ఏపీలో కొనసాగుతున్నమున్సిపల్ కార్మికుల సమ్మె | municipal workers strike continues in andhara pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొనసాగుతున్నమున్సిపల్ కార్మికుల సమ్మె

Jul 16 2015 9:53 PM | Updated on Oct 16 2018 6:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది.

విశాఖ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది. ఇప్పటివరకూ పారిశుద్ధ్య కార్మికులతో ప్రభుత్వం కనీసం చర్చలు జరపకపోవడంతో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడం.. ఏపీ సర్కారుపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. 

 

ఏపీలో మున్సిపల్ కార్మికులు తమ వేతనాలను పెంచాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement