కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని జ్యోతినగర్లో ఉన్న ఎన్టీపీసీ పార్కులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని జ్యోతినగర్ ఎన్టీపీసీ పార్కులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.
వివరాల ప్రకారం. ..జ్యోతినగర్లోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో ఉన్న పార్కులో అగ్నిప్రమాదం జరిగింది. ఎండవేడి ఎక్కువగా ఉండి, పార్కులో ఎండుగడ్డి ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. కాగా ఈ సమయంలో పార్కులో జనసంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలిసిన ఎన్టీపీసీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.