విరాట్ కోహ్లి- అనుష్క శర్మ. ఒకప్పుడు ప్రేమికులు.. ఇప్పుడు భార్యాభర్తలు. అయినా వారి మధ్య అనుబంధం చెక్కుచెదరలేదు. రోజురోజుకు వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. అనుబంధం మరింత దృఢమవుతోంది. ఇదే విషయాన్ని తాజాగా కోహ్లి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్టుతో చాటుకున్నాడు. భార్య అనుష్కను ఆలింగనం చేసుకొని గట్టిగా ముద్దుపెడుతున్న ఫొటోను పోస్టు చేశాడు. గాఢంగా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటున్న ప్రేమజంట కార్టూన్ ఫొటో ఎదుట.. విరుష్క జంట అదే పోజును రిపీట్ చేసినట్టు ఈ ఫొటో ఉంది.
ఈ ఫొటో ఇలా పెట్టగానే అలా వైరల్గా మారిపోయింది. ఈ ఫొటోను ఏకంగా 28 లక్షలకుపైగా నెటిజన్లు లైక్ చేయడం గమనార్హం. ఈ జంట అన్యోన్య దాంపత్యాన్ని ప్రశంసిస్తూ 41వేలకుపైగా మంది కామెంట్ చేశారు. ఈ కామెంట్లలో అనుష్క శర్మ చేసిన కామెంట్ స్పెషల్ ఆట్రాక్షన్గా నిలించింది. ‘ఐ మిస్ యూ టూ మై లవ్’ (నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను) అంటూ అనుష్క ఈ పోస్టుకు కామెంట్ చేసింది.
దాదాపు నాలుగేళ్ల ప్రేమించుకున్న అనంతరం విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకున్నారు. ఇటు క్రికెట్లో కోహ్లి.. అటు సినిమా షూటింగ్లో అనుష్క బిజీగా ఉండటంతో ఈ కొత్తజంట ప్రస్తుతం వేరువేరుగానే గడుపుతోంది. టీమిండియా కెప్టెన్ కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. అనుష్క ‘సూయీ దాగా’ చిత్ర పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు అనుష్క నటించిన హార్రర్ మూవీ ‘పరీ’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.