు రావాలని పిలుపునిస్తున్నాయి. దీంతో సుదీర్ఘ కాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వారిని ఇప్పుడు ఆఫీసులో పనిచేయాలని ఆదేశించడం ఉద్యోగులకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే కాఫీ బ్యాడ్జింగ్ అనే కొత్త ట్రెండ్తో సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ అంటే? కోవిడ్-19 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్లతో ఆఫీస్లకు కొత్త కళ వచ్చింది. దీంతో కరోనా మహమ్మారితో రిమోట్గా వర్క్ చేస్తున్న సిబ్బందిని కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఎవరైతే ఆఫీస్లో పనిచేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారో ఆ ఉద్యోగులు.. ఆఫీస్లో ఐడీని స్వైప్ చేస్తారు. ఆ తర్వాత సహాచరులకు కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్తారు. అక్కడే హెచ్ఆర్, మేనేజర్ల దృష్టిలో పడేలా అటు ఇటూ తిరుగుతుంటారు. ఆ తర్వాత డెస్క్కు వచ్చి ఇంటికి వెళ్లిపోతారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అంటారు. ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే ఈ ఏడాదిలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ప్రతి 5 మందిలో 1 ఒకరు పూర్తిస్థాయిలో ఆఫీస్లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది హైబ్రిడ్ వర్క్ను కోరుకుంటుంటే 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్ ల్యాబ్స్’ అనే సంస్థ తెలిపింది. రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్ ఓల్ ల్యాబ్స్ చేసిన అధ్యయనంలో తప్పని సరిగా ఆఫీస్లో పనిచేయాలన్నా నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగం (58శాతం) మంది కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడుతున్నారు. ధోరణి అక్కడితో ఆగలేదు. మరో 8 శాతం మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడడంతో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడం యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. సంస్థల్లో ప్రతి విభాగంలో ఒకరో, ఇద్దరో ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడినా కంపెనీలకు పెద్ద నష్టం ఉండేది కాదు. హై స్కిల్ ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా ఆఫీస్ పనిచేయకుండా కాఫీ కప్పులతో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేయడం యామాన్యాలకు మింగుడు పడడం లేదు. క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్లోపు ప్రాజెక్ట్లను పూర్తి చేయకపోవడం, ఇటు ఉద్యోగులు చేజారిపోకుండా కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. కాఫీ బ్యాడ్జింగ్ను పుల్ స్టాఫ్ పెట్టాలంటే 'కాఫీ బ్యాడ్జింగ్' ట్రెండ్ తగ్గాలంటే కంపెనీలు అంతర్గత సమస్యలను పరిష్కరించాలి. కమ్యూనికేషన్ను పెంపొందించాలి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ఆఫీస్ వాతావరణం సైతం ఉద్యోగుల్ని ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. -
Infosys: 'వర్క్ ఫ్రమ్ హోం'పై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్కు వచ్చి పని చేయాలని సూచించింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సిబ్బందికి ఈ కొత్త నిబంధన తప్పని సరి అని మెయిల్లో పేర్కొంది. గత అక్టోబర్లో ఇదే తరహా మెయిల్స్ను సిబ్బందికి పంపింది. ఆ మెయిల్స్ ప్రకారం.. బ్యాండ్ 5, బ్యాండ్ 6 ఉద్యోగులు నెలకు 10 రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని పట్టుబట్టింది. ఆసక్తికరంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయానికి ముందే సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. రిమోట్ వర్క్ ఇన్ఫోసిస్ అనువైందేనని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత నెలకు 10 రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రావాలంటూ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. తాజాగా, వారానికి మూడు రోజులు ఆఫీస్లో వర్క్ తప్పని సరి చేయడం ఐటీ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. తప్పదు.. ఏం చేస్తాం కొన్ని సందర్భాలలో క్లయింట్లకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ మా వరకు సౌకర్యవంతమైన పని విధానానికే మా మద్దతు ఉంటుంది. మేం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కూడా అవకాశం ఇచ్చాం. ఇప్పుడు క్లయింట్లకు అనుగుణంగా వర్క్ను మార్చాల్సి వస్తుందని సలీల్ పరేఖ్ అన్నారు. -
అమెజాన్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేసేందుకు సిద్ధంగా లేని సిబ్బంది ప్రమోషన్లను నిలిపి వేస్తామని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని ప్రోత్సహించేలా అమెజాన్ యాజమాన్యం మేనేజర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, కెరీర్ పరంగా ఉన్నత స్థానాల్లో ఉండాలనుకునే ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ తప్పని సరి చేసింది. కాదు కూడదు అంటే గల కారణాల్ని వివరిస్తూ వైస్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రమోషన్ కావాలా? అయితే ఆఫీస్కి రండి అంతేకాదు, ఉద్యోగుల ప్రమోషన్ల బాధ్యతలను ఆయా విభాగాల మేనేజర్లకు అప్పగించింది. ఉద్యోగులతో చేయించే రోజూవారీ ఆఫీస్ పనులతో పాటు, ప్రమోషన్లకు తగిన అర్హతల్ని గుర్తించాలని చెప్పింది. కార్యాలయాల్లో పని చేసేందుకు మొగ్గు చూపే ఉద్యోగులు ప్రమోషన్లు, ఇతర అంశాలపై వైస్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాల్సి అవసరం లేదని, ఆ బాధ్యతల్ని సైతం మేనేజర్లే చేస్తారని అమెజాన్ ఉద్యోగులకు ఓ ఇంటర్నల్ ఇ-మెయిల్ పంపింది. ఈ ఏడాదిలో కొత్త వర్క్ పాలసీ అమెజాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాలంటూ కొత్త వర్క్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పని విధానం మే నెల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యోగుల నిరసన అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 30 వేల మంది ఉద్యోగులు గత మే నెలలో సియోటెల్లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సంస్థ తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డ్లను ప్రదర్శించారు. మీ అంగీకారంతో పనిలేదు ఆగస్ట్ నెలలో ఉద్యోగుల ఆందోళనపై సీఈవో ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. గతంలో ‘ మీరు కొత్త వర్క్ నిబంధనల్ని అంగీకరించలేదు. అలా అని కట్టుబడీ లేరు. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వారానికి మూడు రోజులు ఉద్యోగులు ఆఫీస్కు తప్పని సరిగా రావాల్సిందే’నని హెచ్చరించారు. తాజాగా, సిబ్బంది ఆఫీస్కు రావాలని, లేదంటే వారి ప్రమోషన్లను నిలిపివేస్తామని మరోసారి మెయిల్స్ పంపడంతో అమెజాన్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇతర సంస్థలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?
కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దాదాపు యథాస్థితికి రావడంతో టెక్ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇక వర్క్ ఫ్రం హోం పద్ధతికి గుడ్ బై చెపుతూ ఆఫీసులకు రావాల్సిందే అంటూ తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానం, కంపెనీల ఆదాయంపై ఒక సర్వే సంచలనంగా మారింది.. ఆ వివరాలు. ఎలా ఉన్నాయంటే.. WFH ద్వారా పలు కంపెనీలు వేగవంతమైన ఆదాయ వృద్దిని నమోదు చేశాయని తాజా సర్వేలో తేలింది. దీంతో పని ప్రదేశాలలో ఉత్పాదకత ,పనితీరుపై చర్చకు ఈ సర్వే మరోసారి తెరలేపింది. రిమోట్ పనిని అనుమతించే కంపెనీలు ఆఫీసు హాజరు విషయంలో మరింత కఠినంగా వ్యవరిస్తున్న కంపెనీలతో పోలిస్తే నాలుగు రెట్లు వేగంగా ఆదాయ వృద్ధిని సాధించాయని ఫ్లెక్స్-వర్క్ అడ్వైజర్ స్కూప్ టెక్నాలజీస్ సంస్థ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది. టెక్నాలజీ నుండి బీమా వరకు 20 రంగాల కంపెనీలో ఈ సర్వే జరిగింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) 554 పబ్లిక్ కంపెనీల్లో 26.7 మిలియన్ల మంది ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించారు. పూర్తిగా రిమోట్ లేదా ఉద్యోగులు కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంపికకు అనుమతిచ్చిన కంపెనీల్లో 2020 2022 మధ్య అమ్మకాలు 21శాతం అమ్మకాలు పెరిగాయి. కనీస ఆఫీస్ అటెండెన్స్ అవసరమయ్యే కంపెనీల వృద్ధి , వారంలో కొన్ని రోజుల్లో వచ్చినవి ఆఫీస్ ఫుల్ టైమ్లో ఉన్నవాటి కంటే రెండింతలు పెరిగిందని సర్వే తెలిపింది. రిమోట్ ఫ్రెండ్లీ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు తగ్గడంతోపాటు, గ్లోబల్గా నియామక అవకాశాలు పెరిగి, గ్రోత్ రేటు వేగం పెరుగుతుందని, స్కూప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబ్ సాడో తెలిపారు. (రిషీ సునాక్పై సుయెల్లా బ్రేవర్మన్ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం) స్కూప్ డేటాబేస్లోని 5,565 కంపెనీలలో, పూర్తి-సమయం కార్యాలయంలో పని అవసరమయ్యే షేర్ ఈ ఏడాది ఆరంభంలో 49 శాతంగా ఉండగా, ఇది అక్టోబర్ నాటికి 38 శాతానికి దిగి వచ్చింది.నిర్దిష్ట సంఖ్యలో పని రోజులు అవసరమయ్యే కంపెనీలలో, కేవలం 6 శాతం మందికి నాలుగు రోజులు , చాలా వరకు రెండు లేదా మూడు రోజులు చాలని Scoop-BCG సర్వే కనుగొంది. మెర్సర్ సీనియర్ ప్రిన్సిపాల్ లారెన్ మాసన్ పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగుల్లో ఫ్లెక్సీ వర్క్ పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ చౌదరి చేసిన మునుపటి పరిశోధనలో హైబ్రిడ్ పని కోసం కేవలం ఒకటి లేదా రెండు రోజులు ఆఫీసుకు వస్తే చాలని తేలింది. వర్క్ప్లేస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం,వ్యక్తిగత బృందాలకు వారు ఎప్పుడు, ఎక్కడ పని చేస్తారనే దానిపై కొంత స్వయం ప్రతిపత్తిని అందించడం మంచి పద్ధతి. ఇందులో ఆ కంపెనీ సీఈవో సూచించే తప్పనిసరి విధానం కంటే, హైబ్రిడ్ పాలసీని సెట్ చేసే టీమ్స్ నిర్ణయమే ఉత్తమని నిపుణుల వాదన.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement