పాట్నా పేలుళ్ల కేసులో నలుగురి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

పాట్నా పేలుళ్ల కేసులో నలుగురి అరెస్ట్

Published Thu, May 22 2014 1:46 AM

పాట్నా పేలుళ్ల కేసులో నలుగురి అరెస్ట్ - Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీకి హాని తలపెట్టే ఉద్దేశంతో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేధించింది. ఇదే లక్ష్యంతో గతేడాది అక్టోబర్ 27న బీహార్‌లోని పాట్నాలో మోడీ పాల్గొన్న సభా మైదానం వద్ద పేలుళ్లకు పాల్పడిన కేసులో నలుగురు ఉగ్రవాదులను బుధవారం అరెస్ట్ చేశారు. వీరిలో హైదర్‌అలీ అలియాస్ బ్లాక్ బ్యూటీ, ముజీబుల్లా, నుమన్ అన్సారీ, మరో నిందితుడు (జువెనిల్) ఉన్నారు. వీరు సిమి సభ్యులని, ఇండియన్ ముజాహిదీన థతోనూ అనుబంధం ఉందని ఎన్‌ఐఏ డెరైక్టర్ జనరల్ శరద్‌కుమార్ తెలిపారు. మోడీకి హానిచేసే ఉద్దేశంతో వీరు కుట్రపన్నారని,  పాట్నా పేలుళ్లలో పాల్గొన్నారన్నారు.  మోడీ ర్యాలీల వద్ద రెక్కీ నిర్వహించారని యూపీతోపాటు పాట్నాలో వీరు సన్నాహాలు చేసినట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement