
రామగుండంలో అగ్నిప్రమాదం
ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడంతో గ్రామ శివారులో ఉన్న తుమ్మ చెట్లు దగ్ధమయ్యాయి.
కరీంనగర్ (రామగుండం): ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడంతో గ్రామ శివారులో ఉన్న తుమ్మ చెట్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం కార్పోరేషన్ ఐదో డివిజన్ పరిధిలోని నర్రశాల పల్లె గ్రామశివారులో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పొదల్లో మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.