-
బాబు చేసింది పెద్ద నేరమే!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సీఐడీ బలమైన ఆధారాలతో అంతకంటే బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముఖ్యంగా చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన ప్రజా సేవకుడు దురుద్దేశంతో ఆ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లేదా నకిలీ సంస్థలను సృష్టించి ప్రజా ధనాన్ని సొంతం చేసుకునేందుకు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా వినియోగించడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ నేరాలకు పాల్పడినట్లు సీఐడీ భావిస్తోంది. మొత్తం 11 ఐపీసీ సెక్షన్లు, రెండు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అరెస్టు చేసింది. తీవ్రమైన నేరాలు చేయడంతో పాటు నేరాలను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ చట్టాల కింద 7 నుంచి 25 ఏళ్ల కారాగార శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. బాబుపై నమోదైన కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ఐపీసీ సెక్షన్లు 120–బి: నేరపూరిత కుట్ర 166: ప్రభుత్వ సేవకుడు ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన వారు దురుద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడటం 167: పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా లేని/తప్పుడు సంస్థలను, పత్రాలను సృష్టించి మోసం చేయడం 418: ఎవరికైనా నష్టం వాటిల్లుతుందని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే మోసం చేయడం 420: మోసం చేయడం 465: ఫోర్జరీ చేయడం 468: మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం 471: ఫోర్జరీ పత్రాలను అసలైన పత్రాలుగా ఉపయోగించడం 409: నేరపూరిత విశ్వాస ఘాతుకం 201: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, లేదా నేరస్థుడు దొరక్కుండా తప్పుడు సమాచారం ఇవ్వడం 109: నేరాన్ని ప్రేరేపించడం, ఆ నేరం లేదా కుట్రలో భాగస్వామిగా ఉండటం పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ 12(బి)(1): అవినీతికి పాల్పడటం 13(1)(సి)(డి): పబ్లిక్ సర్వెంట్గా ఉండి అవినీతికి పాల్పడడం -
ఏ–1 చంద్రబాబు అరెస్ట్
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. మొత్తంగా 40 ఏళ్ల రాజకీయ జీవితం... కనుసన్నలతో రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసించగలరని సన్నిహితులు కీర్తించే నాయకుడు.. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. ఏలేరు కుంభకోణం మొదలు ఎన్నో అవినీతి ఆరోపణలు.. రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లకు ఆస్తులు పెరిగాయన్న విమర్శలు.. ఎన్నో కేసులు.. స్టేలు.. ఎన్నడూ కోర్టుమెట్లెక్కిందే లేదు.... అరదండాలు ఆయన అరచేతులను తాకలేదు... కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అది తన పని తాను చేసుకుపోతుంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క చిన్న గాలివానకే కూలిపోయినట్లు.. సప్త సముద్రాలను ఈదిన గజ ఈతగాడు చిన్న గుంతలో పడి ప్రాణాలొదిలినట్లు.. ఓ చిన్న స్కామ్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలతో పోలిస్తే ఇది సముద్రంలో ఇసుకరేణువంత... ఆయన ఆస్తులలో 0.0000001 శాతం కూడా లేనంత.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణమిది. అధికారులు వారిస్తున్నా కాదని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు షెల్ కంపెనీలకు తరలించారు. కమీషన్లు పోను తిరిగి రూ.241 కోట్లు చంద్రబాబుకు చేరాయి. స్పష్టమైన ఆధారాలు దొరకడంతో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మాజీ సీఎం కావడంతో పటిష్టమైన భద్రత మధ్య హెలికాఫ్టర్లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకురావాలని అధికారులు భావించినా రోడ్డుమార్గంలో.. అదీ తన కాన్వాయ్లో వస్తానని చంద్రబాబు పట్టుబట్టారు. అదేం విచిత్రమో.. వలయంలా నిలబడి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన ప్రజలు, నిరసనలతో దారిపొడవునా బోలెడంత ప్రచారానికి పనికివస్తారనుకున్న పార్టీ శ్రేణులు ముఖం చాటేయడం అరెస్టును మించిన షాక్కు బాబును గురిచేసింది. విజయవాడ చేరుకున్న అనంతరం సీఐడీ కార్యాలయంలో బాబును అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో నిందితులు ఏ–1 చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ, ఏపీఎస్ఎస్డీసీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్ కర్, టీడీపీ ప్రభుత్వంలో ఫైనాన్సియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్టెక్ ఎండీ వీరితోపాటు మొత్తం 40మందిని నిందితులుగా పేర్కొన్నారు. సాక్షి, అమరావతి /నంద్యాల/ నెట్వర్క్: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబు నాయుడును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతోసహా బట్టబయలైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని సిట్ నిర్ధారించింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ బయటపడిన కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జిషీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. కాగా, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్నది తాజాగా బయటపడటం గమనార్హం. దాంతో ఈ కేసులో లోకేశ్ను కూడా విచారించాలని సిట్నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబుతోసహా సిట్ ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లయింది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు విఫలయత్నం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన అవినీతి బండారం బయట పడటంతో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు యత్నించారు. ఈ కేసులో షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ యాదవ్లకు సిట్ నోటీసులు జారీ చేయడంతో బెంబేలెత్తిన ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారు. ఆయన బెదిరింపులతోనే పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్కి పరారయ్యారు. దాంతో సిట్ వెంటనే అప్రమత్తమైంది. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్షులు, ఇతరులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసి కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని గుర్తించారు. అప్పటికే ఆయన అవినీతి ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ సిట్ అధికారులు శుక్రవారం రాత్రి కార్యాచరణకు దిగారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు బయలుదేరింది. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అప్పటికే చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దాంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలు వద్ద మోహరించారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ తదితరులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్కు వెళ్లే రహదారిలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నుంచి అక్కడకు వెళ్లారు. సిట్ అధికారులు చంద్రబాబును కలవనివ్వకుండా టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్ధన్రెడ్డిలు సిట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు తట్టినా ఆయన బయటకు రాలేదు. మరోవైపు టీడీపీ నాయకులు ఎంతగా రెచ్చిపోతున్నా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ వారికి ఓపికగా సమాధానం ఇస్తూ.. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు వేచి చూశారు. 2.30 గంటలపాటు నచ్చజెప్పి.. చంద్రబాబు వద్దకు వెళ్లడానికి అడ్డుగా ఉంచిన వాహనాలను ఎంత సేపటికీ తొలగించకపోవడంతో పోలీసులు వాటికి తాడు కట్టి బుల్డొజర్ సాయంతో పక్కకు జరిపారు. ఆ విధంగా సిట్ అధికారులు శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి 5.30 గంటల వరకు టీడీపీ నేతలు, న్యాయవాదులతో మాట్లాడుతూ నచ్చజెప్పేందుకు యత్నించారు. పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య చర్చలు, వాగ్వాదం జరుగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు బస్సు నుంచి కిందకు దిగారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి తమకు సహకరించాలని పోలీసు అధికారులు ఆయన్ను కోరారు. ‘ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు.. అందులో నా పేరు ఉందా.. నా పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేయడానికి వచ్చారు?’ అని బాబు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ వేశామని, అందులో మీ పేరు ఉందని వారు తెలుపగా, కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వాలని బాబు పోలీసులను కోరారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ ఎలా అరెస్ట్ చేస్తారని న్యాయవాదులు, చంద్రబాబు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్ని వివరాలు అప్పుడే ఇస్తామని చెబుతూ పోలీసులు చంద్రబాబుతో సంతకం తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు వాహనానికి కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డం పడుకోవడానికి వెళ్లగా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు హెలికాఫ్టర్లో విజయవాడకు తీసుకెళ్తామని సిట్ అధికారులు చంద్రబాబుతో చెప్పారు. అందుకు ఆయన తిరస్కరించారు. తాను తన వాహనంలో రోడ్డు మార్గంలోనే వస్తానన్నారు. అందుకు సిట్ అధికారులు సమ్మతించి ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. మధ్యలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడక్కడ తప్ప ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడ లేదు. బాపట్ల జిల్లా జే.పంగలూరు మండలం ముప్పవరం గ్రామం సమీపంలో టీడీపీ నేతలు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి కాన్వాయిని ముందుకు పంపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు ముందస్తు ప్రణాళికతో కాన్వాయ్ను అడ్డుకున్నారు. పోలీసులను దుర్భాషలాడుతూ, తోసివేస్తూ దూసుకువచ్చారు. కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు టైర్లు కాల్చి, చేతిలో పెట్రోల్ బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. దాంతో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్ అరగంటకుపైగా నిలిచిపోయింది. టీడీపీ కార్యకర్తలు సాధారణ ప్రజలను కూడా దూషిస్తూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పెషల్ పార్టీ పోలీసులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వారి అంతు చూస్తామని హెచ్చరిస్తూ జెండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద అల్లరి మూకలను చెదరగొట్టి కాన్వాయ్ని ముందుకు పోనిచ్చారు. గుంటూరు శివారులోని లాల్పురం వై.జంక్షన్ టీడీపీ కార్యకర్తలు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సిట్ అధికారులు చంద్రబాబును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బాబుపై ప్రశ్నల వర్షం సిట్ విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించ లేదు. అధికారులు ఏ ప్రశ్నలు వేసినా సరే తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయాను.. అంటూ సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత చంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. రాత్రి 7 గంటల అనంతరం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొదలు పెట్టారు. చంద్రబాబు లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ఆయన న్యాయవాదులను లోపలికి అనుమతించారు. అనంతరం ఓ గదిలో చంద్రబాబును కూర్చోబెట్టి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ, ఇతర అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. సీమెన్స్ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విధానంపై సిట్ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఈ ప్రాజెక్ట్పై ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్వం తానై చంద్రబాబు వ్యవహరించారనడానికి ఆధారాలను ఆయన ముందు ఉంచి ఒక్కొక్కటిగా ప్రశ్నించారు. అసలు సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ కుదుర్చుకోవడం ఏమిటి? డిజైన్టెక్ కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారు? అసలు ప్రాజెక్ట్ వ్యయం రూ.3,300 కోట్లుగా ఎలా నిర్ధారించారు? ముఖ్య కార్యదర్శిని పక్కనబెట్టి మరీ ఏపీఎస్ఎస్డీసీ ఎండీ గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు ఎందుకు కట్టబెట్టారు? ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులు సమకూర్చకుండా ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.371 కోట్లు ఎందుకు విడుదల చేశారు? అందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు నోట్ఫైల్లో లిఖిత పూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేశారు? షెల్ కంపెనీల ద్వారా ఆయనకు చేరిన నిధుల విషయం ఏమిటి.. ఇలా పలు ప్రశ్నలను ఒక్కొక్కటిగా అడిగారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీ సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తుండగానే ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. తాము చంద్రబాబును కలవాలని అధికారులతో చెప్పారు. దాంతో చంద్రబాబు విచారణకు కాసేపు విరామం ఇచ్చి కుటుంబ సభ్యులను కలిసేందుకు అధికారులు అనుమతించారు. సిట్ కార్యాలయంలో ఓ గదిలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అరగంటకుపైగా మాట్లాడారు. అనంతరం సిట్ అధికారులు మరోసారి విచారణను కొనసాగించారు. ఈ విధంగా శనివారం అర్ధరాత్రి వరకు.. అంటే 6 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయన నిద్రించేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున న్యాయస్థానంలో హాజరు పరుస్తారని భావిస్తున్నారు. నడిరోడ్డుపై ప్రజాస్వామ్యం హత్య: చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడంపై నంద్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశానో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తప్పు చేసుంటే నిరూపించి కేసు పెట్టాలన్నారు. ఏదేమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ -
స్కిల్ స్కాం: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, కృష్ణా: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్. చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలన్న అధికారులు. చంద్రబాబు అరెస్ట్ నేపద్యంలో కీలకంగా మారిన రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న లాయర్లు. జడ్జి నివాసం వద్ద ఉద్రిక్తత. జడ్జి ఇంటి వద్ద హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించారు.. స్కిల్ స్కాంలో అవకతవకలపై సీఐడీ.. చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన కుట్రదారుడైన చంద్రబాబుని శనివారం వేకువ ఝామునే నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టులో ప్రవేశపెట్టనున్న తరుణంలో.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని విజయవాడ కోర్టు 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపున ఇప్పటికే ఆయన కేసులు చూస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని సమాచారం. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ(గన్నవరం) చేరుకున్నారు. ఏపీ సీఐడీ, సిట్ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన సూత్రధారి అయిన చంద్రబాబును తమ రిమాండ్కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
చంద్రబాబు అరెస్ట్.. విధ్వంసానికి టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. కాగా, నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చదవండి: ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్! -
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్!
ప్రతీ సందర్భాన్నీ తన రాజకీయ అవసరానికి వాడుకోవడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. చివరికి భారీ స్కామ్కు పాల్పడి అరెస్ట్ అయిన ప్రస్తుత సందర్భాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకోవడానికే చంద్రబాబు చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఏదో పైకి మొక్కుబడిగా మీడియా ముఖంగా చెప్పిన బాబు.. అందుకు భిన్నంగా వ్యవహరించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని సీఐడీ దర్యాప్తులో తేలిన తర్వాత అరెస్ట్ చేస్తే, అందులో సానుభూతిని సంపాదించుకోవడం చూస్తున్నాడు. నంద్యాలలో చంద్రబాబను అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ కోర్టుకు తరలించే క్రమంలో పెద్ద హైడ్రామే నడిచింది. చంద్రబాబు వయసు, హోదా దృష్ట్యా హెలికాప్టర్లో తరలిస్తామని చంద్రబాబుకు సీఐడీ సూచన చేయగా, హెలికాప్టర్లో తరలింపు వద్దని చంద్రబాబు నిరాకరించడమే కాకుండా తన కాన్వాయ్లోనే వస్తానంటూ పట్టుబట్టారు. దాంతో చేసేది లేక చంద్రబాబు కాన్వాయ్లోనే విజయవాడకు తరలించేందుకు అంగీకరించింది సీఐడీ. ఇక్కడ చంద్రబాబు ఉద్దేశం ఏమిటో క్లియర్గా అర్ధం అవుతోంది. ఎలాగోలా ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సానుభూతి పొందాలనే తపనే కనిపించింది బాబు గారిలో.. దానిలో భాగంగా తనను తీసుకెళ్లే కాన్వాయ్ను అడ్డుకోవాలంటూ టీడీపీ శ్రేణులకు, పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా దాని ద్వారా వచ్చిన మైలేజ్ పొందాలని ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఆకాశ మార్గం గుండా కాకుండా రోడ్డు మార్గంలోనే వెళదామని పట్టుబట్టడానికి ప్రధాన కారణం. ఇలా తనను రోడ్డు మార్గంలో తీసుకెళ్లే సమయంలో ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు బాబుగారు. అదే సమయంలో తమకు తెలియకుండా రూటు మార్చుతున్నారంటూ ఎల్లో మీడియా వార్తలు ఇవ్వసాగింది. ఒకవేళ చంద్రబాబును విజయవాడకు తీసుకెళ్లే క్రమంలో రూట్ మార్చాలంటే ఎల్లో మీడియా పర్మిషన్ అవసరమా? అనే ప్రశ్న తలెత్తక మానదు. చంద్రబాబును ఎలా తీసుకెళ్లాలన్నది పోలీసులకు తెలియదా?, ఎక్కడకు తీసుకెళుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఉన్నప్పుడు.. ఎలా తీసుకెళుతున్నారు అనే విషయం అనవసరం. ఇటువంటి హైప్రొఫైల్ కేసులో అరెస్ట్లు జరిగినప్పుడు ఎలా తీసుకెళుతున్నారనే రూట్ మ్యాప్ అనేది తెలియకపోవడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎంత పకడ్బందీగా చంద్రబాబును అధికారులు తరలించే యత్నం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు పలుమార్లు కాన్వాయ్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం. దాంతో ఏ ఇతర వాహనాన్ని చంద్రబాబు కాన్వాయ్కు సమీపంగా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మరొకవైపు కాన్వాయ్లో 108 ఉన్నా.. అంబులెన్స్ లేదంటూ తప్పుడు వార్తలు ఇచ్చింది ఎల్లో మీడియా. అరెస్ట్ చేసి తీసుకెళుతుంటే ఎన్ని వాహనాలు ఉండాలో కూడా ఎల్లో మీడియా చెప్పేస్తుంది. అసలు ఎన్ని వాహనాలు ఉండాలు అన్నది పోలీసులు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కానీ ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులో చెప్పినట్లు నడవదు. -
చంద్రబాబే ప్రధాన సూత్రధారి: ఏపీ సీఐడీ
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ ప్రకటించింది. శనివారం చంద్రబాబు నాయుడు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను సీఐడీ అదనపు డీజీ సంజయ్ మీడియాకు తెలిపారు. ఇవాళ ఉదయం ఆరుగంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆయన ప్రధాన నిందితుడు. ఈ స్కామ్లో ప్రధాన కుట్రదారుడు.. ఫైనల్ బెనిఫిషీయరీ కూడా చంద్రబాబే. దర్యాప్తులోనూ ప్రధాన నిందితుడు చంద్రబాబే అని తేలింది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం. ఈ స్కాంలో మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది. ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో.. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. అందుకే.. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాం. ► ఈ స్కామ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు మాయం చేశారు. ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా ఈ స్కామ్పై దర్యాప్తు చేశాయి. ► 2014లో ఏపీ ఉన్నత విద్యామండలి.. సీమెన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఎంవోయూ తర్వాత.. అదే ఏడాది జులైలో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యింది. గంటా సుబ్బారావు సీఈవోగా వ్యవహరించారు. ఉద్దేశపూర్వకంగానే గంటా సుబ్బారావుకి సీఈవోతో పాటు ఎండీ, ఉన్నత విద్యా మండలి సలహాదారుగా, సీఎం సలహాదారుగా పదవులు కట్టబెట్టారు. ► ఈ ఒప్పందానికి డిజైన్ టెక్ ప్రదాన సూత్రధారి. డిజైన్ టెక్ కి సంబంధించిన భాస్కర్ భార్య అపర్ణ యూపీ క్యాడర్ స్కిల్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా వచ్చారు. ► సీమెన్స్ నుంచి 90 శాతం నిధులు విడుదల కాకపోయినా.. రూ. 371 కోట్లను ఏపీ ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. ఆర్ధిక శాఖ, సీఎస్ అభ్యంతరాలని సైతం పట్టించుకోలేదు ► రూ. 58 కోట్ల సాఫ్ట్ వేర్ ని.. మూడు వేలకోట్ల ప్రాజెక్ట్ గా చూపించారు నారా లోకేష్ పాత్రపైనా విచారణ.. ప్రభుత్వ ధనం ఎవరిరెవరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లాయో సిఐడి దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ పాత్రపైనా సీఐడీ విచారణ జరుపుతోంది. అలాగే.. కిలారు రాజేష్ పాత్రపై కూడా సీఐడీ విచారణ చేస్తోంది. వీటితో పాటు ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలలో కూడా లోకేష్ పాత్రపై లోతైన దర్యాప్తు సాగుతుంది ► కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన డిజైన్ టెక్ కి చెందిన మనోజ్ విదేశాలకి పారిపోయాడు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికా పారిపోయాడు. విదేశాల్లో ఉన్న నిందితులను తీసుకొచ్చేందుకు ఇంటర్పోల్ సాయం కోరతాం. విదేశాల్లో తలదాచుకున్న ఈ నిందితులది ఈ స్కామ్లో కీలక పాత్రగా గుర్తించాం. ► ప్రభుత్వ ధనాన్ని పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి. విచారణలో అదే వెల్లడైంది. అందుకే నంద్యాలలో అరెస్ట్ చేశాం. హెలికాఫ్టర్లో ప్రయాణానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. అందుకే ఆయన సొంత వాహనంలోనే విజయవాడ రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్నాం. విజయవాడ చేరుకున్నాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరు పరుస్తాం. మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ అవసరం అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. -
చంద్రబాబు అరెస్ట్.. వాట్ నెక్స్ట్
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆపై విజయవాడకు తరలించే యత్నం చేసింది. తన కాన్వాయ్లోనే వస్తానని చెప్పడంతో ఏపీ అధికారులు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు వెంట కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. తొలుత విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తారని సమాచారం. ఆపై సీఐడీ పోలీసులు, మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడ్ని హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయం పది గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వ్యవహరించనున్నారు. ఇక నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పెద్ద డ్రామానే నడిచింది. తొలుత సీఐడీ అధికారులతో చంద్రబాబు, ఆయన లాయర్లు వాదనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి అడ్డుకునే యత్నం చేశారు. అయితే అధికారుల వివరణతో చివరకు అరెస్టుకు అంగీకరించారాయన. ఆపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించివేసి.. చంద్రబాబును విజయవాడకు తరలించారు. -
చంద్రబాబు వాదనలు.. సీఐడీ సమాధానంతో చప్పుడు చేయకుండా..
సాక్షి, నంద్యాల: దాదాపు ఆరు గంటల హైడ్రామా తర్వాత.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏ1గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ సమయంలో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన లాయర్లు సీఐడీ అధికారులతో వాదనలకు దిగారు. ఈ తరుణంలో రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో.. చంద్రబాబు చప్పుడు చేయకుండా అరెస్ట్ కావడానికి అంగీకరించారు. ‘‘ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏదో జరిగిందని కేసు పెట్టారు. మీకూ, నాకు రాజ్యాంగం ఆధారం. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. స్కిల్స్ స్కామ్లో నా పేరు ఎక్కడుందో చూపించండి. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఆధారాలు ఉంటే ఉరి తీయండి. దర్యాప్తు అధికారి రాకుండా సూపర్ వైజర్ అధికారి రావడం ఏంటి?. మీరు చుట్టుముట్టి నన్ను బెదిరిస్తున్నారా?’’ అని చంద్రబాబు సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. ‘‘విజయవాడ వెళ్లలోపు రిమాండ్ రిపోర్ట్ అందిస్తాం. ముందే రిమాండ్ ఇవ్వడం కుదరదు. రిమాండ్ రిపోర్ట్లోనే అన్ని విషయాలు ఉన్నాయి’’ అని ఏపీ సీఐడీ అధికారులు చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. సంబంధం లేని సెక్షన్స్ నమోదు చేశారు. అరెస్ట్కు ముందే కేసు వివరాలు చెప్పాలంటూ చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడంతో.. ‘‘చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామ’’ని సీఐడీ పోలీసులు సమాధానం ఇచ్చారు. దర్యాప్తు అధికారి రాకుండా మీరెందుకు వచ్చారు. నేను టెర్రరిస్టునా?. అన్న అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏంటి?. ప్రాథమిక ఆధారాల్లేకుండా న్ను ఎలా అరెస్ట్ చేస్తారు. మా పార్టీ వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. నన్ను ఎందుకు రిమాండ్ చేస్తున్నారో చెప్పి.. అరెస్ట్ చేసుకోండి. నా హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు అని బాబు మరోసారి వాగ్వాదానికి దిగారు. ఆ తరుణంలో.. ‘‘మాకు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల వరకు టైం ఉంటుంది. గడువులోగా కోర్టుకు అన్ని డాక్యుమెంట్లు ఇస్తాం. చంద్రబాబును ప్రశ్నించిన తర్వాతే పూర్తి రిమాండ్ రిపోర్ట్ ఇస్తాం’’ అని చంద్రబాబు తరపు న్యాయవాదులకు బదులిచ్చారు. ‘‘అరెస్టుకు ముందు ప్రాథమిక సాక్ష్యాలు అడుగుతున్నారు. అలా చూపించాలని చట్టంలో లేదు’’ అని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. నోటీసులు ఇలా.. స్కిల్ డెవలప్మెంట్లో.. చంద్రబాబు మీద నాన్బెయిలబుల్ వారెంట్ కింద కేసు నమోదు అయ్యింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం. ఐపీసీ సెక్షన్ 120(B), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109.. r/w 34, 37 ఐపీసీతో పాటు 12, 13(2) r/w 13(1)(c)&(d) అవినీతి నిరోధక శాఖ చట్టం 1988 సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. అరెస్ట్కు సంబంధించిన పేపర్లను చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు సీఐడీ పోలీసులు. గంట సేపు వాదించిన చంద్రబాబు, ఆయన తరపు లాయర్లు.. చివరకు సీఐడీ అధికారుల వివరణతో సంతకం చేసి అరెస్ట్కు ముందుకు వచ్చారు. హాల్ వద్ద హైడ్రామా నోటీసులతో ఏపీ సీఐడీ అధికారులు బస చేసిన జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పించే NSG అడ్డుకుంది. ఆ తర్వాత ప్రాంతంలో సీఐడీ అధికారులు లోపలికి వెళ్లారు. గంట సేపుల వాదోపవాదనల తర్వాత.. రిమాండ్ రిపోర్ట్లో అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పడంతో చంద్రబాబు అరెస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. -
చంద్రబాబు అరెస్టు
నంద్యాల: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును కలువ నీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టిడిపి నాయకులు వాగ్వాదానికి దిగారు . తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలవండి అంటూ అధికారులతో టిడిపి నాయకులు వాధించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబునుకలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు పోలీసులు. చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు! చంద్రబాబుపై అభియోగాలు.. 👉ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి 👉షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం 👉 కేబినెట్ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు. 👉స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కాం ఇది. 👉ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది. 👉దోచేసిన సొమ్మును విదేశాలకు అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చింది. 👉చంద్రబాబుగారు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు ఊపిరి. 👉ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. 👉తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్గా చూపిస్తూ స్కిల్డెవల్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి. 👉ఈ పద్ధతిలో కేబినెట్కు నోట్ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధలనకు, రూల్స్కు పూర్తిగా విరుద్ధం. 👉ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. 👉జీవోలో ఉన్నది... ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు?. 👉సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది. 👉డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. 👉ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. 👉సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. 👉అన్నికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది 👉మన అధికారులేకాదు… సీమెన్స్ సంస్థకూడా ఇంటర్నల్ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 👉ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. 👉తమ కంపెనీలో పనిచేసే సుమన్బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్నుగాని, లీగల్టీమ్కాని సంప్రదించలేదని సీమెన్స్ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. 👉ఈ డబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది, 👉వాస్తవంగా ఈ స్కిల్డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కనపెట్టేశారు. 👉ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ఫైల్స్ను మాయంచేసేశారు. 👉స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ/స్కిల్లర్, డిజైన్టెక్ … 👉ఈరెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్వాట్కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి... ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందనలేదు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్ భార్య -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
టీడీపీ నేతల కనుసన్నల్లోనే విధ్వంసం.. యువగళం వలంటీర్లు అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర! -
ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్
ఒంగోలు టౌన్: ఒంగోలులోని శ్రీకృష్ణనగర్లో బ్యూటీషియన్పై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఒంగోలు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు భార్య కరణం మోహన దీప్తి ఉరఫ్ దీప్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గర్గ్ కేసు వివరాలను వెల్లడించారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్లోని తన ఇంటిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలుసుకుని ఆ విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత ఉరఫ్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే అనేక చోరీలు చేసి ఉన్న ఈ కిలాడీ ముఠా బ్యూటీ పార్లర్ మీద కన్నేశారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్కు వచ్చారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకున్నారు. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా అదను చూసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న మత్తు కలిగించే ద్రావణాన్ని స్ప్రే చేశారు. తేలికపాటి యాసిడ్ లాంటి ద్రావణాన్ని ఆమె మీద చల్లారు. క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత వాళ్లు చేతికి అందిన కాడికి దోచుకొని పోయారు. రజియా మెడలోని బంగారు నగలు, ఇంట్లో కప్బోర్డులో దాచిన నగలు, రూ.40 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ కేసు వివరాలను తెలుసుకున్న ఎస్పీ మలికా గర్గ్ వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. సీఐ భక్తవత్సలరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చదవండి: అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణం మోహన దీప్తితో పాటుగా బజాజ్ ఫైనాన్స్లో ఉద్యోగం చేసే ముండ్ర వెంకటరావు భార్య లక్ష్మి నవత, శ్రీనివాసరావు భార్య అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
విజయవాడ స్పోర్ట్స్: దివ్యాంగ బాలిక(13)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మరణించే వరకు (జీ వి త ఖైదు) జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ సీవీఆర్ ఫ్లై ఓవర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో తన అక్క కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ బాలికను ఈ ఏడాది జనవరి 17వ తేదీన తా ను పని చేసే కంపెనీ వద్దకు ఆమె తీసుకువెళ్లింది. ఆమె పని చేస్తుండగా, కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించలేదు. కంపెనీ సెక్యూరిటీ సహాయంతో చుట్టుపక్కల వెదుకుతుండగా, సమీపంలోనే ఓ షాపు వెనుక ముళ్లపొదల వద్ద ఆ బాలికపై ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడుతుండటంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పారిపోయాడు. బాలిక సైగల ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడి నది డ్రైవర్ రమేష్ అని గుర్తించి ఆమె కొత్తపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా పాములపాడుకు చెందిన రమేష్ విజయవాడ వన్టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో నివాసం ఉంటూ బొలెరో వాహనం డ్రైవర్గా పని చేస్తున్నట్లు పోలీ సు విచారణలో తేలింది. దిశా ఏసీపీ వీవీ నాయు డు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించారు. దిశా, సీఎంఎస్ అధికారుల సమక్షంలో 25 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. బాధితు రాలి తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు రమేష్ కు మరణించే వరకు జైలు శిక్షతోపాటు రూ.30 వేలను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమా నా రూ.30వేలు, మరో రూ. 50వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయ మూర్తి ఆదేశించారు. ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించేలా ట్రయిల్ నిర్వహించిన పోలీసులను సీపీ టీకే రాణా అభినందించారు. -
బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే
సాక్షి, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదులుతోంది! ముడుపుల చిట్టాలన్నీ చంద్రబాబు బంగ్లాకే దారి తీస్తున్నాయి!! అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారంలో ఆదాయపన్ను (ఐటీ) శాఖ తీగ లాగితే... చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం పునాది బయటపడుతోంది. కుంభకోణాలు వేర్వేరైనా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో పాత్రధారులు మాత్రం వారే. ఆ అక్రమార్జన అంతా చివరకు చేరింది సూత్రధారి చంద్రబాబు చెంతకే అన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో భవన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను కట్టబెట్టడంలో అక్రమార్జనకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఏస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ అవినీతి బాగోతంలోనూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. ఇప్పటికే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ప్రగతి సాధించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజా పరిణామాలతో తక్షణం రంగంలోకి దిగింది. ముడుపుల తరలింపులో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. బాబు అవినీతి ‘స్కిల్’... టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం జరిగినట్లు ‘సిట్’ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. అలా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా రూ.371 కోట్లను సీమెన్స్ భాగస్వామ కంపెనీగా ఒప్పందంలో చూపించిన డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేశారు. అందులో రూ.241 కోట్లను పలు షెల్ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత కొల్లగొట్టారు. ఈ కేసులో సిట్ అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. హవాలా మార్గంలో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినందున కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్కు పాల్పడ్డారని నిర్ధారించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడంతోపాటు డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను అటాచ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. షెల్ కంపెనీలు.. బోగస్ ఇన్వాయిస్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల కాంట్రాక్టులను కట్టబెట్టిన కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నవారే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. ఈ ముగ్గురూ అమరావతి భవన నిర్మాణాల కాంట్రాక్టు అవినీతి సొమ్మును చంద్రబాబుకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. అందుకోసం షెల్ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. మరోవైపు ఆ షెల్ కంపెనీల పేరుతో మళ్లించిన నిధులను డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నగదు రూపంలో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో అందించారు. ఆ విధంగా చంద్రబాబుకు చేరిన అక్రమార్జనలో రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ముడుపులు చేరాయిలా... అమరావతిలో తాత్కాలిక నిర్మాణ కాంట్రాక్టుల అవినీతి దందాలో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ఇదీ.. ► ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు యోగేశ్ గుప్తా పలు షెల్ కంపెనీలను సృష్టించాడు. ముంబై, పుణే కేంద్రాలుగా సృష్టించిన షెల్ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్లను సమర్పించారు. ఆ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు ఏపీఎస్ఎస్డీసీ రూ.371 కోట్లను విడుదల చేసింది. దీనిపై ఆధారాలు సేకరించిన అనంతరం సిట్ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కేసులో యోగేశ్ గుప్తాను ఏ–22గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ► నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు చేరిన రూ.371 కోట్లను యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ పార్థసానికి అందించాడు. ఆయన అందులో రూ.241 కోట్లను ముంబై నుంచి హైదరాబాద్కు తరలించాడు. రూ.241 కోట్ల నగదు మొత్తాన్ని హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించాడు. ► ఆ రూ.241 కోట్ల నగదు మొత్తం పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చివరకు హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఆ ముగ్గురికీ సిట్ నోటీసులు ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టడంతో పాత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్లకు సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసానికి నోటీసులిచ్చారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. -
కస్టమర్లుగా వచ్చి బ్యూటీపార్లర్లో చోరీ
ఒంగోలు టౌన్: ఫేస్వాష్ చేయించుకుంటామని వచ్చిన ముగ్గరు మహిళలు అదునుచూసి బ్యూటీపార్లర్ నిర్వాహకురాలిపై దాడి చేసి అందినకాడికి దోచుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని శ్రీకృష్ణనగర్లో షేక్ రజియా అనే మహిళ ఇంటి వద్దే బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు మహిళలు వచ్చి ఫేస్వాష్, ఐబ్రోస్ చేయించుకుంటామని చెప్పారు. దీంతో వారిని ఇంట్లోకి తీసుకెళ్లిన రజియా.. ఐ బ్రోస్ చేస్తుండగా ముగ్గురికీ పెడిక్యూర్ చేయాలని కోరారు. ఈ లోగా ఒక మహిళ బాత్రూమ్కువెళ్లిఆలస్యంగా వచ్చింది. మిగిలిన వారు నమ్మకంగా మాట్లాడుతూ ఐ బ్రోస్ చేయించుకున్నారు. తరువాత ఒక మహిళకు పెడిక్యూర్ చేస్తుండగా రజియాపై ఒక్కసారిగా దాడికి దిగారు. దాడిలో రజియా మెడకు, కుడి చేతికి గాయాలయ్యాయి. అనంతరం మత్తు మందు చల్లడంతో రజియా స్పృహ కోల్పోయింది. కాసేపటికి తేరుకున్న రజియా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మెడలోని బంగారు నగలతో పాటుగా ఇంట్లోని కప్బోర్డులో దాచి ఉంచిన నగలు, రూ.40 వేల నగదు కూడా దోచుకొనిపోయినట్లు గుర్తించి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.అంకమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్రీవిద్య అనుమానాస్పద మృతి
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే సర్వం అని ఆ యువతి అతని వెంట నడచింది. వివాహం జరిగి ఆరు నెలలు కూడా తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కన్నవాళ్లు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల దళితవాడకు చెందిన నరసింహులు, ఉషారాణి దంపతుల కుమార్తె శ్రీవిద్య (22) మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. నీరుగంటివారిపల్లిలో కాపురం ఉండే మల్లీశ్వరి, మారపరెడ్డి దంపతుల కుమారుడు విజయ్ కుమార్రెడ్డి (23)తో కాలేజీ రోజుల్లోనే ప్రేమ మొదలైంది. యువకుని కుటుంబీకులు అడ్డుచెప్పినా ఇద్దరూ ఈ ఏడాది మార్చి నెలలో మదనపల్లిలోని ఓ ఆలయంలో దండలు మార్చుకుని అనంతరం అక్కడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి నమోదు చేసుకున్నారు. బెంగళూరులో కాపురం తరువాత బెంగళూరులోని మునిరెడ్డిపాళ్యలో కాపురం పెట్టారు. యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండగా యువకుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం ఏం జరిగిందో ఏమో శ్రీవిద్య ఇంట్లోనే మంచంపై శవమై తేలింది. విజయ్కుమార్రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రులు మృతదేహాన్ని సోమవారం మల్లెలదళితవాడకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనేది అక్కడి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
భీమవరంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల దాడిలో పలువురికి గాయాలు
సాక్షి, భీమవరం: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పచ్చ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. లోకేశ్ భీమవరం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. భీమవరంలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్ పాదయాత్రలో పచ్చమూకలు రెచ్చిపోయి మరోసారి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడి శారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులకు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు చెదరగొట్టారు. ఎల్లో గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు చేయడం గమనార్హం. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత, రౌడీషీటర్ రెహమాన్ అరెస్ట్ అయ్యాడు. అయితే, ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో బెదిరింపులకు పాల్పడిన రెహమాన్తో పాటు మరో రౌడీ షీటర్ రాజాను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. టీడీపీ నేత రెహమాన్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, గతంలోనే రెహమాన్, రాజాపై పోలీసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇక, పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో రెహమాన్ కీలకంగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో రెహమాన్కు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు.. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా రెహమాన్ యాక్టివ్గా పనిచేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పుంగనూరులో ఎల్లో బ్యాచ్ రౌడీమూకలు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్కు తరలించారు. ఇది కూడా చదవండి: జనసేన నేతపై చీటింగ్ కేసు -
కడప జైలుకు పుంగనూరు నిందితులు
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్కు తరలించారు. కాగా, ఆగస్ట్ 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అప్పటికే పన్నిన పక్కా కుట్రతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కిరాయి మూకలు రాళ్లు, కట్టెలతో దాడి చేసి సుమారు 47 మంది పోలీసులను గాయపరిచారు. రెండు పోలీస్ వాహనాలను తగలబెట్టారు. రణధీర్ అనే కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోయాడు. ఈ విధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకు 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు సహా నిందితులంతా పారిపోగా.. పోలీసులు ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో... టీడీపీ నేత చల్లా బాబును అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చల్లా బాబు తన సెల్ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ తీసుకున్నాడు. సిమ్కార్డులు మార్చేస్తూ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగినట్లు తెలిసింది. ఎన్నిసార్లు మకాం మార్చేసినా పోలీసులు సమీపిస్తుండటంతో చల్లా బాబుతో పాటు టీడీపీ మూకల్లో ఆందోళన తలెత్తింది. చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా.. ఈ నేపథ్యంలో తనపై నమోదైన 7 కేసుల్లో బెయిల్ కోరుతూ చల్లా బాబు హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మూడు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. ఇక తిరగలేక, తప్పించుకోలేక చల్లా బాబు సహా 67 మంది నిందితులు సోమవారం పుంగనూరు పోలీస్స్టేషన్లో డీఎస్పీ సుధాకర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారికి మద్దతుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, దొరబాబు, సుగుణమ్మ తదితరులు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు పోలీస్స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. కాగా, ఆదివారం రాత్రి పుంగనూరుకు చెందిన సద్దామ్ హుస్సేన్, ఇమ్రాన్, ఫయాజ్, షామీర్, నూరుల్లాను రిమాండ్కు పంపించారు. పూచీకత్తు సమర్పించిన దేవినేని ఉమా మదనపల్లె: అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో బెయిల్ పొందిన టీడీపీ నేత దేవినేని ఉమా సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో రూ.2 లక్షల బాండ్, ఇద్దరు జామీనుదారులను పూచీకత్తుగా సమర్పించారు. -
ఉత్తరాంధ్రలో మరో భారీ మోసం.. విదేశీ ఉద్యోగాల పేరుతో..
విశాఖపట్నం: స్వీడన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమృత్ ఎంటర్ప్రైజెస్ నిరుద్యోగులకు టోకరా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కడప తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు సోమవారం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దొండపర్తిలోని టీఎస్ఎన్ కాలనీలో అమృత్ ఎంటర్ప్రైజస్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది నమ్మి కార్యాలయానికి ఫోన్ చేసిన వారికి అర్హత గల ఉద్యోగాలు ఇప్పిస్తామని.. అందుకు డబ్బు లు చెల్లించాలని మేనేజర్లు శాంతి, లలిత నమ్మించారు. అలాగే నీరజ్, సౌరభ్ తెరవెనుక ఉండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, కడప, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున రూ.కోటి వరకు ఆన్లైన్లో వసూలు చేశారు. డబ్బులు చెల్లించినట్లు మేనేజర్లు నిరుద్యోగులకు రసీదులతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది దొండపర్తిలోని అమృత్ ఎంటర్ప్రైజెస్కు వెళ్లారు. కార్యాలయం మూసివేసి ఉండడంతో.. సంస్థ బోర్డు తిప్పేసినట్లు గ్రహించి ఆందోళనకు గురయ్యారు. దీనిపై బాధితులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పుంగునూరులో పోలీసులపై దాడి కేసు: లొంగిపోయిన ఏ-1 నిందితుడు
చిత్తూరు జిల్లా: పుంగునూరులో పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు సోమవారం పోలీసులకు లొంగిపోయాడు. పుంగునూరులో పోలీసులపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న చల్లాబాబు నెలరోజుల తర్వాత లొంగిపోయాడు. ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకూ ఈ దాడి ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రీడ్విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రీడ్విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రీడ్విత్149 కింద సోమల పీఎస్లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రీడ్విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రీడ్విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు చదవండి: పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర ‘నారా’జకీయం: తండ్రి పుంగనూరులో.. కొడుకు తుక్కులూరులో.. -
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా ముఖానికి చున్ని అడ్డువచ్చి .. -
ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
కొవ్వూరు: దొమ్మేరు గ్రామ శివారున రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. వివరాలివీ.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న పల్లె వెలుగు బస్సును.. కొవ్వూరు నుంచి ఏలూరు వెళ్తు మరో పల్లె వెలుగు బస్సు ఢీకొంది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు బస్సుల ముందు భాగాలూ దెబ్బ తిన్నాయి. ప్రమాదానికి గురైన రెండు బస్సులూ కొవ్వూరు డిపోకు చెందినవే. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన 18 మందికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేవీ సాగర్ (కొవ్వూరు), వి.మంగయమ్మ, ఎం.శేషారెడ్డి (ఏలూరు), రాజయ్య (దేవరపల్లి మండలం యాదవోలు), సీహెచ్ రామకృష్ణ (బంగారమ్మపేట), తుపాకుల దుర్గారావు (చింతూరు) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ ముందు వెళ్తున్న మోటార్ సైక్లిస్టు బస్సు ముందు చక్రంలో పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయన మోటార్ సైకిల్ నుజ్జునుజ్జయ్యింది. హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జీఆర్కే గంగాధర్ ఆధ్వర్యాన క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నగళ్లపాటి శ్రీనివాస్, వరిగేటి సుధాకర్ సహకరించారు. సూపరింటెండెంట్ సాయికిరణ్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ క్షతగాత్రులతో మాట్లాడి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి వనిత ఈ ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ, పోలీసులు అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ లేకపోయినప్పటికీ 26 మంది గాయపడటం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.