కోహ్లి.. మై లవ్‌.. నిన్ను మిస్సవుతున్నాను! | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 21 2018 1:15 PM

Anushka is missing Virat.. - Sakshi

విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ. ఒకప్పుడు ప్రేమికులు.. ఇప్పుడు భార్యాభర్తలు. అయినా వారి మధ్య అనుబంధం చెక్కుచెదరలేదు. రోజురోజుకు వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. అనుబంధం మరింత దృఢమవుతోంది. ఇదే విషయాన్ని తాజాగా కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టుతో  చాటుకున్నాడు. భార్య అనుష్కను  ఆలింగనం చేసుకొని గట్టిగా ముద్దుపెడుతున్న ఫొటోను పోస్టు చేశాడు. గాఢంగా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటున్న ప్రేమజంట కార్టూన్‌ ఫొటో ఎదుట.. విరుష్క జంట అదే పోజును రిపీట్‌ చేసినట్టు ఈ ఫొటో ఉంది.

ఈ ఫొటో ఇలా పెట్టగానే  అలా వైరల్‌గా మారిపోయింది. ఈ ఫొటోను ఏకంగా 28 లక్షలకుపైగా నెటిజన్లు లైక్‌ చేయడం గమనార్హం. ఈ జంట అన్యోన్య దాంపత్యాన్ని ప్రశంసిస్తూ 41వేలకుపైగా మంది కామెంట్‌ చేశారు. ఈ కామెంట్లలో అనుష్క శర్మ చేసిన కామెంట్‌ స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలించింది. ‘ఐ మిస్‌ యూ టూ మై లవ్‌’  (నేను కూడా నిన్ను మిస్‌ అవుతున్నాను) అంటూ అనుష్క ఈ పోస్టుకు కామెంట్‌ చేసింది.

దాదాపు నాలుగేళ్ల ప్రేమించుకున్న అనంతరం విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకున్నారు. ఇటు క్రికెట్‌లో కోహ్లి.. అటు సినిమా షూటింగ్‌లో అనుష్క బిజీగా ఉండటంతో ఈ కొత్తజంట ప్రస్తుతం వేరువేరుగానే గడుపుతోంది. టీమిండియా కెప్టెన్‌ కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. అనుష్క ‘సూయీ దాగా’  చిత్ర  పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు అనుష్క నటించిన హార్రర్ మూవీ ‘పరీ’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

 

My one and only! ♥️😇♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

Advertisement
Advertisement