– ఎమ్మెల్సీ అభ్యర్థి కేజే రెడ్డి తరఫున ప్రచారం
ఓర్వకల్లు : కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం టీడీపీ నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించడం ద్వారా ఆ పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుట్టపాడు మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ ఇంచార్జి ఏరాసు ప్రతాప్రెడ్డి, గ్రంథాలయ జిల్లా సంస్థ అధ్యక్షులు ధనారెడ్డి, పాణ్యం జడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు చెందిన టీడీపీ కన్వీనర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ మండలాల్లో తలెత్తిన తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై చర్చించారు. అనంతరం జెడ్పీ చైర్మన్, ఏరాసు ప్రతాప్రెడ్డి, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేజేరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.