నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. విధులకు కేటాయించిన సిబ్బంది ఇప్పటికే సంబంధిత కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 5.30కు ఈవీఎం పనితీరుపై పరిశీలన.. మాక్ పోలింగ్ జరగనుంది. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దిన అనంతరం పోలింగ్ ప్రక్రియను జరపాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన అనంతరం ఈవీఎంలకు సీల్ వేసేంత వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసి నేరుగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చాల్సి ఉంది. నెల్లూరు లోక్సభతో పాటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్రూమ్ను నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు..
పురుషులు
10,08,792
జిల్లాలో ఓటర్ల సంఖ్య
20,62,439
పోలింగ్ కేంద్రాలు
2470
పోలింగ్ సిబ్బంది :
20 వేల మంది