సరిహద్దు వివాదం: ప్రధాని అఖిలపక్ష భేటీ | PM Calls All Party Meet On Friday To Discuss Situation After Ladakh Clash | Sakshi
Sakshi News home page

తాజా పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో వీడియో సమావేశం

Jun 17 2020 2:17 PM | Updated on Jun 17 2020 3:05 PM

PM Calls All Party Meet On Friday To Discuss Situation After Ladakh Clash - Sakshi

న్యూఢిల్లీ: ల‌డ‌క్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భార‌త్‌-చైనా ఆర్మీ మ‌ధ్య తలెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో కల్నల్‌ సహ 20 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్‌ 19) సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్‌ చేసింది. (సరిహద్దు ఘర్షణ : రాజ్‌నాథ్‌ మళ్లీ కీలక భేటీ)

తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన పోరాటంలో 45 మంది చైనా సైనికులు మరణించడం లేదా గాయపడి ఉండవచ్చని సమాచారం. ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement