మహబూబాబాద్‌ జిల్లాలో ప్రమాదం: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌ జిల్లాలో ప్రమాదం: ముగ్గురు మృతి

Published Wed, Nov 8 2017 11:38 AM

road accident in mahabubabad district

సాక్షి, మహబూబాబాద్:  మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెదనాగారం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదనాగారం శివారులో రహదారిపై ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement