-
ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ..
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ సోమవారం పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు వివరాలు ఆరాతీశారు. నిత్యం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారులను, సిబ్బందిని నియమించామన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా దానిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అదనపు ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులు తరచూ సందర్శించాలని ఆదేశాలిచ్చామన్నారు. పోలీస్ సిబ్బంది వృద్ధులు, బాలింతలు, మహిళలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడ్పడ్డారన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్ప ఇంకెవరూ ఉండకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ● జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. సోమవారం ఆయన నెల్లూరులోని డీకేడబ్ల్యూ, వీఆర్ లా, పీజీ కాలేజీ, స్టోన్హౌస్పేటలోని ఆర్ఎస్సార్ మున్సిపల్ హైస్కూల్, ముత్తుకూరు సర్కిల్ వద్ద హైస్కూల్, కొండాయపాళెం హైస్కూల్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. వివాదాలు జరగకుండా చూడాలని, క్యూలైన్లలోనే ఓటర్లను పంపాలన్నారు.్శ భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేశారని వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ ఖాయం
● పార్టీపై జిల్లా ప్రజల ఆదరణ మరువలేనిది ● జిల్లాలో రౌడీయిజాన్ని అణగదొక్కుతాం ● పార్టీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు లోక్సభ, దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినగర్లోని తన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు తదితరులతో కలిసి విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. అధిక పోలింగ్ శాతం నమోదవ్వడం ప్రభుత్వానికి వ్యతిరేకమంటూ కొందరు మాట్లాడుతున్నారని, అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రాష్ట్రంలోని 87 శాతానికిపైగా కుటుంబాలు సంక్షేమ పథకాలను అందుకున్నాయని, వీరందరూ తమ పార్టీకే ఓటేశారని తెలిపారు. డబ్బుతోనే రాజకీయాలు చేసేందుకు టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి యత్నించారని ఆరోపించారు. లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లో డబ్బులను ఆయన భారీగా పంచారని విమర్శించారు. జిల్లాలోని అన్ని సీట్లను తామే గెలవబోతున్నామని.. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణపై ఖలీల్ అహ్మద్ గెలవబోతున్నారని చెప్పారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బులను పంచిందని, అయితే తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేశారని కొనియాడారు. ఓటింగ్ శాతం పెరగడం సంతోషం జిల్లాలో ఓటింగ్ భారీగా నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించాలనే ఉద్దేశంతో తమ పార్టీని ప్రజలు గెలిపిస్తున్నారని తెలిపారు. జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి, రూప్కుమార్యాదవ్ రౌడీయిజాన్ని సహించబోమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. అనంతరం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. విజయసాయిరెడ్డి వచ్చాక జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
ఏ సమయానికి ఎంత పోలింగ్ శాతం అంటే..
నెల్లూరులోని సెయింట్ జోసఫ్స్ స్కూల్లో.. సాక్షి ప్రతినిధి నెల్లూరు: సార్వత్రిక సమరంలో సింహపురి ఓటెత్తింది. జిల్లాలో 75 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల్లోపు క్యూల్లో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశాన్ని కల్పించారు. కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అక్కడక్కడా స్వల్ప చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఉదయం ఆరు గంటలకే క్యూల్లో ఓటర్లు బారులుదీరారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా తరలివచ్చారు. ఏ క్యూలో చూసినా మహిళలే అధికంగా కనిపించడం విశేషం. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటేసేందుకు కదిలారు. మరోసారి ఫ్యాన్ జోరే.. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సరళిని పరిశీలిస్తే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అంతర్గత సర్వేల్లోనూ ఇదే అంశం స్పష్టమైందనే విషయం తెలుస్తోంది. ప్రధానంగా పల్లెల్లో పోలింగ్ శాతం పెరగడంతో పాటు మహిళలు, వృద్ధులు బారులుదీరి ఓటేయడం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. మరోసారి సంక్షేమానికే మహిళామణులు జై కొట్టారని ఎగ్జిట్ పోల్స్ చెప్తుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఖుషీఖుషీగా ఉన్నారు. దాడులకు తెగబడిన పచ్చ పార్టీ ● కోవూరు నియోజకవర్గంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేక అల్లర్లు సృష్టించేందుకు యత్నించారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలన నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెంలోని అమ్మవారితోపు పోలింగ్ బూత్ వద్దకు వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓటర్ల దాహార్తిని తీర్చేందుకు గానూ తన వాహనంలో ఉన్న వాటర్ బాటిళ్లను ఇవ్వడాన్ని నేరంగా భావించిన టీడీపీ మూకలు రెచ్చిపోయి ఆయనపై దాడికి యత్నించాయి. పోలీసులు సకాలంలో చేరుకొని వీరిని చెదరగొట్టారు. ● ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో టీడీపీ నేత మెట్టుకూరు చిరంజీవిరెడ్డి తన అనుచరులను వెంటేసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్లడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టారు. దీంతో ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. ● అల్లూరులో పచ్చ పార్టీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ నేతకు చెందిన వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పుబెట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ● కావలి నియోజకవర్గంలోని ముసునూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కదల్లేని స్థితిలోనూ ఓటేసేందుకు.. -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యకాండ
అల్లూరు: మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. మండలంలోని బీరంగుంటలో బీభత్సం సృష్టించారు. బాధితుడు బీరంగుంట ఉప సర్పంచ్ గుమ్మడి సాయిచరణ్ కథనం మేరకు.. సోమవారం ఉదయం ఆ ఊరిలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తుండగా సాయిచరణ్ వారించాడు. దీంతో అతడిని తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేశారు. ఒంటరిగా వెళ్తుండగా దాడి చేయడంతో సాయిచరణ్ అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం సమయంలో అతను తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడుగా రావాలని అల్లూరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులను పిలిచాడు. వారు వచ్చాక పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్తున్న తరుణంలో తిరిగి టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేసి హరీష్ అనే యువకుడిపై రాడ్తో దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడగా నేతలు వెంటనే అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే.. ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. హరీష్ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు కావలి ముసునూరులో, అల్లూరు రామకృష్ణా కాలేజీ వద్ద, బీరంగుంట గ్రామంలో దాడులకు పాల్పడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ప్లాన్ ప్రకారం కావలి ముసునూరులో మహేష్, కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డిపై, బీరంగుంట గ్రామంలో గుమ్మడి సాయిచరణ్, హరీష్ దాడులు చేశారన్నారు. కావ్య కృష్ణారెడ్డి ఎలాంటి దుర్మార్గుడో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అతనికి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నెమాల సుకుమార్రెడ్డి, నాయకులున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ మూక దాడి కారు అద్దాలు ధ్వంసం ఒకరికి తీవ్రగాయం వైఎస్సార్సీపీ ఏజెంట్పై దాడి సీతారామపురం: మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద సోమవారం వైఎస్సార్సీపీ ఏజెంట్ పాణెం సుధీర్ కుమార్పై అదే గ్రామానికి బ్రహ్మయ్య, సుధీర్ దాడి చేసి గాయపరిచారు. పోలింగ్ సమయంలో టీడీపీకి ఓటేయాలని ఆ పార్టీ కార్యకర్తలు మహిళలకు చెబుతున్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. దీంతో సుధీర్ కుమా ర్ గాయపడగా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయసాయిరెడ్డిపై దాడికి యత్నం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. రేబాల గ్రామ పంచాయతీ పరిధిలోని అమ్మవారితోపు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఆయన బయటకు వచ్చే సమయంలో క్యూలైన్లో ఉన్న కొందరు మహిళలు దాహం వేస్తోందని, తాగునీరు కావాలని కోరగా విజయసాయిరెడ్డి తన కారులో ఉన్న వాటర్ బాటిళ్లను వారికి అందజేశారు. ఇదే సమయంలో అక్కడున్న టీడీపీ నాయకుడు శివరామకృష్ణారెడ్డి వాటర్ బాటిళ్లు ఎందుకు ఇస్తున్నావు?, వారితో ఎందుకు మాట్లాడుతున్నావని విజయసాయిరెడ్డితో దురుసుగా ప్రవర్తించాడు. తాను వారితో మాట్లాడలేదని, తాగునీరు అడిగితే అందించానని చెబుతున్నా వినకుండా మీదకు వెళ్లి నెట్టేసి దాడికి యత్నించాడు. విజయసాయిరెడ్డి ఆ సమయంలో ఎంతో సంయమనంతో వ్యవహరించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై దాడులకు తెగబడుతున్నారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. బుర్రాను అడ్డుకుని.. ఉలవపాడు: వైఎస్సార్సీపీ కందుకూరు అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్పై టెంకాయచెట్లపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బుర్రా సోమవారం కరేడు పంచాయతీ టెంకాయచెట్లపాళెం గ్రామంలోని బూత్ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు బంధువులు సుధాకర్, నాయుడు తమ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. బుర్రా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన్ను నెట్టేశారు. పడబోతున్న సమయంలో గన్మెన్లు పట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సాయంతో బుర్రా బూత్ను పరిశీలించి బయటకు వచ్చారు. తదనంతరం పెదపట్టపుపాళెం, చాకిచర్ల, ఉలవపాడులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కాగా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని రాజుపాళెంలో మానసిక వికలాంగుడిని ఓటుకు తీసుకెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకులతో గొడవకు దిగారు. -
ఉదయం నుంచే పోటెత్తి..
ఓట్లు వేసేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలు కట్టారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ అనంతరం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వృద్ధులు, మహిళలు తొలి గంటలోనే ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున విచ్చేశారు. వృద్ధులు, దివ్యాంగులు కేంద్రాల్లోకి వెళ్లేందుకు పోలీస్ సిబ్బంది చేయూతనిచ్చారు. కొందరు కేవలం ఓటర్ స్లిప్స్ తీసుకురాగా ఓటర్ లేదా ఏదైనా గుర్తింపుకార్డు తీసుకు రావాలని సిబ్బంది చెప్పడంతో వెనక్కి వెళ్లారు. – సాక్షి నెట్వర్క్ -
ప్రగతి సాధకుడికే మా ఓటు
● గత ఐదేళ్లలో జిల్లాలో ఇదీ పరిస్థితి ● సోమశిల – కండలేరు వరద కాలువ ఆధునికీకరణ ● సంగం, నెల్లూరు బ్యారేజీల పూర్తి ● తుది దశకు రామాయపట్నం పోర్టు ●నెల్లూరులో ఫ్లయ్ఓవర్ ఏర్పాటు ● కోవిడ్ సంక్షోభంలోనూ.. అందరికీ సంక్షేమం ● పేదలకు చేరువైన విద్య, వైద్యం ● నాడు – నేడుతో స్కూళ్లు బాగు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఘడియలు రానే వచ్చాయి. జిల్లా అంతటా మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతోంది. పండగ వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చైన్నె లాంటి నగరాలకు వలస వెళ్లిన వారు జగనన్నకు ఓటువేసేందుకు సొంత గ్రామాలకు ఉత్సాహంగా చేరుకున్నారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, పారిశ్రామిక ప్రగతి.. ఎన్నో పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ ఓట్లు వేసి గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అంతంతమాత్రంగా అందిన సంక్షేమ పథకాలు.. పడకేసిన ప్రాజెక్టులు.. నిధుల దోపిడీయే లక్ష్యంగా చేపట్టిన తూతూమంత్రపు పనులతో ప్రజల అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో 2019లో వైఎస్సార్సీపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా దశ, దిశ మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులు సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తిచేశారు. సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులను వెచ్చించి పూర్తి చేయడంతో అన్నదాతల మో ముల్లో ఆనందం చిగురించింది. మ హిళా భ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాల లబ్ధిని వారి ఖా తాల్లో జమచేయడంతో ఆర్థిక స్వావలంబన చే కూరింది. ఈ క్రమంలో సోమవారం జరగనున్న ఎ న్నికల్లో సంక్షేమ సారథికి ఓటేస్తే అభివృద్ధిలో జిల్లా మరింత పరుగులు తీస్తుందనే భావన అందరిలో వ్యక్తమవుతోంది. జిల్లా అభివృద్ధికి అడుగులు జిల్లా అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్మోహన్రెడ్డి అడుగులేశారు. జిల్లాలోని రైతన్నల సంక్షేమం కోసం పలు ప్రాజెక్టులకు దివంగత సీఎం వైఎస్సార్ రూపకల్పన చేశారు. అయితే ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు వీటిని విస్మరించారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి వీటిని జిల్లాకు సీఎం అంకితం చేశారు. భారీగా ఏర్పాటైన పరిశ్రమలు.. ఉపాధి అవకాశాలు.. అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లా వాసుల మన్ననలను సీఎం చూరగొన్నారు. సాగునీటికి ఢోకా లేదు ● సోమశిల జలాలను 58 గ్రామాలకు అందించాలనే లక్ష్యంతో ఆనం సంజీవరెడ్డి సోమశిల లింక్ కెనాల్కు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో రూ.840.90 కోట్లకు గానూ ఇప్పటికే రూ.604.50 కోట్లను వెచ్చించారు. 62.38 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ● సోమశిల – కండలేరు వరద కాలువ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం రూ.960 కోట్లను మంజూరు చేసింది. సోమశిల నుంచి కండలేరు రిజర్వాయర్ వరకు పెన్నా వరద నీటిని తరలించేందుకు నిర్దేశించిన ఈ కాలువ ఆధునికీకరణ ద్వారా రోజుకు రెండు టీఎంసీలను తరలించొచ్చు. 45 కిలోమీటర్ల పొడవు కలిగిన కాలువకు పను 30 శాతం మేర పూర్తయ్యాయి. ● వరదల కారణంగా సోమశిల జలాశయం వద్ద దెబ్బతిన్న ఆప్రాన్ ప్రాంత అభివృద్ధికి రూ.117 కోట్లను మంజూరు చేశారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. సోమశిల క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల సామర్థ్యాన్ని గతంలో కంటే పెంచినా జలాశయ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. ● మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా ఉత్తర కాలువ ఆధునికీకరణ కోసం రూ.960 కోట్లను కేటాయించారు. సుమారు 101 కిలోమీటర్ల పొడవు గల ఉత్తర కాలువ నీటి సామర్థ్యాన్ని 350 నుంచి 700 క్యూసెక్కులకు పెంచేలా కాలువను ఆధునికీకరిస్తున్నారు. పనులు పూర్తయితే 1.1 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరగనుంది. ఫిషింగ్ హార్బర్తో హ్యాపీ ● మత్స్యకారుల సంక్షేమం కోసం బోగోలు మండలం జువ్వలదిన్నెలో సుమారు రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. దీని ద్వారా ఏటా అదనంగా 41 వేల టన్నుల మత్స్య సంపద లభించడంతో పాటు పరిశ్రమల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం మత్స్యకారులకు ఏర్పడింది. ● కృష్ణపట్నం పోర్టు సమీపంలో నేలటూరు – పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్లతో మినీ ఫిషింగ్ హార్బర్ను నిర్మించనున్నారు. పోర్టు రయ్..రయ్ బ్యారేజీలు అంకితం నెల్లూరు బ్యారేజీ ద్వారా సర్వేపల్లి, జాఫర్సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో గల 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు నీరు సమృద్ధిగా అందుతుంది. 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా సాగు, తాగునీరందుతుంది. ఈ బ్యారేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. సంగం బ్యారేజీ ద్వారా 3.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ మరణానంతరం ఈ పనులను పట్టించుకున్న నాథుడే లేరు. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టును ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వం చేర్చి రూ.131.12 కోట్లను వెచ్చించి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు,. రిటైనింగ్ వాల్స్కు భారీగా నిధులు నగరంలోని 0.6 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్ల వరకు వెళ్లే సర్వేపల్లి కాలువకు రక్షణ గోడల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.99.95 కోట్లను మంజూరు చేసింది. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. నగరంలోని జాఫర్సాహెబ్ రక్షణ గోడల నిర్మాణ పనుల కోసం రూ.39.87 కోట్లను మంజూరు చేశారు. పెన్నా ఒడ్డున వరద ఉధృతి నుంచి రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.94.59 కోట్లను మంజూరు చేశారు. 850 ఎకరాల్లో రూ.3743 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు. ఇందులో నాలుగు బెర్తులు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి.. పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది. పోర్టు ఆధారిత, ఇతర పరిశ్రమల స్థాపనకు 3700 ఎకరాలను కేటాయించారు. తద్వారా 50 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గృహాలతో ఖుషీఖుషీ నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు పథకం ద్వారా జిల్లాలో 58 వేల గృహాలు మంజూరయ్యాయి. జిల్లాలోని 282 లేఅవుట్లలో గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను వెచ్చించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ నెల్లూరులోని రామలింగాపురం కూడలి వద్ద ట్రాఫిక్ సమస్యలు తరచూ ఉత్పన్నమయ్యేవి. ఈ తరుణంలో 810 మీటర్ల పొడవున ఫ్లయ్ఓవర్ నిర్మాణానికి సంకల్పించారు. రూ.41.88 కోట్లతో దీన్ని పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలను తొలగించారు. నిరంతర విద్యుత్ వెలుగులు జిల్లాలోని నేలటూరులో దామోదరం సంజీవయ్య 1600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా 800 మెగావాట్లతో మూడో యూనిట్ను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. -
వెబ్కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలన
నెల్లూరు(బారకాసు): జిల్లాలో సోమవారం నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియను కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీ – విజిల్, 1950 కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అన్ని బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్లు నిరంతరం నిఘా ఉంచి తనిఖీలు చేపట్టాలన్నారు. సోషల్.. ఎలక్ట్రానిక్ మీడియాను పరిశీలించాలని, రాజకీయ ప్రకటనలు ప్రసారం కాకుండా చూడాలని ఆదేశించారు. -
ఐదేళ్లలో ప్రగతి పరుగు
● రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు ● సంక్షేమ పథకాల ద్వారా మరో రూ.1450 కోట్లు ● రూ.760 కోట్లతో జాతీయ రహదారులు ● ఉపాధి అవకాశాలు పెరగడంతో తగ్గిన వలసలు దశాబ్దాలుగా వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం దశను ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసింది. అరవై ఏళ్లుగా సాధ్యం కానీ ఎన్నో పనులను, ఎంతో అభివృద్ధిని ఐదేళ్లలో సాకారం చేసింది. జాతీయ రహదారుల నిర్మాణం, ఉదయగిరి ట్యాంక్బండ్ నిర్మాణం, అగ్రిల్యాబ్, వ్యవసాయ గోదాములు, సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు భవనాలు ఇలా అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే సుమారు రూ.1000 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయి. మరో రూ.1,450 కోట్ల మేర సంక్షేమ పథకాలు అందాయి. -
ప్రజాతీర్పునకు వేళాయె..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి సర్వం సిద్ధమైంది. నెలన్నర క్రితం ఎన్నికల రణరంగం ప్రారంభం కాగా, కురుక్షేత్రాన్ని తలపించే రీతిలో ప్రధాన పార్టీలు ప్రచారాలు.. వ్యూహ.. ప్రతివ్యూహాలతో ముందుకుసాగాయి. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్సభ స్థానం ఉంది. ఇందులో సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి లోక్సభ పరిధిలోకి వస్తుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే తాము ఎవరికి ఓటేయాలనుకుంటున్నామో ప్రజలు డిసైడయ్యారు. ప్రజా ప్రభుత్వంవైపే మొగ్గు.. విశ్వసనీయత.. మోసం మధ్య ఈ ఎన్నికల పోరు జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన టీడీపీని తాము విశ్వసించేదిలేదని.. ప్రజా ప్రభుత్వమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే తమ ఓటని ప్రజలు పేర్కొంటున్నారు. విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేసి.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగనన్నే మరోసారి ముఖ్యమంత్రి కావాలనే భావన బలంగా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల రోజు రానే వచ్చింది. ఎండల తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలతో హోరెత్తించారు. తమ పార్టీల మేనిఫెస్టోలు.. లక్ష్యాలను వివరిస్తూ ఓటర్లను కలుసుకొని తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో సోమవారం నిక్షిప్తం చేయనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ నేడు ఏర్పాట్లు పూర్తి కేంద్రాలకు తరలిన సిబ్బంది -
No Headline
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల వద్ద ఈవీఎంలు, వీవీ ప్యాట్స్, ఎన్నికల సామగ్రిని అధికారులు ఆదివారం పొందారు. అనంతరం వారికి కేటాయించిన ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని, వెంకటాచలంలోని క్యూబా ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు సర్వం సిద్ధం -
ప్రగతిధామం.. సంక్షేమ జపం
● కందుకూరులో అభివృద్ధి కొత్త పుంతలు పట్టణంలో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనం ● సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, రాళ్లవాగుపై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు ● ఆహ్లాదకరంగా పార్కుల అభివృద్ధి ● రూ. 26 కోట్ల ప్రత్యేక నిధులు, మరో రూ. 28 కోట్ల జనరల్ ఫండ్, ఆర్థిక సంఘం నిధుల ఖర్చు ● నియోజకవర్గంలో 5.71.538 మందికి సంక్షేమ పథకాలు ● సంక్షేమానికి డీబీటీ కింద రూ.1,106.64 కోట్లు ● నాన్ డీబీటీ ద్వారా 307.09 కోట్ల లబ్ధి కందుకూరు: అభివృద్ధిలో కందుకూరు ఆదర్శ మున్సిపాలిటీగా నిలుస్తోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటయ్యా యి. పట్టణంలోని ప్రతి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. ఆహ్లాదం పంచుతూ పార్కులు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో పట్టణానికి కొత్త సొబగులు అద్దెందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీటితో మున్సిపల్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు వంటివి ఏర్పాటయ్యాయి. 2022 జూలై 20 రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.26 కోట్ల ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పట్టణంలో 174 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్ల విలువ చేసే 61 పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. ప్రధాన రోడ్లు అయిన కోవూరు, పామూరు రోడ్డు ప్రాంతాల్లో భారీ డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించారు. వీటి నిర్మాణంతో వరద, మురికి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగే పరిస్థితి ఏర్పడింది. పైగా ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ రావడంతో ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జనార్దనకాలనీ, ఉప్పుచెరువు, సాయినగర్, నాంచారమ్మ, కొస్టాలు, కోటారెడ్డినగర్, గుర్రంవారిపాళెం తదితర కాలనీల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి ఏర్పాటు చేశారు. జరల్ఫండ్, ఆర్థిక సంఘం నిధులతో.. మున్సిపాలిటీ జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు రూ.25.83 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో రూ.10.13 కోట్లతో రోడ్లు, రూ.6.26 కోట్లతో డ్రైనేజీలు, రూ.4.80 కోట్లతో తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించారు. మరో రూ.3 కోట్లతో క్లబ్ రోడ్డు నుంచి ఆదియేంద్ర కాలనీ వరకు భారీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. మరో రూ. 2 కోట్లతో రాళ్లపాడుపై చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు దాదాపు 70 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్న కందుకూరులో వినోదానికి అధికారులు పెద్దపీట వేస్తున్నారు. రూ. 40 లక్షలతో ముత్యాలకుంట వద్ద ఉన్న చిల్డ్రన్స్ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దలు, పిల్లలు కలిసి సరదాగా కాసేపు సేద తీరేందుకు, పిల్లలు ఆటలు ఆడేందుకు ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా మారింది. దివి లింగయ్యనాయుడు పార్కు అభివృద్ధి చేశారు. పట్టణంలోని మరికొన్ని పార్కుల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ. 25 కోట్లతో అమృత్ పథకం పనులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ. 25.7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏరియాల వారీగా రోజుకు ఒక గంట చొప్పున నీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటు ఉన్న 7 ఎంఎల్డీ (మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే) సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్ మాత్రమే ఉండడం నిరంతరం సరఫరా చేయడం కుదరడం లేదు. దీంతో కొత్తగా అమృత్ పథకం కింద మరో 5 ఎంఎల్డీ ప్లాంట్ను నిర్మించి 24 గంటలు నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కుంటల అభివృద్ధి చేపట్టనున్నారు. పట్టణ వైద్యానికి దన్ను అర్బన్ హెల్త్ సెంటర్లు పట్టణంలోని శివారు ప్రాంతాల్లో నివశించే పేదలకు సకాలంలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి రెండు అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. మొత్తం రూ. 1.77 కోట్ల ఖర్చుతో వీటిని నిర్మాణం చేశారు. వీటిలో ఒకటి కోటారెడ్డి నగర్లో, మరొకటి జనార్దన కాలనీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పట్టణ పేదలకు ప్రభుత్వ వైద్యసేవలు మరింత దగ్గర అవుతున్నాయి. ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా దాదాపు రూ. 7 కోట్లతో అధునాతన భవనాలను నిర్మించారు. ఇలా పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంక్షేమానికి పెద్ద పీట రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాజకీయ పార్టీలు, కుల,మత, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా చేసిన సంక్షేమంతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనోపాదులు మెరుగపడ్డాయి. తద్వారా కొనుగోలు శక్తి పెరగడంతో వ్యాపారాభివృద్ధి సైతం మెరుగు పడింది. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,28,913 మంది ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 5.71.538 మందికి డీబీటీ, నాన్డీబీటి కింద సంక్షేమ పథకాల ద్వారా 1,413.75 కోట్ల మేర అందించింది. ఉదయగిరి: నియోజకవర్గంలోని ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఈ మెట్ట ప్రాంతానికి గండిపాళెం రిజర్వాయరు ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. రాళ్లపాడు, మోపాడు, నక్కలగండి రిజర్వాయర్ల ద్వారా కూడా కొంత సాగునీరు అందుతుంది. ఎక్కువగా వరి, పొగాకు, మినుము, జామాయిల్, నిమ్మ, బత్తాయి, మామిడి తోటలు కూడా అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలో యాభై వేలమంది వరకు రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతన్న సంక్షేమానికి: ఉదయగిరిలో రూ.1.5 కోట్ల వ్యయంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చారు. రూ.19.62 కోట్లతో 95 రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ప్రజల చెంతకు పాలన : ఎనిమిది మండలాల పరిధిలో 143 గ్రామ పంచాయతీలు 400 పైగా గ్రామాలు ఉన్నాయి. గతంలో పల్లె వాసులు చిన్న పనికి సైతం వ్యయ ప్రయాసలకు ఓర్చి మండల కేంద్రాలకు వెళ్లాలి. అయితే ఈ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన జనం చెంతకు వచ్చింది. రూ.36.60 కోట్లు వ్యయంతో 95 సచివాలయాలు నిర్మించి అన్నీ సేవలు ఇక్కడ నుంచే అందిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ : గతంలో మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పల్లె వాసులకు వైద్య సేవలు గగనంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చారు. 79 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను రూ.13.83 కోట్లు ఖర్చు చేసి నిర్మించి గ్రామస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు ఇంటి వద్దకే వైద్యలు అందిస్తున్నారు. రూ.760 కోట్లతో జాతీయ రహదారులు : ఉదయగిరి నియోజకవర్గ దశాబ్దాల కల జాతీయ రహదారులు. అరవై ఏళ్ల నుంచి ఎదురు చూపులకు చరమగీతం పాడుతూ వైఎస్సార్పీపీ ప్రభుత్వ పాలనలో రూ.760 కోట్లతో కావలి–సీతారామపురం, సింగరాయకొండ–సీతారామపురం రెండు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. తద్వారా బీడు భూముల ధరలకు రెక్కలోచ్చాయి. అతి త్వరలో పూర్తయ్యే ఈ జాతీయ రహదారులు ద్వారా రాష్ట్రంలో ఎక్కడకై నా అతి వేగంగా చేరుకునే అవకాశం కలిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ’గ్రీన్ ఫీల్డ్’ ఎక్స్ప్రెస్ హైవే సీతారామపురం మీదుగా వెళ్తొంది. రూ.53.40 కోట్లు ఖర్చు చేసి పలు గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. నెరవేరిన సొంతింటి కల: నియోజకవర్గంలోని 194 లేఅవుట్లు ఏర్పాటు చేసి 6400 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో చాలా వరకు పనులు పూర్తికాక, మరికొన్ని చోట్ల పనులు చకచకగా సాగుతున్నాయి. లేఅవుట్ల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మాణం చేపట్టారు. స్థలంతో కలిపి ఒక్కొక్కరికి సగటున రూ.8 లక్షలు మేర లబ్ధి చేరుకూరుతోంది. అంటే రూ.480 కోట్లు అస్తి అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. నాడు–నేడుతో మారిన పాఠశాలల రూపు రేఖలు : నాడు–నేడు ద్వారా శిథిలవస్థకు చేరుకున్న పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఫేజ్–1, ఫేజ్–2 ద్వారా రూ.125.04 కోట్లు ఖర్చు చేసి సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులు చక్కగా చదువుకునే వాతావరణం కల్పించారు. పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభించి భవనాలు కట్టించారు. ఉదయగిరి ట్యాంక్బండ్ : నియోజకవర్గ ముఖ చిత్రం మార్చే ఉదయగిరి ట్యాంక్ బండ్ పనులు రూ.9 కోట్ల వ్యయంతో సాగుతున్నాయి. ఇది పూర్తయితే పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు అందుబాటులోకి వస్తోంది.నగరానికి కొత్త రూపు పట్టణం రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రోడ్లకు కొత్త రూపు తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో రూ. 2 కోట్ల ఖర్చుతో ఓవీ రోడ్డులోని క్లబ్ రోడ్డు నుంచి ఎస్బీఐ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్ ఎదురు పామూరు రోడ్డు జంక్షన్ను సుందరంగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇవి పూర్తయితే పట్టణానికి కొత్త అందాలు వచ్చి చేరుతాయని అధికారులు భావిస్తున్నారు. -
సమర్థంగా ఏర్పాటు్ల
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. విధులకు కేటాయించిన సిబ్బంది ఇప్పటికే సంబంధిత కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 5.30కు ఈవీఎం పనితీరుపై పరిశీలన.. మాక్ పోలింగ్ జరగనుంది. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దిన అనంతరం పోలింగ్ ప్రక్రియను జరపాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన అనంతరం ఈవీఎంలకు సీల్ వేసేంత వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసి నేరుగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చాల్సి ఉంది. నెల్లూరు లోక్సభతో పాటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్రూమ్ను నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు.. పురుషులు 10,08,792 జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,62,439పోలింగ్ కేంద్రాలు 2470పోలింగ్ సిబ్బంది : 20 వేల మంది -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి
● ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నెల్లూరు(క్రైమ్): నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటాచలం, నెల్లూరు పరిధిలోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారదర్శకత, నిష్పక్షపాతమే ఆయుధాలని.. వీటితోనే ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని కోరారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులు నిర్వర్తించే మొబైల్ పార్టీలు, క్యూఆర్టీ ఫోర్సుల్లోని అధికారుల ఫోన్ నంబర్లను సిబ్బంది తమ వద్ద ఉంచుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు కేంద్ర బలగాలను కేటాయించామని తెలిపారు. -
● కృష్ణపట్నం వద్ద రూ.5,783 కోట్లతో శరవేగంగా క్రిస్సిటీ
రామాయపట్నంపోర్టులో జరుగుతున్న పనులు● క్రిబ్కో సంస్థ రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ ● ప్రారంభానికి సిద్ధంగా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ● వీటి అనుబంధంగా పెద్ద ఎత్తున రానున్న పరిశ్రమలు ● రాబోయే రోజుల్లో జిల్లాలో 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు ● పరోక్షంగా మరో 1.8 లక్షల మంది ఉపాధి అవకాశాలు ● మేకపాటి గౌతమ్రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు బీజం సువిశాల సాగర తీరం వెంబడి నిర్మితమైన, నిర్మితం కానున్న పోర్టులు, హార్బర్లు, వీటి అనుబంధంగా పారిశ్రామిక హబ్లతో సింహపురి.. పారిశ్రామికపురిగా అవతరించనుంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ ఉండడంతో విప్లవాత్మక ప్రగతి పుంజుకుంటోంది. జిల్లా సముద్ర తీరంలో అపారమైన మత్స్య సంపద, అన్నింటికి మించి భూ సంపద, మానవశక్తి వెరసి ఆయా రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్న జిల్లా సింహపురి. ఇప్పటికే ఎన్నో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలకు అక్షయ పాత్ర లాంటింది అనడంలో సందేహం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో వీటని సద్వినియోగించుకుంటే జిల్లా పారిశ్రామికంగా స్వర్గధామంగా మారుతుందనడం నిస్సందేహం. తద్వారా జిల్లాలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. సీ, ఎయిర్ పోర్టులతో పాటు పారిశ్రామికోత్పత్తులు, వ్యవసాయాధారిత ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా అనుహ్యంగా పెరిగే అవకాశం ఉంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అందుబాటులో భూ, మానవ వనరులు, రోడ్డు, రైలు కనెక్టివిటీతో కొత్త, పాత పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అనుబంధంగా పారిశ్రామింగా అభివృద్ధికి స్వర్గధామంగా ఉంది. ఇప్పటికే ఆసియాలో అతిపెద్ద కృష్ణపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హర్బర్, కృష్ణపట్నంలో జెట్టి ఏర్పాటు జరుగుతున్నాయి. వీటి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు దగదర్తి సమీపంలో విమానాశ్రయం ఏర్పా టు జరగనుంది. అన్ని అర్హతలున్న సింహపురిలో పరిశ్రమల స్థాపనకు మరెంతో మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురానున్నారు. దేశ, విదేశాల్లోని పారిశ్రామిక దిగ్గజాలు సైతం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. నలుదిశల పారిశ్రామిక పరుగులు రాష్ట్ర ప్రభుత్వం సింహపురి ఉన్నతికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహాభాగం కల్పిస్తోంది. విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూనే జిల్లా నలుదిశల పారిశ్రామికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కృష్ణపట్నం అనుబంధంగా పరిశ్రమలు ఊపందుకున్నాయి. కృష్ణపట్నం పోర్టు అనుబంధంగా క్రిస్ సిటీ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణ అనుమతులు దక్కాయి. పొదలకూరు మండలంలో రెండేళ్ల క్రితం వ్యవసాయ పనిముట్లు, యంత్రాల తయారీ కోసం కిసాన్ క్రాప్ట్ పరిశ్రమను రూ.100 కోట్లతో స్థాపించారు. వెంకటాచలం మండలం సర్వేపల్లిలో రూ.610 కోట్లతో క్రిప్కో బయోఇథనాల్ ప్లాంట్, రూ.315 కోట్లతో విశ్వసముద్ర బయోఇథనాల్ ప్లాంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో రూ.100 కోట్లతో ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. మెట్ట ప్రాంతం ఉదయగిరిలో దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గ పరిధిలో సొంతగా ఆయన పరిశ్రమలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మరికొన్ని పరిశ్రమలు స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ‘ఉదయ్’ పోర్టల్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. మరో వైపు కావలికి అటూ ఇటూ రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు అనుబంధంగా సుమారు 6 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్ సిద్ధం కానుంది. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. మౌలిక వసతుల కల్పనకు నిధులు సైతం ప్రభుత్వం కేటాయించింది. ఇలా నలుదిశలా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. నిర్దిష్టమైన పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న 2 లక్షల మంది మత్స్యకారుల ఉత్పత్తులను ప్రోత్సహించనుంది. ప్రతి ఏటా 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 46 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. రెట్టింపు స్థాయి ఎగుమతి చేసుకునే అవకాశాలను అందిపుచ్చుకునే చర్యలను చేపట్టుతోంది. ఆక్వా ఉత్పత్తులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మెట్ట ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగానికి ప్రయోజనకారిగా మారింది. విద్యార్థులకు యూనివర్సిటీ అందుబాటులోకి రావడమే కాకుండా పరిశోధనలు ద్వారా అధునాతన వంగడాలు మెట్ట ప్రాంతం ఉన్నతికి యోగ్యకరంగా మారనుంది. రూ.100 కోట్లతో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేటాయిస్తూ నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వద్ద నూతన ఆస్పత్రి నిర్మాణానికి 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా విద్యా, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దృశ్యాలుజువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్యువతకు ఉద్యోగాల వెల్లువ జిల్లాలో యువతకు ఉద్యోగాలు వెల్లవ కానున్నాయి. చైన్నె–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు కానుంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవెలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్లు పూర్తయి అందుబాటులోకి వస్తే 2.96 లక్షల మందికి ప్రత్యక్షంగా, 1.71 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. తొలి దశలో రూ.1,500 కోట్లుతో 2,006 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు పూర్తయ్యాయి. -
కళ్లెదుటే విషాదం
కావలి: రైలు ఢీకొని తల్లీకొడుకు మృతిచెందిన ఘటన కావలి రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం చాగణంకు చెందిన ఐసీడీఎస్ ఉద్యోగిని బట్టా సుభాషిణికి (55) అధికారులు కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో ఆమె తన కుమారుడు విజయ్ (28)ను తోడు తీసుకుని రైల్లో గూడూరు నుంచి కావలి రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎగువమార్గంలో పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో దురంతో ఎక్స్ప్రెస్ వస్తోంది. చివరి క్షణంలో రైలును గమనించిన విజయ్ తల్లిని కాపాడేందుకు ముందుకు రావడంతో ఇద్దరూ ప్రమాదం బారిన పడ్డారు. దురంతో ఎక్స్ప్రెస్ వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎన్నికల విధులకు హాజరైన పలువురు ఉద్యోగులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు అనాలోచితంగా దూర ప్రాంతానికి చెందిన మహిళకు విధులు కేటాయించారని మండిపడ్డారు. రైల్వే పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.● రైలు ఢీకొని తల్లీకొడుకు దుర్మరణం ● కావలిలో ఘటన -
పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు
సైదాపురం: పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సైదాపురం మండలంలోని 49 కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారు. నియోజకవర్గ కేంద్రమైన వెంకటగిరి నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది ఈవీఎంలతో ఆయా ఆదివారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మండలానికి సుమారు 150 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లోని కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను నియమించామని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తీసుకుని వెళ్లేందుకు ఆరు రూట్ అధికారులను నియమించారు. మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తహసీల్దార్ ప్రవీణ్కుమార్ తెలిపారు. రాపూరులో.. రాపూరు: మండలంలో సోమవారం పోలింగ్ సర్వం సిద్ధంచేసినట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆదివారం సాయంత్రానికి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలో 40,230 మంది ఓటర్లున్నారు. 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ వెంకటరత్నం తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. -
No Headline
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 157 లేయర్ (లైవ్) : 105 బ్రాయిలర్ చికెన్ : 274 బ్రాయిలర్ స్కిన్లెస్ : 304 లేయర్ చికెన్ : 178ట్రాక్టర్ తిరగబడి యువకుడి మృతిగుడ్లూరు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి ఓ యువకుడు మృతిచెందాడు. మండలంలోని పూరేటిపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పూరేటిపల్లి గ్రామ పొలాల్లో నూతనంగా విద్యుత్ స్తంభాలు వేసే పనులను వెస్ట్ బెంగాల్కు చెందిన కూలీలు చేస్తున్నారు. ఎహసాన్ (22) అనే యువకుడు దూరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసుకొని రావడానికి ట్రాక్టర్పై వెళ్తుండగా అదుపుతప్పి తిరగబడింది. దీంతో అతను పొలంలో ఉన్న రాయిపై పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు 108 అంబులెన్స్లో ఎహసాన్ కందుకూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేలోగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.నిఘా నీడలో వెంకటగిరివెంకటగిరి(సైదాపురం): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. ఆయన ఆదివారం పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి రూరల్, వెంకటగిరి టౌన్లో 400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలైన వెంకటగిరిలోని రాణిపేట, పాతకోట, రూరల్ గ్రామాల్లో అమ్మపాళెంలోని మూడు పోలింగ్ కేంద్రాలు, బాలాయపల్లిలో బాలాయపల్లి, జయంపు, సంగవరం, డక్కిలి మండలంలో దేవునివెల్లంపల్లి, పాతనాలపాడు, దగ్గవోలులో పారా మిలటరీ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్దా 144 సెక్షన్ విధించామన్నారు. ఆయన వెంట వెంకటగిరి సీఐ సంగమేశ్వరరావు, పోలీసు సిబ్బంది తదితరులున్నారు. -
బూటకపు హామీలను జనం నమ్మడం లేదు
● కల్పనా ఫౌండేషన్ చైర్పర్సన్ కల్పనారెడ్డి నెల్లూరు(దర్గామిట్ట): ‘మేం చాలామందితో మాట్లాడాం. సంక్షేమ పథకాల అమలు గురించి ఆరాతీశాం. మేనిఫెస్టోలపై అభిప్రాయాలను తెలుసుకున్నాం. ఎక్కడా కూడా బూటకపు హామీలను నమ్మడం లేదని అర్థమైంది’ అని కల్పానా ఫౌండేషన్ చైర్పర్సన్ టి.కల్పనారెడ్డి తెలిపారు. ఆమె తన బృందంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. మధ్య తరగతి ప్రజలు, పేదలతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో వచ్చిన మార్పులపై ఆరా తీశారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆ విషయాలను వెల్లడించారు. ప్రశ్న : ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జవాబు : ఎన్నికల నేపథ్యంలో మా బృందంతో జిల్లా వ్యాప్తంగా పర్యటించాను. అన్ని వర్గాలతో మాట్లాడాను. సంక్షేమ పథకాలు సజావుగా అందితే చాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. బూటకపు హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రశ్న : విద్యావ్యవస్థ గురించి ఏమనుకుంటున్నారు? జవాబు : ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో అభిృవృద్ధి చెందాయని జనం చెబుతున్నారు. అందుకే తమ పిల్లలను చేర్చామని, సకల వసతుల నడుమ చదువుతున్నారని ఆనందంగా చెప్పారు. ప్రతి చోటా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా నమోదైంది. దీనికి ప్రభుత్వ భరోసా కారణంగా తెలిసింది. ప్రశ్న : వైద్యం విషయంలో జనం వ్యూ ఏంటి? జవాబు : వైద్యం విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించిందని అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. ప్రభుత్వం ధైర్యాన్నిచ్చి వారి అవసరాలను తీరుస్తుండడంతో వ్యవస్థపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ప్రశ్న : మహిళలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? జవాబు : పొదుపు సంఘాల ద్వారా గ్రామాల్లో పేద మహిళలు సాధికారత సాధించారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాల ద్వారా అభివృద్ధి చెందారు. సంక్షేమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. నమ్మశక్యం కానీ హామీలను మేనిఫెస్టోలో ప్రవేశపెడుతున్న పార్టీలను తాము ఎప్పటికీ నమ్మమని చెప్పారు. -
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి
● ఎస్పీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు నెల్లూరు(క్రైమ్): చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి ఆదివారం ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్కు లేఖలో ఫిర్యాదు చేశారు. ఇతర జిల్లాల్లోని నేరచరిత్ర కలిగిన వ్యక్తులను సమీకరించి నారాయణ విద్యాసంస్థలు, నెల్లూరు నగరంలోని పలు లాడ్జిల్లో ఉంచి నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు వేయించడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు సృష్టించడం, వైఎస్సార్సీపీ ఓటర్లను భయపెట్టడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. విద్యాసంస్థలు, లాడ్జిల్లో ఉంచిన సంఘ విద్రోహక శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 171(బీ)కి కూడా విరుద్ధమన్నారు. అన్నీ నియోజకవర్గాల్లో డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్టవేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఈసీ మార్గదర్శకాల ప్రకారం అన్నీ పార్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
జరిగిందొకటి.. చెప్పిందొకటి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నారాయణ అంటే అ భివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన అవినీతిని పరికించి చూసి నగరవాసులు ఛీ అంటున్నారు. పదవి కోసం ఎన్నికల వేళ వ్యాపార సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి ఇంటింటికీ తిరిగిన నారాయణ కోవిడ్ మహమ్మరి విజృంభించిన వేళ ఏ ఒక్కరిని పలకరించకపోగా మృతదేహాలపై పేలాలు ఎరుకున్నాడన్న ఆరోపణలున్నాయి. పాపాలివే.. నారాయణ మెడికల్ కళాశాల ఆస్పత్రిలోని 1,050 బెడ్లను 2020లో కోవిడ్ నిబంధనల మేరకు ఏ–కేటగిరీ ఆస్పత్రిగా చేర్చారు. దీని ప్రకారం ఏ రోగి వద్ద నుంచి డబ్బు వసూలు చేయకూడదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ప్రకారం ప్రభుత్వమే రోగుల వైద్యం కోసం డబ్బులు చెల్లించేది. అయితే నిబంధనలు తుంగలో తొక్కి జలగల్లా రోగుల నుంచి నగదు వసూలు చేశారు. నారాయణ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో 25 బెడ్లను లాయర్ల వైద్యం కోసం కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక అడ్వొకేట్ అంబులెన్స్లో వైద్యం కోసం వెళ్లాడు. బెడ్లు ఖాళీ లేవని 23 గంటలు అంబులెన్స్లోనే ఉంచారు. దీంతో చేసేది లేక రూ.50 వేలు చెల్లిస్తే అప్పుడు బెడ్ ఇచ్చారు. ● కరోనా రెండో వేవ్లో నెలూరు నగరానికి చెందిన రంగయ్య తన భార్య లక్ష్మిని (ఇక్కడ దంపతుల పేర్లు మార్చాం) ఆస్పత్రిలో కరోనా వైద్యం కోసం చేర్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా బెడ్లు ఖాళీ లేవని చెప్పారు. డబ్బులు కడితే బెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. విధిలేక డబ్బులు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. అయితే సౌకర్యాల కోసం స్వచ్ఛందంగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధపడ్డామని రోగి వద్ద లెటరు రాయించుకున్నారు. అనంతరం రూ.2 లక్షలకు పైగా వసూలు చేసి కేవలం తెల్ల కాగితాలపై మాత్రమే డబ్బులు కట్టించుకున్నట్టు స్లిప్ ఇచ్చారు. ● ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తికి ఈహెచ్ఎస్ ఉంది. భార్యాభర్తలిద్దరూ కోవిడ్కు గురయ్యారు. ఈహెచ్ఎస్ కింద ఉచితంగా వైద్యం చేయాల్సి ఉండగా డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామన్నారు. చేసేదేమి లేక వారు చెప్పిన మొత్తం చెల్లించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విస్తుగొలుపుతున్న టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ తీరు కోవిడ్ సమయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైనం ఎన్నికల వేళ అబద్ధాల ప్రచారం అసహ్యించుకుంటున్న నగర వాసులు రూ.50 కోట్ల దోపిడీ కోవిడ్ మహమ్మారిని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి నారాయణ కోట్ల రూపాయలు సంపాదించారు. లక్ష మందికి వైద్యం అందించామని ఎన్నికల వేళ ప్రచారం చేసిన నారాయణ అండ్ టీం వైద్యం పేరుతో దోచుకున్న వైనంపై ప్రజలు నిలదీస్తున్నారు. ఏ కేటగిరీలో ఉన్న వైద్యశాల ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా వైద్యం అందించాల్సి ఉన్నా ఆ దిశగా పనిచేయలేదు. బెడ్ల కృత్రిమ కొరత చూపించి బాధితుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. అలాగే రెమిడిసివర్ ఇంజెక్షన్లు కృత్రిమ కొరత చూపి బ్లాక్ మార్కెట్లో ఒక్కో దానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసిన చరిత్ర ఉంది. ఇలా దాదాపు కోవిడ్ సమయంలోనే రూ.50 కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. -
పోలింగ్ డే
నెల్లూరు రూరల్ పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. సోమవారం పోలింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని ఆదివారం తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు కల్పించారు. షామియానాలు వేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
నెల్లూరు, సాక్షి: పోలింగ్తో ఏపీలో జన జాతర నడుస్తోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి కావలికి వచ్చిన ఓ దివ్యంగురాలి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేయడానికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ దివ్యాంగురాలు భావోద్వేగంగా మాట్లాడారు. జగనన్న ద్వారా తాను లబ్ధి పొందానని.. అందుకే కృతజ్ఞతతో జగన్ అన్నకు ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.అన్నా.. సాయం అంటే చాలూ.. అప్పటికప్పుడే అధికారుల్ని పిలిపించుకుని గంటల వ్యవధిలోనే సాయం అందేలా చూడడం సీఎం జగన్ నైజం. అలా ఈ 59 నెలల్లో లక్షల మంది వ్యధలను సీఎం జగన్ స్వయంగా విని.. వాళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం చూశాం కూడా. -
● రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెప్పడానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. నెల్లూరు నగరంలో అంతర్భాగంగా కొంత, చుట్టు పక్కల విస్తరించిన గ్రామాలే ఈ నియోజకవర్గ స్వరూపం. రైతులు, విద్యావంతులు, వ్యాపారులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు సమ్మిళితంగా ఉండే నియోజకవర్గం అభివృద్ధి స్వర్గధామంగా మార్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కుటుంబానికి అడ్డాగా ఉంది. ఈ దఫా ఎన్నికల్లోనూ విజయం నాదే అంటున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: మీరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి బరిలో నిలిచారు. మీ ప్రత్యర్థి కోటంరెడ్డి నాదే విజయం అంటున్నారు? మీ విజయంపై మీకెంత నమ్మకం ఉంది. జవాబు: నెల్లూరు రూరల్ అనేది వైఎస్సార్సీపీకి బలమైన నియోజకవర్గం. మా ప్రభుత్వం ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది. తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడింది. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలే మాకు అండ. కోటంరెడ్డి అరాచకాలే ఆయన్ను ఓడిస్తాయి. కోటంరెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తే.. నేను నెల్లూరు ఎంపీగా పోటీ చేశాను. ఆయనకంటే నాకే ఐదు వేల ఓట్లు అత్యధికంగా వచ్చాయి. ఈ దఫా ఎమ్మెల్యే అభ్యర్థి నేనే కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది. ప్రశ్న: మీరు గెలిస్తే నెల్లూరు రూరల్ అభివృద్ధికి మీకున్న ప్రణాళిక ఏమిటి? జవాబు: నెల్లూరు రూరల్ను అభివృద్ధి పరంగా స్వర్గధామం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో అభివృద్ధిని సర్వనాశనం చేశాడు. నేను గెలిస్తే.. రింగ్రోడ్డు నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఈ రోడ్డుతో నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయి. ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయింది. స్వర్ణాల చెరువును టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తాను. ఆమంచర్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్, పొట్టేపాళెం కులుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం, మొగళ్లపాళెంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాను. గత 9 నెలల్లో నేను ప్రారంభించిన, చేస్తున్న అభివృద్ధి పెండింగ్ పనులు పూర్తి చేస్తాను. నెల్లూరు రూరల్లో నా మార్క్ అభివృద్ధి చూపిస్తాను. ప్రశ్న: మీ ప్రత్యర్థి కోటంరెడ్డి ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ భూములు పరిస్థితి ఏమిటి? జవాబు: వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి విచారణ జరిపి స్వాధీనం చేసుకుంటాం. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తాం. ప్రశ్న: కరోనా సమయంలో నెల్లూరుకు ఏమీ చేయ లేదని ప్రతిపక్ష నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మీపై విమ ర్శలకు మీ సమాధానం? జవాబు: ఆయనలా కరోనా పేరు చెప్పి కూరగాయల వ్యాపారస్తుల నుంచి కూరగాయలు బలవంతంగా తీసుకుని పంపిణీ చేయలేదు. ఆక్సిజన్ వంటి సదుపాయాల కల్పనకు నెల్లూరు కలెక్టర్కు రూ.20 లక్షలు చెక్ను అందజేశాను. మరో రూ.20 లక్షలు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి రాలేని వారికి వారి సొంత ఊర్లుకు చేరేందుకు నా వంతు సహా యం చేశాను. నేను ఒకరికి సాయపడేవాడినే కానీ.. వారిలా ఆ పేరు.. ఈ పేరు చెప్పి దోచుకోలేదు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ పార్టీలో భారీగా టీడీపీ కేడర్ చేరింది.. వారికి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తారు? జవాబు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమాభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన వారు భారీగా పార్టీలో చేరారు. పార్టీ వారికి అండగా ఉంటుంది. వైఎస్సార్సీపీలోని సీనియర్ నాయకులు, కొత్తగా చేరిన వారిని సమన్వయ పరిచి ముందుకు తీసుకెళ్తాను. రానున్న రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలాన్ని మరింత పెంచుతాను. ప్రశ్న: మీరు ఎన్నికల తర్వాత జిల్లాలో ఉండరని కోటంరెడ్డి ప్రచా రం చేస్తున్నారే? జవాబు: గత 25 ఏళ్లుగా నెల్లూరులోనే ఉంటున్నాను. నా రాజకీయ జీవితం నెల్లూరుతో ముడిపడి ఉంది. నెల్లూరు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. నాపై ఆరోపణలు చేయడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఈ రకంగా నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు నాపై ఏ విధమైన నమ్మకం ఉందో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నాకు వచ్చిన మెజార్టీనే స్పష్టం చేస్తోంది. ప్రశ్న: గెలుపునకు మీకున్న బలం ఏమిటి? జవాబు: ప్రజల పట్ల ప్రభుత్వం జవాబుదారీ తనంగా పని చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యం పరంగా తీసుకువస్తున్న సంస్కరణలు సామాన్య ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. ఇదే నా గెలుపునకు బలం చేకూర్చే అంశాలని నమ్ముతున్నాను.ప్రశ్న: పోలింగ్కు ఒక్క రోజే ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరేమి చెబుతారు? జవాబు: నేనొక్కటే చెబుతాను. ప్రజలకు ఏ ప్రభుత్వంలో మేలు జరిగిందో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించి ఓట్లు వేయాలని కోరుతున్నాను. కోటంరెడ్డి మనోడని, డబ్బులిచ్చాడని ప్రలోభపడొద్దు. ఎవరిచ్చినా ఒకటి.. రెండు రోజుల్లో ఖర్చయిపోతాయి. ఐదేళ్లు మీ సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసే వారికి ఓటు వేయమని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు అనే వ్యక్తికి పొరపాటున ఓటేస్తే ఇప్పుడు మీకొచ్చే ఏ పథకం రాదు. ఆయన చెప్పిన పథకాలు ఇవ్వడు. ఈ ఎన్నిక లు మీ భవిష్యత్ను నిర్దేశించేవి. కాబట్టి మోసపూరిత హామీలను నమ్మవద్దు. కోటంరెడ్డి ప్రభుత్వ భూ ఆక్రమణలపై విచారణ జరిపిస్తా అరాచక శక్తుల ఆట కట్టిస్తా మా ప్రభుత్వ సంక్షేమంతో వార్ వన్సైడ్ ‘సాక్షి’తో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రశ్న: ఈ నియోజకవర్గంపై మీకున్న అవగాహన ఏమిటి?జవాబు: నేను నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగాను. ప్రజలతో మమేకమై ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ప్రధానంగా నెల్లూరు నగరంలో అంతర్భాగంగా ఉన్న విస్తరణ ప్రాంతాల్లో కోటంరెడ్డి సోదరులు అక్రమాలు, భూ ఆక్రమణలు, ఇసుక దందాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నాను. ఇప్పటికే ఇలాంటి అరాచకశక్తులను కట్టడి చేశాను. ఎన్నికల అనంతరం కూడా ఎటువంటి అరాచకాలు, దౌర్జన్యాలకు తావు లేకుండా చేస్తాను. -
ఉత్సాహంగా బైక్ ర్యాలీ
నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ నగరంలో భారీ బైక్ ర్యాలీని పార్టీ శ్రేణులు శనివారం నిర్వహించాయి. నవాబుపేట నుంచి ఆత్మకూరు బస్టాండ్, కనకమహల్ సెంటర్, పెద్దబజార్, వీఆర్సీ, గాంధీబొమ్మ, రామ్మూర్తినగర్ వరకు ర్యాలీ సాగింది. పార్టీ నెల్లూరు లోక్సభ, నెల్లూరు సిటీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఆనం జయకుమార్రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీని జరిపారు. విజయసాయిరెడ్డి స్వయంగా బైక్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపర్చారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement