Top Stories
ప్రధాన వార్తలు
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లు ఆంధ్రప్రదేశ్లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు.
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే గాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్డోస్కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్ల మిస్సింగ్పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్బుక్ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
Israel-Hamas war: గాజాలో భీకర పోరు.. 210 మంది మృతి
జెరూసలెం/గాజా: సెంట్రల్ గాజాలో నుసెయిరత్లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్ను ఉటంకిస్తూ అల్జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్ అల్ బలాహ్లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్ మెయిర్ జాన్(21), ఆండ్రీ కొజ్లోవ్(27), ష్లోమి జివ్(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్.. శనివారం ఐడీఎఫ్ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్ కేన్సర్ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు.
దాయాది సమరానికి ‘సై’
అక్టోబర్ 23, 2022...మెల్బోర్న్ మైదానంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్...రవూఫ్ బౌలింగ్లో కోహ్లి రెండు అద్భుత సిక్సర్లతో టీమిండియాను గెలిపించిన తీరును మన అభిమానులెవరూ మరచిపోలేరు. ‘గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ టి20 వరల్డ్ కప్ హిస్టరీ’ అంటూ తొలి సిక్స్కు కితాబిచ్చింది. ఇప్పుడు మళ్లీ టి20 వరల్డ్ కప్లో అలాంటి అద్భుత క్షణాల కోసం ఇరు జట్ల మధ్య మరో మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. నాటి పోరు తర్వాత టి20 ఫార్మాట్లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్లో పాక్ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై సునాయాసంగా నెగ్గిన భారత్ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్పై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఐసీసీ ఈ మ్యాచ్కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. న్యూయార్క్ అభిమానుల కోసం తక్కువ సమయంలో 34 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని నిరి్మంచింది. పిచ్పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అక్షర్ స్థానంలో కుల్దీప్! ఐర్లాండ్పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. టాపార్డర్లో రోహిత్, కోహ్లి, పంత్ ఖాయం కాగా...సూర్యకుమార్, దూబే, పాండ్యాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్లో విఫలమైనా...అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లికి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం లేకుండా టీమ్ విజయాన్ని పూర్తి చేసుకుంది.టాప్–7 వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కుల్దీప్ మంచి ఫామ్లో ఉండటంతో పాటు పాక్పై మంచి రికార్డు కూడా ఉంది. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్లలో ఒకరిని తప్పించి కుల్దీప్ను ఎంపిక చేస్తారు. గందరగోళంలో... మరో వైపు పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యూఎస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమికంటే ఆ మ్యాచ్లో పేలవ ఆటతీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అటు కెప్టెన్సీ లో కూడా లోపాలతో బాబర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మిడిలార్డర్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యూఎస్తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్లో ఆడుతున్నా బౌలర్లు షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్ కప్ మ్యాచ్లో మినహాయిస్తే ప్రతీ సారి భారత్ చేతిలో భంగపడిన టీమ్ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి. టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X ఉగాండావేదిక: ప్రొవిడెన్స్; ఉదయం గం. 6 నుంచిఒమన్ X స్కాట్లాండ్ వేదిక: నార్త్ సౌండ్; రాత్రి గం. 10:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
మేషం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.వృషభంఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మద్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.మిథునంఅనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకంకొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, నీలం రంగులు. గణేశాష్టకం పఠించండి.సింహంరుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు,తెలుపు రంగులు.గణేశ్ను పూజించండి.కన్యకొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు, వస్త్రలాభాలు కలుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తులనూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేషంగా గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. విద్యార్థులకు మరింత అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవర్గాలు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. కళారంగం వారు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.వృశ్చికంకొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు.. భూముల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుధ్యానం మంచిది.ధనుస్సుఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మద్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరంఆర్థిక లావాదేవీలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. బంధువుల సూచనలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.కుంభంబంధువుల చేయూతతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది, అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.మీనం...––––క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు, పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్గా కీర్తీ సురేష్ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ను బాలీవుడ్లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు.
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్ఏఎల్లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్బాస్కెట్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్తో, హారర్ లుక్తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్ద కాలంలో భారత్ సాధించిన మూడో విజయం ఈవై రీజియన్లలో ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా తన హోదాను సుస్థిరం చేసుకుంది.ఒకటిన్నర దశాబ్దం క్రితం వెల్లయన్ తన కుటుంబ వ్యాపారంలో నాయకత్వాన్ని చేపట్టి, కల్లోలమైన భాగస్వామ్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్వారా చోళమండలానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 60 రెట్లు పెరిగింది. 2018లో వ్యూహాత్మక పెట్టుబడుల పునర్విభజన, కొనుగోళ్ల ద్వారా 70 ఏళ్ల నాటి తయారీ సంస్థ టీఐఐకి నాయకత్వం వహించారు.నాల్గవ తరం కుటుంబ వ్యాపారంలో భాగంగా వ్యవస్థాపకత్వ స్ఫూర్తి తనలో లోతుగా ఉందని సుబ్బయ్య అన్నారు. సవాళ్లను అవకాశాలుగా స్వీకరించి, స్వీయ అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా మనం సాధించేదానికి హద్దులు ఉండవని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (డబ్ల్యూఈఓవై) అవార్డు గ్రహీతలుగా డాక్టర్ కిరణ్ మజుందార్ షా (2020), ఉదయ్ కోటక్ (2014), నారాయణమూర్తి (2003) సరసన వెల్లయన్ చేరారు. ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024ను వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రయోజనం, వృద్ధి, ప్రభావం అనే నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా స్వతంత్ర ప్యానెల్ ఎంపిక చేసింది.
పెదపారుపూడి టు ఫిలింసిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్కు వచ్చారు. 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్ ఔట్డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు.
సినిమా
ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!
చీరలో అందాలన్నీ చూపించేస్తున్న రీతూ చౌదరినాభి అందాలతో మైమరిపిస్తున్న పూనమ్ బజ్వాబేబీ బంప్తో డ్యాన్సులు చేస్తున్న అమలా పాల్క్యూట్ యోగాసనాలతో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ దివిబ్లాక్ డ్రస్లో మెంటలెక్కిస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్పొట్టి స్కర్ట్లో చూపు తిప్పుకోనివ్వని తమిళ బ్యూటీ దివ్య View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sakshi Chaudharry (@isakshi_chaudhary) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Reeshma Nanaiah 🎀 (@reeshma_nanaiah) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)
డబ్బు తీసుకోలేదు.. చాలామంది ఇలాగే.. దీనిగురించి ఎవరూ మాట్లాడరు!
కొందరు హీరోలు పైసా తక్కువైతే చాలు ప్రాణం పోయినట్లు ఫీలవుతారు. మరికొందరు నిర్మాతల పరిస్థితిని, సినిమా రిజల్ట్ను బట్టి రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు లేదంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరు. హీరో కార్తీక్ ఆర్యన్ రెండో రకానికి చెందినవాడు. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల సదరు సినిమాకు పని చేసే టెక్నీషియన్స్కు ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని ఈ మధ్య బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. తడిసి మోపెడవుతున్న బడ్జెట్హీరోల పారితోషికానికి తోడు.. వారి మేకప్మెన్కు, హెయిర్ డ్రెస్సర్కు, స్టైలిస్ట్కు.. ఇలా తన దగ్గర పనిచేసే అందరికీ జీతాలివ్వాలని సరికొత్త డిమాండ్లు పెడుతుండటంతో బడ్జెట్ మితిమీరిపోతోందన్నది ప్రధాన అంశం. తాజాగా దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. ఈ చర్చ జరగకముందు నేను షెహజాదా సినిమా చేశాను. చిత్ర నిర్మాతల దగ్గర సరిపడా బడ్జెట్ లేకపోవడంతో నా ఫీజు వదిలేసుకున్నాను. రెమ్యునరేషన్ తీసుకోలేదని సినిమా నిర్మాతల్లో నేనూ ఒకడినని క్రెడిట్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరూ రాయరు.హీరోల త్యాగం చూడరే!నేనే కాదు, చాలామంది స్టార్స్ నిర్మాతల కోసం ఆలోచించి చాలా సాయం చేస్తుంటారు. వారికి తోడుగా ఉంటారు. దర్శకుడు, యాక్టర్స్, నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే ఆలోచిస్తారు. ఎవరూ దాన్ని సాగదీయాలని చూడరు. సినిమా ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకైతే నా డబ్బులు నాకు ముట్టాల్సిందే అని ఎవరూ మాట్లాడరు అని చెప్పుకొచ్చాడు.అల వైకుంఠపురములో రీమేక్కాగా అల వైకుంఠపురములో సినిమాకు రీమేక్గా షెహజాదా తెరకెక్కింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా!
సాధారణంగా హీరోయిన్లకు నాలుగైదు హిట్లు పడితేకానీ గుర్తింపు రాదు. చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే..స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ వస్తుంది. అక్కడ ఒక్క హిట్ పడితే చాలు..ఇక స్టార్ హీరోయిన్ అయిపోతారు. వరుస అవకాశాలు వస్తాయి. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్లకి మాత్రం తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తుంది. అది హిట్టయితే చాలు..వాళ్లు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. అలాంటి బంపరాఫర్స్ని పట్టేసిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.మాళవికా మోహన్.. ఈ బ్యూటీ పేరు తెలుగు ఆడియన్స్కి అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, తమిళ్ ఆడియన్స్కి మాత్రం బాగా తెలుసు. రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ‘మాస్టర్’తో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్గా మారడం ఖాయం.జాన్వీ కపూర్.. దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అక్కడ వరుస సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్పై కన్నేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్తో నటించే చాన్స్ కొట్టేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’మూవీలో జాన్వీనే హీరోయిన్. అంతేకాదు రామ్చరణ్-బుచ్చిబాబు కాంబినేసన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే..సౌత్లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయమని సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.అషికా రంగనాథ్.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ హీరోయిన్కి ప్రమోషన్స్ వచ్చినట్టే లెక్క. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అషికా రంగనాథ్కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
బాలీవుడ్లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!
శ్రీలీల.. టాలీవుడ్లోకి వచ్చి వరసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతానికైతే తెలుగు వరకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తెలుగు వరకు అయితే ఈమె చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే ఉంది. మరోవైపు తమిళంలోనూ ఆఫర్స్ వచ్చాయని అంటున్నారు. కానీ ఇంకా ఫైనల్ అయినట్లు లేదు. ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్లు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుందని టాక్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల.. తెలుగు-కన్నడ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. టీనేజ్లో ఉండగానే కన్నడ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కానప్పటికీ కేక పుట్టించే డ్యాన్సింగ్ స్కిల్స్ ఉండటంతో వరస ఛాన్సులు వరించాయి. అలా అరడజనుకు పైగా మూవీస్ చేసింది. కానీ 'ధమాకా' తప్పితే చెప్పుకోదగ్గర హిట్ ఈమెకు పడలేదు.రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందని అన్నారు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయిందంటున్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా అనుకుంటున్నారట. ఇది కన్ఫర్మ్ అయి, హిట్ కొడితే మాత్రం శ్రీలీల పంట పండినట్లే!(ఇదీ చదవండి: బిగ్బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!)
ఫొటోలు
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)
క్రీడలు
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు.ట్రావిస్ హెడ్(34), వార్నర్(39), మిచెల్ మార్ష్(35), మాక్స్వెల్(28), స్టోయినిష్(30) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ,అర్చర్, లివింగ్ స్టోన్, రషీద్ తలా వికెట్ సాధించారు.రాణించిన ఆసీస్ బౌలర్లు..202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. ఫిల్ సాల్ట్(37), మొయిన్ అలీ(25) తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిష్ తలా వికెట్ పడగొట్టారు. కాగా ఆసీస్కు ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం.
చాంపియన్ స్వియాటెక్
పారిస్: వరల్డ్ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ఎర్ర మట్టిపై తన జోరును కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో వరుసగా మూడో ఏడాది ఆమె చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–1 స్కోరుతో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. 2022, 2023, 2024లలో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్...అంతకు ముందు 2020లో కూడా ఇక్కడ విజేతగా ట్రోఫీని అందుకుంది. 2022 యూఎస్ ఓపెన్ కలిసి ఆమె ఖాతాలో మొత్తం ఐదు గ్రాండ్స్లామ్లు ఉన్నాయి. గ్రాండ్స్లామ్ టోరీ్నలలో ఫైనల్ చేరిన ఐదు సార్లూ స్వియాటెక్ టైటిల్ దక్కించుకోవడం విశేషం. 2007 (జస్టిన్ హెనిన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ను వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్గా ఆమె నిలిచింది. తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పావ్లిని బలమైన ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. తొలి సెట్లో స్వియాటెక్ సర్వీస్ను బ్రేక్ చేసి పావ్లిని 2–1తో ముందంజ వేసినా...అది అక్కడితో సరి. పోలండ్ స్టార్ ఆ తర్వాత తన స్థాయికి తగ్గట్లు చెలరేగిపోయి వరుసగా 10 గేమ్లను గెలుచుకుంది. ఫలితంగా తొలి సెట్ను గెలుచుకోవడంతో పాటు రెండో సెట్లోనూ 5–0తో విజయానికి చేరువైంది. ఈ స్థితిలో తర్వాతి గేమ్ను ఎలాగో పావ్లిని గెలుచుకోగలిగినా...తర్వాతి గేమ్ను అలవోకగా సొంతం చేసుకొని స్వియాటెక్ సంబరాలు చేసుకుంది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ 18 విన్నర్లు కొట్టగా...18 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో పావ్లిని తన ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్కు 24 లక్షల యూరోలు (సుమారు రూ. 22 కోట్లు) ప్రైజ్మనీగా లభించాయి. నేడు పురుషుల ఫైనల్ అల్కరాజ్ (స్పెయిన్) X జ్వెరెవ్ (జర్మనీ)సా.గం.6.00 నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
న్యూయార్క్: టి20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చెమటోడ్చి రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన పోరులో సఫారీ 4 వికెట్లతో నెదర్లాండ్స్ను ఓడించింది. టాస్ నెగ్గిన సఫారీ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్ లెవిట్ (0), మ్యాక్స్ ఓ డౌడ్ (2) సహా టాపార్డర్లో విక్రమ్జీత్ (12) కూడా నిరాశపరిచారు. ఈ దశలో సైబ్రాండ్ (45 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ లొగాన్ వాన్ బిక్ (23; 3 ఫోర్లు) అండతో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్ ముగియకముందే 12 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో వన్డే వరల్డ్కప్ మ్యాచ్ ఫలితం పునరావృతమవుతుందేమో అనిపించింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (37 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)కు జతయిన మిల్లర్ (51 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ఐదో వికెట్కు 65 పరుగులు జోడించి పరిస్థితి చక్కబెట్టాడు. అనంతరం అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా నెదర్లాండ్స్తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగారు. ఓట్నీల్ బార్ట్మన్ (4-0-11-4), అన్రిచ్ నోర్జే (4-0-19-2), మార్కో జన్సెన్ (4-0-20-2) ధాటికి నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికా పేసర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో సైబ్రాండ్ ఎంజెల్బ్రెట్చ్ (40), లొగాన్ వాన్ బీక్ (23) రాణించకపోయంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో సైబ్రాండ్, వాన్ బీక్తో పాటు విక్రమ్జీత్ (12), స్కాట్ ఎడ్వర్డ్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లెవిట్ 0, మ్యాక్స్ ఓడౌడ్ 2, బాస్ డి లీడ్ 6, తేజ నిడమనూరు 0, టిమ్ ప్రింగిల్ 0, వాన్ మీకెరన్ 1 నాటౌట్ పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్ మహారాజ్లకు వికెట్లు దక్కనప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన బార్ట్మన్ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.కాగా, గ్రూప్-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్.. నేపాల్ను మట్టికరిపించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్
బిజినెస్
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.పంజాబ్లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది.
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు.
భారత్లో టెస్లా పెట్టుబడులు.. మస్క్ యూటర్న్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.భారత్కు ఆహ్వానంఆ ట్వీట్కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్కు రిప్లయి ఇచ్చారు. మస్క్ యూటర్న్.. అంతలోనే భారత్లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్ భారత్లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్ ట్వీట్ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రీకాల్
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐకూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది.
వీడియోలు
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
సెంట్రల్ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట
రేవంత్ రెడ్డికి చెక్ ?.. తెలంగాణలో కర్ణాటక ఫార్ములా
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
ఇంత దారుణమా..
వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్
ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం
హైదరాబాద్ లో భారీ వర్షం
ఎంతవరకైనా సిద్ధం..
ఫ్యామిలీ
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
మనల్ని ఎవరైన కామెంట్ చేస్తేనే దిగులు పడిపోతాం. మనం బాగానే ఉన్నా.. ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తారనే విషయం తెలిసిందే. అలాంటిది అస్సలు రూపమే చూసేందుకు అసహ్యంగా ఉంటే.. అస్సలు బయటకు అడుపెట్టం. కానీ ఈ అమ్మాయి ఆ బాధను దిగమింగడం కాదు..సానుకూలంగా ఆ వైకల్యాన్ని అంగీకరించింది. ఆ అవహేళనలను అధిగమంచి తానెంటో ప్రపంచానికి తెలియజేడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. జన్మతః లేదా మరేదైన కారణం వల్ల వచ్చే వైకల్యం లేదా అనారోగ్యంతో చతికిలపడిపోకూడదని చాటి చెప్పింది. సత్తువ, స్థైర్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్ చేసింది. ఎవరంటే ఆమె..కేరళలోని తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల బిస్మిత. చిన్నప్పటి నుంచి ఎన్నో హేళనలు, చిత్కారాలు. ఎందుకంటే..? బిస్మిత అరుదైన జన్యుపరమైన చర్మ పరిస్థితి కారణంగా శరీరం అంతా మచ్చల మచ్చలుగా ఉంటుంది. ఇలా బిస్మతకు పుట్టిన రెండు నెలలకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆమె తల్లి మజిత(47)కు కూడా ఇలానే ఉండటంతో..అదే ఆమెకు వంశపారపర్యంగా వచ్చేసింది. కేరళలోని ఆసుపత్రులన్నీ తిరిగింది ఆమె తల్లి. జన్యుపరంగా వచ్చే చర్మ సమస్య, చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేయడంతో.. కూతురి జీవితం ఏమైపోతుందోనని ఆందోళనకు గురైంది మజిత. చెప్పాలంటే ఇది ఒక విధమైన బొల్లి వ్యాధి మాదిరిగా బిస్మిత చర్మం ఉంటుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా.. చదువును మాత్రం వదల లేదు. అలా ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అయితే బిస్మిత చిన్నప్పుడు స్కూల్లో జరిగే పాటల పోటీల్లో ఎప్పుడూ ఆమెనే విజేత. అందరూ ఆమె గొంతు బాగుంటుందని ప్రశంసించేవారు. దీంతో తానే సొంతంగా వీడియోలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బిస్మితకి. అందుకు అమ్మ కూడా ఒప్పుకోవడంతో 2019లో టిక్టాక్ వీడియోలు చేయడం ప్రారంభించింది. అయితే వాటికి ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చేవని బాధగా చెబుతోంది బిస్మిత. అస్సలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా..నువ్వు దెయ్యానివా లేక మచ్చల జింకవా.. అంటూ కామెంట్లు పెట్టేవారు. ఇది జన్యుపరమైన సమస్య కదా!..దీన్నే ఇంతలా పట్టించుకుంటున్నారేంటీ అని బాధగా ఉండేది బిస్మతకి. అయినా సరే వీడియోలు తీయడం ఆపలేదు. అనుకోకుండా టిక్టాక్ని మనదేశంలో బ్యాన్ చేయడంతో ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేసేది. వాటిని కూడా అసభ్య పదజాలంతో ట్రోలింగ్ చేసేవారు. అయినా సరే వెనకడుగు వేయడకుదని గట్టిగా నిశ్చయించుకుంది బిస్మిత. అయితే ఇన్స్టాలో బిస్మిత వీడియో చూసి.. ఓ ఫొటోగ్రాఫర్ మేకోవర్ పేరుతో ఫొటో షూట్ చేస్తానని అడిగాడు. ఆ షూట్లో నవ వధువులా బిస్మిత మేకప్తో ఉంటుంది. అందమైన వధువుగా బిస్మిత మారిన వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఒక్క రోజులోనే లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ‘బిస్మి వ్లాగ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది బిస్మిత. మచ్చలున్న అమ్మాయిని పెళ్లాడటానికి ఎవరు ముందుకొస్తారని బంధువులంతా అన్నారు. కానీ ఆటో డ్రైవర్ సాను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఆయన సపోర్ట్ ఎంతో ఉందంటోంది బిస్మిత. ఈ రీల్స్లో తనలాంటి వాళ్లు ఎదుర్కొనే సమస్యలను, రోజువారీ విషయాలను షేర్ చేస్తుంది బిస్మిత. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా. అయితే అతడికి కూడా ఇలాంటి జన్యు సమస్యే వచ్చింది. తన కొడుకు అయినా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె భర్త ఎన్నో ఆస్పత్రులు తిప్పాడు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం బాబుకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతోంది బిస్మిత. ఈ విషయాన్నే వీడియోలో చూపిస్తుంటే..దీనికి కూడా ఆమెను విమర్శించడం బాధకరం. కొడుకు అలా ఉన్నా కూడా.. వీడియోలు చేస్తున్నావు..నీ బతుకు ఇంతేనా అని తిడుతూ కామెంట్లు పెడుతున్నారని బాధగా చెప్పింది బిస్మిత. అయితే తాను వాటిని పట్టించుకోను ఇంకా అలాంటివే చేస్తాను..నా కొడుకికి ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పేందుకైనా ఆపాను అని స్టైర్యంగా చెబుతోంది బిస్మిత.నిజంగా బిస్మిత చాలా గ్రేట్ కదూ..! జస్ట్ ఎవ్వరైనా చిన్నగా.. ఏదైనా అన్నా.. తట్టుకోలేం, ఈజీగా తీసుకోలేం. అలాంటిది ఆమె తన రూపం అలా ఉన్నా ధైర్యంగా కెమెరా ముందుకు రావడమే గాక తనలాంటి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. నిజంగా బిస్మిత తనలాంటి వాళ్లకే కాదు..ట్రోలింగ్కి గురయ్యి బాధపడుతున్నవారికి కూడా ఈమె స్ఫూర్తి.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!)
జిమ్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్మిల్పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత)
హానికరమైన ఉపేక్ష!
కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తులను దురాశను వారల యవినయములునీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధకర్మమున ఫలమొందక కౌరవేంద్ర!‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావుఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర..
న్యూస్ పాడ్కాస్ట్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఆస్తి కోసమే బాలిక హత్య
ప్రకాశం జిల్లా: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డి పై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డి ని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్ఏఎల్లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్బాస్కెట్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.