-
మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే
శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగటానికి ఒకరోజు ముందు మేనిఫెస్టోను 'వచన్ నామ' పేరుతో విడుదల చేశారు.శివసేన పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా దోపిడిని ఆపడం, ఉపాధి కల్పన, వ్యవసాయ రుణమాఫీ మొదలైనవాటిపైన ద్రుష్టి పెటుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రధానం అంటూ ఉద్ధవ్ ఠాక్రే విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.ఉద్యోగాల కల్పన: రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని పేర్కొన్నారు. తప్పకుండా రాష్ట్రంలో కావలసిన ఉద్యోగాలను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లకుండా.. జిల్లా స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు.రైతుల సంక్షేమం: వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమే కాకుండా, పంట భీమాకు సంబంధించిన షరతులను కూడా సవరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే మేనిఫెస్టోలో వెల్లడించారు. వ్యవసాయ పరికరాలు, విత్తనాల మీద GST లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సు చేసిన కనీస మద్దతు ధర అమలు కూడా జరుగుతుందని ఆయన అన్నారు.పన్నుల వ్యవస్థ: పన్ను ఉగ్రవాదాన్ని తగ్గించడానికి, న్యాయపరమైన.. సమన పన్నుల వ్యవస్థను నిర్థారిస్తామని ఠాక్రే అన్నారు.పర్యావరణ పరిరక్షణ: మహారాష్ట్రలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, పరిశ్రమలను మాత్రమే అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26) రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని ప్రాంతాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16,589 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.#WATCH | Former Maharashtra Chief Minister and Shiv Sena (UBT) chief Uddhav Thackeray releases the party manifesto named 'Vachan nama' for the Lok Sabha elections, in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/6dcQhs8X8N— ANI (@ANI) April 25, 2024 -
సేవ్ డెమోక్రసీ ర్యాలీలో 'ఉద్దవ్ ఠాక్రే' కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: 'కేజ్రీవాల్'ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి రాంలీలా మైదానంలో 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ 'ఉద్ధవ్ ఠాక్రే' కూడా పాల్గొన్నారు. సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో.. బీజేపీ 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక పార్టీ, ఒక వ్యక్తి సారథ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఎన్నికల ప్రచారానికి రాలేదు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వచ్చాము అన్నారు. ఒకప్పుడు అవినీతి చేసిన వాళ్లను బీజేపీ వాషింగ్ మెషిన్లో ఉతికి శుభ్రం చేసిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది? అని ఠాక్రే ప్రశ్నించారు. జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకులు అరవింద్ కేజ్రీవాల్ & హేమంత్ సోరెన్ భార్యలకు మద్దతునిస్తూ.. వారి పోరాటానికి మద్దతుగా వారి సోదరుడు ఇక్కడ ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. दिल्ली के रामलीला मैदान में पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ने INDIA गठबंधन महारैली को संबोधित किया। pic.twitter.com/RdfFXDVFnL — Office of Uddhav Thackeray (@OfficeofUT) March 31, 2024 -
మహారాష్ట్ర స్పీకర్కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
‘మహా’ జనానిదే తుది తీర్పు
సుప్రీంకోర్టు తుది గడువు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికే పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతుందనీ, అదే ‘నిజమైన శివసేన’ అనీ తేల్చారు. అలాగని ఉద్ధవ్ ఠాక్రే వెంటనున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకూ మన చట్టసభల్లో ఫిరాయింపులు, ఇతరేతర సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షాల ప్రయోజనాల పరిధిని మించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి సభాధ్యక్షులు సిద్ధపడరని తరచు రుజువవుతూనేవుంది. మహారాష్ట్ర కూడా దానికి మినహాయింపు కాదు. అందువల్లే రెండుగా చీలిన శివసేన వర్గాల్లో ఏది నిజమైందో, ఏది కాదో తేల్చడానికి స్పీకర్ నార్వేకర్కు ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం లేదు. జనవరి 10 తుది గడువని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పకపోయివుంటే మరెన్ని నెలలు పట్టేదో అనూహ్యం. లెక్కలు తేల్చడానికి శివసేనకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. అయినా నార్వేకర్ గరిష్ట వ్యవధిని తీసుకుని తుది నిర్ణయం ప్రకటించారు. 2019లో ఆ పార్టీ నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిననాటికి శివసేన ఎమ్మెల్యేలు 55 మంది. 2022 జూన్ 21న 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభానాయకుడిగావున్న ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తిరగబడటంతో పార్టీ నిలువునా చీలింది. వెంటనే ఉద్ధవ్ మేల్కొని షిండే స్థానంలో సభానాయకుడిగా అజయ్ చౌధరిని నియమించటంతోపాటు, విప్గా వున్న షిండే వర్గం నేతను తొలగించి, తన వర్గంలోని సునీల్ ప్రభును ప్రకటించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదని గ్రహించాక జూన్ 29న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతుండగా వెలువడిన నార్వేకర్ నిర్ణయం... ఈ చీలికను ప్రోత్సహించి షిండే సర్కారులో చేరిన బీజేపీకి సహజంగానే ఊరటనిచ్చే అంశం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువుండే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడివుంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తేది. ఇప్పటికే ఉద్ధవ్ శివసేన పేరును, గుర్తును కూడా కోల్పోయారు. ఆ అంశంలో ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సొంత మనిషిగా భావించిన షిండేయే బీజేపీ ప్రోద్బలంతో శివసేనలో చిచ్చు రగిల్చి ఉద్ధవ్కు అన్యాయం చేశారని జనం భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది షిండే వర్గంతోపాటు బీజేపీని కూడా దెబ్బతీసేలా వున్నదని ఆ సర్వేల సారాంశం. అందుకే అనర్హత అంశం జోలికి వెళ్లకపోవటమే మంచిదని షిండే వర్గం భావించినట్టు కనబడుతోంది. అయితే ఉద్ధవ్ వర్గం మౌనంగా ఏమీవుండదు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయటంతోపాటు ప్రజాక్షేత్రంలోకెళ్తానని ఇప్పటికే ప్రకటించింది. కనుక ‘నిజమైన శివసేన’ షిండేదేనన్న స్పీకర్ నిర్ణయంపై అది కావలసినంత రచ్చ చేస్తుంది. అటు కొందరు ఎమ్మెల్యేలతో నిష్క్రమించిన అజిత్ పవార్ వర్గంపైనా ఇలాంటి పిటిషనే పెండింగ్లో వుంది. ఈనెల 31లోగా వెలువడే ఆ నిర్ణయం కూడా ప్రకంపనలు రేపడం ఖాయం. మన రాజ్యాంగం సభాధ్యక్షులకు ఎన్నో అధికారాలిచ్చింది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లోనేనని తేల్చిచెప్పాయి. కానీ తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీల ప్రయోజనాల పరిధిని మించి స్పీకర్లు వ్యవహరించలేకపోతున్నారు. మహారాష్ట్ర విషయానికే వస్తే ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, స్పీకర్పై ఒత్తిడి తెస్తే తప్ప నిర్ణయం వెలువడలేదు. తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పీకర్లు చెబుతూ వుంటారు. వాటి ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు. అయితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినంతవరకూ అటువంటి స్వతంత్రతను అందరూ హర్షిస్తారు. అందుకు భిన్నంగాపోయి న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటే అది స్పీకర్ల వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పడేటపుడూ... ఆ ప్రభుత్వాలు అస్థిరతలో పడినప్పుడూ ప్రత్యర్థి పక్షాలు ఖరీదైన విలాసవంతమైన హోటళ్లలో శిబిరాలు నిర్వహించటం, అవసరాన్నిబట్టి విమానాల్లో వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలించటం తరచు మన దేశంలో కనబడుతూనేవుంటుంది. ఈ తంతుమన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది కూడా. దానికితోడు సభాధ్యక్షులుగా వున్నవారు సైతం ఏదో ఒక వర్గం చేతిలో కీలుబొమ్మలై తటస్థతకు తూట్లుపొడిచి నిర్ణయాలు తీసుకోవటం లేదా నిర్ణయ ప్రకటనలో విపరీతమైన జాప్యం చేయటం తరచు కనబడుతుంది. భారీ మెజారిటీతో నెగ్గిన తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ సర్కారును ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు జరిగిన పరిణామాలను ఎవరూ మరిచిపోరు. అంతకుముందూ, ఆ తర్వాతా కూడా పదే పదే అలాంటి ఉదంతాలే దేశంలో పునరావృతమయ్యాయి. స్పీకర్ తాజా నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం న్యాయస్థానంలోనూ, వెలుపలా పోరాడుతుంది. ఇప్పటికైతే షిండే ప్రభుత్వం నిశ్చింతగా వుండొచ్చు. కానీ ఈ చీలికలపైనా, ప్రభుత్వాలను కూల్చటంపైనా జనం స్పందన ఎలావుండబోతున్నదో రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాతైనా రాజకీయ పక్షాలు పరిణతితో వ్యవహరించటం నేర్చుకుంటాయని ఆశించాలి. -
నేను కాలారామ్ దేవాలయంలో హారతి ఇస్తా: ఉద్ధవ్
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం అందలేదు. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే కూడా ఒకరు. తనకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఠాక్రే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్దవ్ తన తల్లి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిర ఆలయం ప్రారంభోత్సవం రోజే తనతోపాటు తన పార్టీ నేతలు నాసిక్లోని కాలారామ్ ఆలయానికి వెళ్లి అక్కడ గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహించనున్నట్లు చెప్పారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన గర్వించదగ్గ విషయమని, ఆత్మగౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సానే గురూజీ నిరసనలు చేసిన కాలారామ్ సదర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తాం’’ అని ఠాక్రే చెప్పారు. కాగా రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని గతవారం ఉద్ధవ్ తెలిపిన విషయం తెలిసిందే. రాముడు కొలువై ఉన్న కాలారామ్ ఆలయం నాసిక్లోని పంచవటి ప్రాంతంలో ఉంది. నల్లరాతితో చెక్కిన రాముడి విగ్రహం ద్వారా ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. రాముడు వనవాస సమయంలో భార్య సీత, సోదరుడులక్ష్మణుడితో పంచవటిలో ఉండేవారని భక్తులు విశ్వసిస్తారు. 1930లో దళితులను ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కాలారామ్ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. . -
మళ్లీ గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయి
ముంబై: అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశమన్నందున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా రామాలయం ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారని వారు తిరిగి వెళ్లే సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే. అల్లర్లు జరుగుతాయి.. జల్గావ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఉద్ధవ్ ఠాక్రే వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవం గురించిన ప్రస్తావన చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భక్తులు బస్సుల్లోనూ, రైళ్లలోనూ లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని వారు తిరిగి వెళ్లే సమయంలో వారిపై దాడులు జరుగుతాయని దుండగులు రాళ్లు రువ్వుతారని అన్నారు. గోద్రా అల్లర్ల తరహాలోనే హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశముంటుందని హెచ్చరించారు. VIDEO | "It is a possibility that the government could invite a large number of people for the Ram Temple inauguration in buses and trucks, and on their return journey, an incident similar to that in Godhra may occur," said Shiv Sena (UBT) leader Uddhav Thackeray earlier. STORY… pic.twitter.com/iEZocaMs9c — Press Trust of India (@PTI_News) September 11, 2023 గోద్రా తరహాలోనే.. 2022, ఫిబ్రవరిలో జరిగిన గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టింఛాయా అందరికి తెలిసిందే. ఈ హింసాకాండలో 58 మంది మృతి చెందగా ఎందరో గాయాల పాలయ్యారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఉన్న సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ హైకోర్టు మొత్తం 31 మందిని దోషులుగా నిర్ధారించగా 65 మందిని నిర్దోషులుగా ప్రకటించింది గుజరాత్ హైకోర్టు. గుజరాత్ హైకోర్టు నిర్ధారించిన తీర్పుపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్ ఇంకా పెండింగ్లోనే ఉంది. మీ తండ్రి ఆత్మకు క్షోభ.. ఇదిలా ఉండగా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిన్ను చూసి మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని.. నా బిడ్డకు ఎమైంది? ఎవరి ఆశీస్సులతో నా బిడ్డ రాజకీయంగా ఎదిగాడని అనుకుంటారని.. మీరు చూస్తే ఇండియా కూటమిలో చేరి నానాయాగీ చేస్తున్నారన్నారు. రామ జన్మభూమిపై మీ తండ్రిగారి ఆశీస్సులు ఉంటాయని మీ కూటమికి ఆ శ్రీరామచంద్రుడు కొంతైనా జ్ఞానమివ్వమని ప్రార్ధించమని కోరారు. నోరు విప్పరేం.. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేను స్వార్ధపరుడని చెబుతూ తమిళనాడు నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాలా సాహెబ్ ఠాక్రే ఉండి ఉంటే మీ స్వార్ధాన్ని చూసి మనోవేదనకు గురయ్యేవారని వ్యాఖ్యానించారు. #WATCH | On Shiv Sena (UBT) chief Uddhav Thackeray's remarks on Ram Mandir, BJP MP Ravi Shankar Prasad says, "...All I would like to say is that this entire alliance, that is against PM Modi, can go to any limit for votes...I would like to pray to Lord Ram to give them some… https://t.co/Zme5rTQMI6 pic.twitter.com/54bCbNWkhm — ANI (@ANI) September 11, 2023 ఇది కూడా చదవండి: 'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు -
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్..
ముంబయి: శివసేన చీఫ్(యూబీటీ), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఓ పాము అలజడి సృష్టించింది. ముంబయిలోని తూర్పు బాంధ్రా కాలానగర్లో ఉన్న థాక్రే ఇంట్లోకి ఆదివారం ఓ పాము దూరింది. విషయం గమనించి స్నేక్ క్యాచ్ర్కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ బృందాలు.. పామును పట్టుకున్నారు. కోబ్రా జాతికి చెందిన విషపూరిత పాముగా గుర్తించారు. मातोश्री में निकला सांप, पानी की टांकी के पीछे से सांप को किया गया रेस्क्यू । उद्धव ठाकरे ने किया सर्प मित्रो का शुक्रिया @IndiaTVHindi @indiatvnews pic.twitter.com/byAiNqS6yu — Namrata Dubey (@namrata_INDIATV) August 7, 2023 దాదాపు నాలుగు అడుగుల మేర పాము ఉందని చెప్పారు. పామును చూడటానికి ఉద్ధవ్ థాక్రే ఇంటి బయటకు వచ్చారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందాలు.. దానిని సమీప అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదీ చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్ను కలిసిన ఉద్ధవ్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్లో ‘పవార్’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా అజిత్ పవార్ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పనితీరు తెలుసు: ఉద్ధవ్ అజిత్తో భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు.. అజిత్ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు. చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం విపక్షాల భేటీ మరుసటి రోజే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే అజిత్తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్ పవార్ సైతం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్ను కోరారు. కాగా అజిత్ తన బాబాయిని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. చదవండి: షాకింగ్ వీడియో.. మహిళా పైలట్ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. VIDEO | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra Deputy CM Ajit Pawar in Mumbai. (Source: Third Party) pic.twitter.com/38w33jcPnv — Press Trust of India (@PTI_News) July 19, 2023 -
Sharad Pawar: ఆది నుంచి ఫిరాయింపులే!
1958 నాటి సంగతి; పూనా(ఇప్పుడు పుణె) సిటీ, ‘బృహన్ మహారాష్ట్ర కాలేజి ఆఫ్ కామర్స్’లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇరు ప్యానల్ అభ్యర్థులు చివరి రోజు రాత్రి తమ తమ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. ఓటమిని శంకించిన ఓ గ్రూప్ లీడర్ ఒక పథకం వేశాడు. ఆ రోజు మధ్య రాత్రి, ఆయన ఓ నలుగురు మిత్రులతో హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న కొందరు రైవల్ గ్రూప్ విద్యార్థులను నిద్ర లేపి తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా బతిమాలాడు. బదులుగా, తన టీం గెలిచిన వెంటనే కాలేజి యాజమాన్యంతో సంప్రదించి వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడు. తెల్లవారే వరకు ఈ ప్రచారం నడిచింది. మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో ఆయన టీం గెలిచింది. ఆ టీమ్ లీడర్ మరెవరో కాదు– శరద్ చంద్ర గోవిందరావ్ పవార్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శరద్ రావ్ నేరుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్త అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎదిగి, తన 27వ ఏట (1967లో) ఎమ్మెల్యేగా ఎన్నికై వైబీ చవాన్ ఆశీస్సులతో మొదటిసారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి (1972) కూడా అయ్యారు. 1977 లోక్ సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రభంజనంతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవటమే కాక, నిలువునా చీలి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ (1978)గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధించక పోవటంతో, రెండు కాంగ్రెస్ పార్టీలూ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వసంత్ దాదా పాటిల్ (రెడ్డి కాంగ్రెస్) ముఖ్య మంత్రి అయ్యారు. శరద్ పవార్ రెవెన్యూ మంత్రిగా ఆయన క్యాబినెట్లో చేరారు. కొన్ని రోజులకే, జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర శేఖర్ (మాజీ కాంగ్రెస్ యంగ్ టర్క్ లీడర్) స్నేహాన్ని ఆసరా చేసుకుని, యంగ్ పవార్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీని వీడి, ప్రతిపక్ష జనతా పార్టీ మద్దతుతో తన 38వ ఏట (జూలై, 1978) ముఖ్య మంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తెల్లబోవటం కాకలు తీరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల వంతైంది. ఇందిరా గాంధీ 1980లో కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శరద్ పవార్ సీఎం పదవి కోల్పోయారు. ఆ తర్వాత ‘కాంగ్రెస్ (సెక్యులర్)’ పేరుతో కొంత కాలం ప్రాంతీయ పార్టీ నడిపించారు పవార్ సాబ్. ఇందిరాజీ హత్య తరువాత రాజీవ్ గాంధీ పవార్ను, తన పార్టీ బలగంతో తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. 1988 జూన్లో శరద్ పవార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో నాగపూర్ అసెంబ్లీ సమావేశాల్లో, శివసేన పార్టీ అంతర్గత కుమ్ములాటను గమనించి, ఆ పార్టీ ఓబీసీ నేత చగన్ భుజ్బల్, మరో 16 మంది శివ సేన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తీర్థం ఇప్పించారు సీఎం పవార్. ఆయన పర్యవేక్షణలో అలా శివసేన నుండి మొదటిసారిగా ‘వలసలు’ ప్రారంభమయ్యాయి. ఇక పదేళ్ల అనంతరం (2001) కొంతమంది పార్టీ నాయకులను తీసుకొని కాంగ్రెస్కు మరోసారి తిలోదకాలు ఇచ్చి, ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ (ఎన్సీపీ)ని స్థాపించారు. 1989 నుండి మూడు దశాబ్దాల వరకు హిందూత్వ భావజాలం పులుముకున్న శివసేన – భారతీయ జనతాపార్టీలు ప్రతీ ఎన్నికలోనూ కలిసే పోటీ చేశాయి. 1995–2000 ఈ కూటమి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేసింది. ఇక 2019 ఎన్నికల్లో ఈ కూటమి 161 సీట్లు గెలవటంతో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది, కాని అది కుదర్లేదు. కారణం, ముఖ్యమంత్రి పదవి తమకే చెందాలని 56 సీట్లు గెలుచుకున్న శివసేన మారాం చేయడమే. ఇంతలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, తన బాబాయి సీనియర్ పవార్ను కాదని భాజపాతో చేతులు కలిపారు. ఫలితంగా భాజపా నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పడింది. తనను విడిచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను పవార్ సాహెబ్ చాకచక్యంగా తిరిగి తన గూటిలోకి చేర్చుకోవటంతో అజిత్ పవార్ పాచిక పారలేదు. ఇక సంఖ్యా బలం కోల్పోయిన ఈ కొత్త ప్రభుత్వం, 60 గంటల్లోనే (26.11.2019న) పడిపోవటం విశేషం. ఆ తర్వాత శరద్ పవార్ రంగంలోకి దిగి, తనదైన శైలిలో చకచకా పావులు కదిలించారు. ‘మహా వికాస్ అఘాడి’ పేరుతో శివసేన (56), ఎన్సీపీ (54), కాంగ్రెస్ (44) కూటమిని ఏర్పాటు చేసి, శివసేన కోరిక మేరకే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (28.11.2019) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో 105 స్థానాలు గెలిచిన భాజపా ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. దిగ్భ్రాంతికి గురైన భాజాపా తనతో శివసేనకు ఉన్న మూడు పదుల దోస్తీని తుంచిన శరద్ పవార్తో పాటు, శివసేన అధినాయకుడు ఉద్ధవ్కూ గుణపాఠం నేర్పాలని పకడ్బందీగా ప్లాన్ చేసింది. 45 ఏళ్ల క్రితం పవార్ రచించిన రాజకీయ స్క్రిప్ట్నే ఆదర్శంగా తీసుకొని 2022 జూన్లో ఏక్నాథ్ శిందేని ఉపయోగించి శివసేననూ, 2023 జూలైలో అజిత్ పవార్ను ఉపయోగించి ఎన్సీపీని... చీల్చి కొత్త ప్రభుత్వాల ఏర్పాటును దిగ్విజయంగా పూర్తి చేసి ‘టిట్ ఫర్ టాట్’ అంది భారతీయ జనతా పార్టీ. ఔను మరి, మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు (శివసేన, ఎన్సీపీ) సంస్థాపరంగా చెదిరి, కోలుకోలేని స్థితిలో, తెరచాప తెగిన నావలా మారాయి. చివరిగా, క్యాన్సర్ జబ్బుకు ‘షికార్’ అయినప్పటికీ, 83 ఏళ్ల సీనియర్ నేత శరద్ చంద్ర పవార్, ‘నా టైర్డ్ హు, నా రిటైర్డ్ హు’ అంటూ, ధీమాగా సానుభూతి కోసం (ఓటు బ్యాంకు), రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇప్పుడు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టారు. తన ఫార్ములా తనకే బెడిసి కొట్టడంతో ఏర్పడ్డ (రాజకీయ) గాయం, మరో వైపు పార్టీ అనుయాయులు తననే పార్టీ అధ్యక్ష పదవి నుండి వెలివేయటంతో ఒంటరి పక్షి అయ్యారు. ఈ సంక్షోభం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి మరి! (శరద్ పవార్ స్వీయచరిత్ర ‘ఆన్ మై టర్మ్స్’, వైభవ్ పురంధరే రాసిన ‘ది రైజ్ ఆఫ్ ది శివసేన’ ఆధారంగా) జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పి.ఎఫ్. కమిషనర్ ‘ 9819096949 -
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
విపక్షాల ఐక్యతే ముఖ్యం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రతరం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను గురువారం వేర్వేరుగా కలుసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రయోజనాల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను కూడా కాపాడడానికి కృషి చెయ్యాలని ఇరువురు నేతలకు చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ముందు దేశ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యం ఉందని నితీశ్ అన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితే బీజేపీపై విజయం సాధించవచ్చునని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
సరిదిద్దలేని మహా తప్పిదాలు
ఉత్కంఠగా ఎదురుచూసిన కోర్టు తీర్పు వచ్చింది. కానీ, న్యాయం మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. శివసేన రెండు ముక్కలై వీధికెక్కిన వివాదంలో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా గురువారం ఇచ్చిన తీర్పు తర్వాత పరిస్థితి అదే. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే వర్గాల మధ్య శివసేనలో అంతర్గత కలహాలు చివరకు ప్రభుత్వ మార్పిడిగా పర్యవసించినప్పుడు మహారాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్లు అత్యుత్సాహం చూపిన తీరును కోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. వారు చట్టప్రకారం నడుచుకోలేదని కుండబద్దలు కొట్టింది. కానీ, శివ సేనను వీడి, పార్టీని శిందే రెండు ముక్కలు చేసిన సందర్భంలో సభలో బలపరీక్షకు నిలవకుండానే రాజీనామా సమర్పించిన ఉద్ధవ్ సర్కార్ను పునరుద్ధరిస్తూ ఆదేశాలివ్వలేమనీ పేర్కొంది. జరిగింది తప్పేనని తీర్పు చెబుతూనే, పాత తప్పును ఇప్పుడు సరిదిద్దలేమని అశక్తత వ్యక్తం చేసింది. అంటే శిందే సర్కార్ కొనసాగేలా ఇప్పటికి ఊరట నిచ్చింది. అదే సమయంలో ఉద్ధవ్ రాజీనామా చేయకుండా, సభలో బలపరీ క్షకు దిగుంటే... ఆ బలపరీక్షే చట్టవిరుద్ధం గనక ఆయన సర్కారును పునరుద్ధరించే వీలుండేదని కోర్ట్ అభిప్రాయపడింది. అలా అప్పట్లో విప్ను ధిక్కరించిన శిందే అనర్హతకు తలుపు తెరిచే ఉంచింది. పార్టీ అంతర్గత విభేదాల లెక్క తేల్చేందుకు నాటి మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ శాసనసభలో బలపరీక్ష పెట్టాలని నిర్ణయించడం శుద్ధ తప్పు అనే మాట లోతైనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్కు రాజకీయ పార్టీల అంతర్గత విభేదాలతో పనేమిటి? ప్రభుత్వం మద్దతు కోల్పోయినట్టు తగిన సాక్ష్యాధారాలేమీ లేకుండానే, స్వయానా గవర్నరే బలపరీక్ష జరపా లని కోరడమంటే... చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని అనివార్యంగా మెజారిటీ కోల్పోయేలా చేసి, కూలి పోయేలా చూడడమే! అంటే, కారణాలేమైనా తన చర్యల ద్వారా ఒక నిర్ణీత ఫలితం వచ్చేలా చేయ డమే! ఉద్ధవ్ సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కార్ రాజీనామాకు ఇదే కారణమైంది. ఇది గవర్నర్లు చేయాల్సిన పనేనా? ఈ కేసులో వాదనల సందర్భంగా సుప్రీమ్ ప్రస్తావించిన ఈ అంశాలు ఆలోచించాల్సినవి. కావాల్సిన పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్న విషాదానికి ఇవన్నీ మహా చిహ్నాలు. మరోపక్క శిందే వర్గమే ‘అసలైన’ శివసేన అని గుర్తిస్తూ, దానికే పార్టీ చిహ్నమైన విల్లంబులను ఎన్నికల సంఘం కేటాయించడమూ తొందరపాటే. అలాగే, అసెంబ్లీ స్పీకర్ సైతం శిందే వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించే వరకు ఆ వర్గపు ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులను నానబెట్టడం మరో తప్పు. ఇలా గవర్నర్, స్పీకర్, ఎన్నికల సంఘం సహా అన్ని రాజ్యాంగ సంస్థలూ తప్పుదోవ పట్టిన తీరును సుప్రీమ్ తన తీర్పులో బలంగా ప్రస్తావించడం గమనార్హం. శివసేన కథలో తదుపరి ఘట్టం మరింత విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న వేళ ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి రాక మానవు. అలాగే, విప్ జారీ అయినా సరే చీలిక ముసుగులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తిప్పలు తప్పవనీ తేలిపోనుంది. వెరసి, తాజా తీర్పు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖయం అనిపిస్తోంది. గతంలోకెళితే ఈ కథలో ఎన్నో మలుపులు. 2019 అక్టోబర్లో బీజేపీ–శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. మరిన్ని మంత్రి పదవులు, రెండున్నరేళ్ళ పాటు సీఎం పీఠం కట్టబెట్టాలని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి ఒప్పందమేదీ లేదని బీజేపీ అడ్డం తిరిగింది. దాంతో గెలిచిన పక్షం రోజులకే కూటమి విచ్ఛిన్నమైంది. కమలనాథుల సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో కొత్త పొత్తులు, ప్రభుత్వాలు– సీఎంల మార్పులు, కాంగ్రెస్– ఎన్సీపీ– శివసేనల ‘ఎంవీఏ’ కూటమి ఆవిర్భావం... ఇలా అనేకం జరిగాయి. వాటిలో భాగమే 2022 జూన్లో ఏకంగా శివసేన వ్యవస్థాపకుడైన బాల్ఠాక్రే కుమారుడూ, అప్పటి మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్పై శిందే తిరుగుబాటు. గవర్నర్ బలపరీక్ష నిర్ణయంతో ఉద్ధవ్ జూన్ 29న రాజీనామా చేశారు. ఆ మర్నాడే బీజేపీ అండతో శిందే సీఎం కుర్చీ ఎక్కారు. శిందే, ఆయనతో బయటకొచ్చి పార్టీ తమదేనన్న మరో 15 మంది అనర్హత కథ కొన్నాళ్ళుగా కోర్టులో నలుగుతోంది. తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి శిందే సర్కార్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ కోరుతుంటే, కోర్టు వ్యాఖ్యలెలా ఉన్నా తమను కొనసాగనివ్వడమే ప్రజాస్వామ్య విజయమని శిందే, ఫడ్నవీస్లు జబ్బలు చరుస్తున్నారు. విస్తృత ధర్మాసనంలో కథ ఏ కొత్త మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమను కాదని ప్రత్యర్థులతో కూటమి కట్టిన మునుపటి మిత్రపక్షం శివసేనను నిలువునా చీల్చడంలో బీజేపీ ఇప్పటికే సఫలమైంది. సొంతంగా చక్రం తిప్పేందుకు అదను కోసం చూస్తోంది. అది రుచించకున్నా, బీజేపీ దోస్తీ లేకుండా శిందే సేన మనుగడ కష్టం. మరోపక్క తన వెంట మిగిలిన కొద్దిమందీ చేజారిపోకుండా కాపాడుకోవడం ఉద్ధవ్ ముందున్న సవాలు. ఈ పరిస్థితుల్లో తాజా తీర్పు ఉద్ధవ్కు నైతికంగా బలమిచ్చింది. కోర్టు తీర్పుతో కుర్చీ దక్కకున్నా, గవర్నర్ అవాంఛనీయ పాత్రతో ప్రత్యర్థులు అధికారం చేజిక్కించుకున్న తీరును తప్పుబట్టడమే ఊరట. అనర్హతలపై స్పీకర్ సత్వరమే నిర్ణయించాలనీ కోర్ట్ చెప్పడం గమనార్హం. అందుకే, ముందే అన్నట్టు తీర్పు వచ్చినా, న్యాయం ఇంకా జరగాల్సి ఉంది. కోర్టు లోపల ఒక దశ పోరాటం ముగిసి ఉండవచ్చు. మరోదశ మిగిలివుంది. కోర్టు బయట కూడా ఉద్ధవ్ తదితరుల నైతిక పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుంది. సుప్రీమ్ వ్యాఖ్యలతోనైనా మన రాజ్యాంగ వ్యవస్థలు దిద్దలేని తప్పిదాలకు దూరంగా ఉంటాయా? -
ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా! మహారాష్ట్ర మాజీ గవర్నర్
మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్ 80 ఏళ్ల భగత్ సింగ్ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. (చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు) -
థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్.. మీకు ఆ పదాలు సూట్ కావు అంటూ..
ముంబై: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పు పట్టింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. కాబట్టి స్టేటస్కోను పునరుద్ధరించడం సాధ్యం కాదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఉద్దవ్ థాక్రేకు పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫడ్నవీస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే వర్గానికి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఉద్దవ్ వర్గంపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం -
సుప్రీం కోర్టులో స్వాగతించిన ఫడ్నవీస్
-
థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. : సుప్రీం కోర్టు
ఢిల్లీ: శివసేన కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నైతిక విజయంగా భావిస్తోంది థాక్రేకు చెందిన శివసేన వర్గం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న రాజ్యాంగ ధర్మాసనం.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కిందటి ఏడాది శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితుల్లో.. బలనిరూపణ పరీక్షకు వెళ్లకుండానే ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఇవాళ్టి తీర్పులో ప్రధానంగా ప్రస్తావించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. ఒకవేళ థాక్రే గనుక రాజీనామా చేసి ఉండకపోయి ఉంటే.. ఈ కోర్టు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేదని స్పష్టం చేసింది. ► విప్ను నియమించాల్సింది రాజకీయ పార్టీ. అంతేగానీ శాసనసభా పక్షం కాదు. కాబట్టి, ఏక్నాథ్ షిండే క్యాంప్ నియమించిన విప్ చెల్లుబాటు కాదు. కాబట్టి, శివసేన విప్గా భరత్ గోగావాలేను నియమిస్తూ హౌజ్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు. ► అలాగే.. ఒక పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను, లేదంటే పార్టీల మధ్య నెలకొన్న కలహాలను బలనిరూపణ పరీక్ష పరిష్కరించలేదు. ► ఆ సమయంలో ఉద్దవ్ థాక్రే పార్టీ మెజార్టీ కోల్పోయారనే అధికారిక సమాచారం నాటి గవర్నర్ వద్ద లేదు. అయినా ఆయన బలనిరూపణకు ఆదేశించారు. ఆయనది రాజకీయ జోక్యం.. తొందరపాటు నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు కూడా అని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ► గవర్నర్ విచక్షణాధికారం అమలు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు కానిస్టిట్యూషన్ బెంచ్ అభిప్రాయపడింది. ► అయితే.. బలపరీక్షకు వెళ్లకుండా ఉద్దవ్ థాకక్రే రాజీనామా చేసిన క్రమంలో.. బీజేపీ మద్దతు ద్వారా మెజార్టీ ఉందని ప్రకటించుకున్న షిండే వర్గాన్ని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్ సరైన పనే చేశారని బెంచ్ అభిప్రాయపడింది. అలాగే.. బలనిరూపణకు ముందుకు వెళ్లలేని సీఎంను.. ఇవాళ తన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించమని అడిగే హక్కు కూడా ఉండదు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ► చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్తో పాటు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మొత్తం 141 పేజీల తీర్పు కాపీని ఈ కేసు కోసం సిద్ధం చేసింది. ► ఈ సందర్భంగా 2018 నాబమ్ రెబియా కేసు(తన తొలగింపును కోరుతూ తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు స్పీకర్ అనర్హత ప్రక్రియను ప్రారంభించలేరని)ను ప్రస్తావించిన బెంచ్.. ఆ కేసులోనూ పలు అంశాలపై నిర్ణయాలు జరగలేదని, కాబట్టి విస్తృత ధర్మాసనానికి అంశాల్ని బదిలీ చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో.. శివసేన కేసులో ఇంకా తుది తీర్పు రాలేదనే భావించాలి. ► ఇక సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయమని పేర్కొన్న ఉద్దవ్ థాక్రే.. ఇప్పుడున్న సీఎం, డిప్యూటీ సీఎంలకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మాదిరే రాజీనామా చేయాలంటూ ఉద్దవ్ థాక్రే పిలుపు ఇచ్చారు. ► మరోవైపు సుప్రీం కోర్టు తమకు అనుకూలంగానే ఉందని షిండే వర్గం ప్రకటించుకుంది. మహారాష్ట్రలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడింది. -
ఉద్ధవ్ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగడానికి సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. ఉద్ధవ్ ఠాక్రేను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోకుండా∙ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. అప్పట్లో గవర్నర్ భగత్సింగ్ కోషియారీ వ్యవహరించిన తీరు సమర్థనీయంగా లేనప్పటికీ ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏక్నాథ్ షిండేను ఆదేశించలేమని పేర్కొంది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభం, తద్వారా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన 8 పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం∙తీర్పు వెలువరించింది. ‘సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదు. ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించి తీరు చట్టబద్ధంగా లేదు. సభలో బల పరీక్ష ఎదుర్కోకుండా ఉద్ధవ్ రాజీనామా చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఉద్ధవ్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ మద్దతున్న షిండేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అది సమర్థనీయమే’ అని వెల్లడించింది. ఉద్ధవ్ వర్గంపై తిరుగుబాటు చేసి, షిండే పక్షాన చేరిన శివసేన ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత వేటు వేయలేమని తెలియజేసింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్కు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసు ఇచ్చే అధికారం ఉందా? అనేది తేల్చడానికి అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. షిండే రాజీనామా చేయాలి: ఉద్ధవ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అప్పటి గవర్నర్ తీరును కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. వారు(షిండే వర్గం ఎమ్మెల్యేలు) తమ పారీ్టని, తండ్రి బాల్ ఠాక్రే అందించిన వారసత్వానికి దగా చేశారని మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం చట్టప్రకారం పొరపాటే అయినప్పటికీ నైతిక విలువలను పాటిస్తూ పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. వెన్నుపోటుదారులతో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. చదవండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్కు భారీ ఊరట.. కేంద్రానికి షాక్ -
దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్
మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రధానోత్సవంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 11 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ ఘటనపై ఎవరూ సమగ్రంగా దర్యాప్తు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ముంబై ఖార్గర్లో జరిగిన అవార్డు వేడుకను సరిగా ప్లాన్ చేయలేదని విమర్శించారు. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రే, ఎన్సీపీ నాయకుడు అజిత పవార్ ఎంజీఎం కమోతేతో కలిసి ఆ కార్యక్రమంలో వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరణించిన కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులను భరిస్తుందని సీఎం షిండే ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు) -
ఔను! మేము అధికారం కోసమే కలిశాం!
ప్రధాని మోదీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోదీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి? అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజిలోనే మోదీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రావడకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు. నిజానికి అసలు ప్రధాని చదువకున్నారా అంటూ అనుమానం లేవనెత్తారు. ముఖ్యమంత్రి కావలనే ఉద్దేశ్యంతోనే సైద్ధాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపి చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి బదులు ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం, మరింత బలంగా ఉన్నాం అని థాకరే అన్నారు. అలాగే సేన నాయకుడు ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ..అవకాశం కుదరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని, సరిగ్గా ఎన్నికల సమయంలో మరింతగా మాయమాటలతో మోసం చేస్తోందని ఆరోపించారు. కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా?. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే..అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తూ..బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్తను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: శ్రీ రామనవమి శోభా యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు) -
సావర్కర్ను అవమానిస్తే.. దోస్తీ కటీఫ్!
ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే హెచ్చరికలు జారీ చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్(వీర సావర్కర్)ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని.. ఇది విపక్ష కూటమిలో విభేదాలకు దారి తీయొచ్చని సున్నితంగా రాహుల్ను మందలించారు. ఆదివారం మాలేగావ్లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తూ.. ‘‘వీరసావర్కర్ మా దేవుడు. ఆయన్ని అవమానించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మా దేవుళ్లను అంటూంటే మేం చూస్తూ ఊరుకోవాలా?’’ అని థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్ 14 ఏళ్లపాటు అండమాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించారు. అది ఊహాకు కూడా అందనిది. అదొక త్యాగం. అలాంటి త్యాగాలను అవమానిస్తే ఊరుకోవాలా? అని రాహుల్ గాంధీని ఉద్దేశించి థాక్రే ప్రసంగించారు. అయితే.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ, రాహుల్ గాంధీని ఉద్దేశ్యపూర్వకంగా తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని, తద్వారా పోరాట సమయం వృథా అవుతోంది అని ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇదిలా ఇలాగే కొనసాగితే.. విపక్ష కూటమి ముక్కలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చివర్లో హెచ్చరించారు కూడా. తాజాగా అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పేందుకు తానేం సావర్కర్ను కాదని, తాను గాంధీనని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పినట్లు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019 కర్నాటక ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలు, పరువు నష్టం దావా.. చివరకు తాజాగా ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది రాహుల్ గాంధీకి. ఆ వెంటనే ఆయన లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే ఈ పరిణామాలపై మిత్రపక్షం శివసేన (యూబీటీ) రాహుల్కు మద్దతుగా నిలిచింది. రాహుల్పై బీజేపీ విమర్శలను స్వయంగా తిప్పికొట్టారు ఉద్దవ్ థాక్రే. ‘‘మోదీ భారతదేశం కాదు. మన స్వాతంత్ర్య సమరయోధులు ఇందుకోసమే ప్రాణాలర్పించారా? మోదీని ప్రశ్నించడం అంటే.. భారత్ను అవమానించడం ఏమాత్రం కాదు’’ అని థాక్రే వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: లోక్సభ ఎన్నికలపై కమల్ హాసన్ కామెంట్ -
.. బారాబర్ మోదీ పేరుతోనే ఓట్లు అడుగుతాం!
.. బారాబర్ మోదీ పేరుతోనే ఓట్లు అడుగుతాం! -
మేఘాలయలో బీజేపీ బిగ్ ప్లాన్.. ఉద్దవ్ థాక్రే సంచలన కామెంట్స్!
ముంబై: ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి బీజేపీతో సహ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో, మేఘాలయలో రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఉద్దవ్ థాక్రే ఆదివారం.. మహారాష్ట్రలోని ఖేడ్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నేను ముఖ్యమంత్రిని కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని పుణెలో అమిత్ షా అన్నారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? అంటూ విమర్శలు చేశారు. గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పటేల్.. ఆర్ఎస్ఎస్ను నిషేధించారని అన్నారు. కానీ, ఆయన పేరును కూడా బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్ చేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. శివసేన బాణం-విల్లు గుర్తుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారు. కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
ఊహించని పరిణామం.. ఉద్దవ్తో కేజ్రీవాల్ భేటీ.. దేనికి సంకేతం!
ముంబై: మహారాష్ట్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. ముంబైలోని బాంద్రాలో ఉద్దవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ రౌత్లు కూడా పాల్గొన్నారు. కేజ్రీవాల్కు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, భగవంత్మాన్ దగ్గరుండి స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆదిత్య ఠాక్రే ట్విటర్లో షేర్చేశారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి టీ తాగూందేరేమాతోశ్రీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఉద్దవ్ మాట్లాడుతూ.. దేశాన్ని బలోపేతం చేసే మార్గాలపై నేతలంతా చర్చించినట్లు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్లుగా ఉద్ధవ్ను కలవాలనుకుంటున్నా కోవిడ్ తదితర కారణాల వల్ల కలవలేకపోయానని కేజ్రీవాల్ చెప్పారు. శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం లాక్కుందని విమర్శించారు. ఠాక్రేకు మద్దతిస్తూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఉద్ధవ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఉద్ధవ్తో ఆప్ అధినేత సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి జోష్లో ఉన్న ఆప్.. బీఎంసీ ఎన్నికలపై సైతం దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ ఎన్నికల్లో ఆప్, ఉద్దవ్ శివసేన రెండూ కలిసి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి దీనిపై స్పష్టత రాలేదు. ఇదే విషయంపై కేజ్రీవాలన్ను ప్రశ్నించగా.. ఎన్నికలు వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని అన్నారు. కాగా ఇటీవలే సీఎం ఏక్నాథ్ షిండే వర్గాన్నే అసలైన శివసేనగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు విల్లు బాణాన్ని సైతం షిండే వర్గానికే కేటాయించింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే కేజ్రీవాల్, ఉద్దవ్ను కలవడం విశేషం. వీరి భేటీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Thank you CM @ArvindKejriwal ji for accepting our humble invite for a cup of tea at Matoshri and coming along with CM @BhagwantMann ji and MPs Sanjay Singh ji and @raghav_chadha today. pic.twitter.com/HOhYAqfyul — Aaditya Thackeray (@AUThackeray) February 24, 2023 -
ప్రచారం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు: శివసేన నాయకుడు
ముంబై: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సచిన్ భోంస్లేపై దాడి జరిగింది. ఈ ఘటన పూణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భోంస్లే తెలిపిన వివరాల ప్రకారం..‘ఉప ఎన్నికల కోసం చించ్వాడ్ ప్రాంతంలో ఎన్సీపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాం. అంతలో బీజేపీ కార్యకర్తలు నేరుగా వచ్చి మమ్మల్ని కొట్టారు. వారితో నాకు వ్యక్తిగత వాదనలు లేవు. గతంలో బీజేపీ అభ్యర్థి నాపై పోటి చేశారు. వీళ్లు ఆయన కార్యకర్తలే’ అని చెప్పారు. ఈ క్రమంలో భోంస్లే సహా ఎన్సీపీ కార్యకర్తలపై వారు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో భోంస్లే చేతికి గాయం కాగా, ఎన్సీపీ కార్యకర్త గోరఖ్ పాశంకర్ కాలు విరిగిందని చెప్పారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్తా తిలక్ గత ఏడాది డిసెంబర్ 22న మరణించగా, చించ్వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ దీర్ఘకాలిక అనారోగ్యంతో జనవరి 3న కన్నుమూశారు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపి నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే సహా అన్ని పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కస్బా పేట, చించ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. చదవండి అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం -
శివసేన వివాదం: షిండే వర్గానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే(ప్రస్తుత మహరాష్ట్ర ముఖ్యమంత్రి) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. థాక్రే వర్గానికి ఊరట ఇవ్వలేదు దేశ అత్యున్నత న్యాయస్థానం. కానీ, థాక్రే వర్గ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలంటూ షిండే క్యాంప్కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం నిరాకరించింది సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. వాళ్లు(షిండే శిబిరం) ఈసీ వద్ద విజయం సాధించారు. ఈ తరుణంలో స్టే విధించలేమంటూ బెంచ్ స్పష్టం చేసింది. అలాగే.. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు థాక్రే శిబిరానికి సూచించింది. శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే పేరుతో పార్టీ పేరును.. వెలుగుతున్న టార్చ్ సింబల్ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా పిటిషనర్కు సూచించారు. ఆపై పిటిషన్పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement