-
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు..
ఓటెత్తిన చైతన్యం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంతో పోలిస్తే పోలింగ్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.55గా నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా (నర్సాపురం పార్లమెంట్) గతంలో 81.02 శాతం నమోదు కాగా ఈ సారి 82.60 నమోదైంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. రెండు జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్లను కలపాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో.. నియోజకవర్గం 2019 2024 చింతలపూడి 81.83 80.05 దెందులూరు 84.70 85.01 ఏలూరు 67.59 71.02 కై కలూరు 88.50 87.50 నూజివీడు 86.19 87.32 పోలవరం 86.55 84.16 ఉంగుటూరు 86.88 87.75 పశ్చిమగోదావరి జిల్లాలో.. నియోజకవర్గం 2019 2024 ఆచంట 81.46 82.80 భీమవరం 77.73 79.35 పాలకొల్లు 81.55 82.28 నర్సాపురం 82.09 84.38 తణుకు 80.00 82.16 తాడేపల్లిగూడెం 80.43 81.60 ఉండి 84.73 86.20 -
చికెన్ తెగ తినేశారు
సార్వత్రిక పోరు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చికెన్ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరిగాయి. నోటిఫికేషన్కు ముందు నుంచే విందు భోజనాల హడావిడి మొదలైంది. ఓట్ల పండుగలో నాన్వేజ్ వంటకాలెన్ని వడ్డించినా చికెన్దే సింహ భాగమైంది. రికార్డు స్థాయిలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు జరగ్గా, గత నెల రోజుల్లో మాంసాహార ప్రియులు రూ.435 కోట్లు విలువైన చికెన్ను లొట్టలేసుకుంటూ లాగించేశారు. సాక్షి, భీమవరం: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందు భోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. చుట్టూ ఉన్న కేడర్ను కాపాడుకునేందుకు ఆశావాహుల ఇంట నోటిఫికేషన్కు ముందు నుంచే ఈ సందడి మొదలవుతుంది. ఎన్నికల సమీపించే కొద్ది వివిధ సంఘాల వారికి విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో గత నెల రోజులోగా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఆత్మీయ కలయికల పేరిట రాజకీయ విందులే. అభ్యర్థులు తమ ఎన్నికల కార్యాలయాల వద్ద ప్రతి రోజు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. నామినేషన్లు, ప్రచార కార్యక్రమాల్లో కేడర్ కోసం ప్రత్యేక విందులు వడ్డించారు. మరో పక్క మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ సామాజిక వర్గాలు, ఆటో, తోపుడుబండ్లు యూనియన్లు, వివిధ వర్తక సంఘాలతో పాటు ఎక్కువగా ప్రజల్లో ఉండే పీఎంపీలు, పాస్టర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లు తదితర వర్గాల వారికి పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి కోసం ఏర్పాటు చేసిన విందు భోజనాల్లో చేప, రొయ్య వంటకాలు చేసినా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే చికెన్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గరిష్ట స్థాయి విక్రయాలు సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీల నేతల నుంచి హోల్సేల్ వ్యాపారులకు రోజూ వందల కిలోల చికెన్ ఆర్డర్లు వచ్చాయి. గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అంతకు వారం పది రోజుల ముందు నుంచి చికెన్ ఆర్డర్లు రావడం మొదలైందని వ్యాపారులు అంటున్నారు. నామినేషన్లు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్డర్ల జోరు మరింత పెరిగిందంటున్నారు. రోజువారి అమ్మకాలతో పోలిస్తే సగటున గత నెల రోజులుగా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయని వారు తెలిపారు. మునుపెన్నడూ ఇంత భారీస్థాయిలో వరుసగా అమ్మకాలు జరిగింది లేదంటున్నారు. కోళ్లు సిద్ధంగా.. ధర నిలకడగా ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం తదితర ప్రాంతాల్లోని ఫాంలలో ఏడు లక్షలకు పైగా కోళ్ల పెంపకం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి వేసవిలో 40 రోజులకు, శీతాకాలంలో మేత ఎక్కువగా తీసుకోవడం వలన 35 రోజుల్లోనే రెండు కేజీలు వరకు బరువు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రతకు కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. వేసవి తాపం నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు షెడ్లపై వాటర్ స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు తదితర వాటి ఏర్పాటుతో నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతుంది. వేడి చేస్తుందన్న భావనతో చికెన్ వినియోగం తక్కువగా ఉండటం వలన డిమాండ్ లేక ధర పతనమవుతుంది. ఆయా కారణాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వేసవిలో కొత్త బ్యాచ్లు తక్కువగా వేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల సీజన్ కావడం వ్యాపారం బాగుంటుందని ముందే ఊహించి కొత్త బ్యాచ్లు సిద్ధం చేయడం వారికి కలిసొచ్చింది. వేసవిలో కిలో రూ.220 నుంచి రూ.250 మధ్య పలికే చికెన్ ధర ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రూ.280 నుంచి రూ.300 మధ్య నిలకడగా ఉందని హోల్సేల్ వర్గాలు అంటున్నాయి. సగటున కిలో రూ.290 చొప్పున సాధారణ అమ్మకాలు మేరకు రోజుకు రూ.7.25 కోట్ల చొప్పున నెలకు రూ. 217.5 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. అయితే నెల రోజులుగా ఎన్నికల నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో జరిగిన అమ్మకాల మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.435 కోట్లు మేర చికెన్ను మాంసాహారప్రియులు లాగించేశారంటున్నారు. సార్వత్రిక పోరు వేళలో చికెన్ విక్రయాల జోరు సంఘాలు, సామాజిక వర్గాల వారీగా విందులు నోటిఫికేషన్కు ముందు నుంచే హడావిడి మొదలు ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల వినియోగం ఎన్నికల నెల రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు సాధారణ వేసవికి భిన్నంగా రూ.290 పలికిన కిలో ధర ఒక నెలలో రూ.435 కోట్ల విలువైన చికెన్ లాగించేశారు -
చింతమనేని దౌర్జన్యాలను సహించం
దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో కచ్చితంగా ఓడిపోతున్నాననే ఆక్రోశంతో చింతమనేని ప్రభాకర్ హింసకు పాల్పడుతున్నారని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతల దాడుల్లో కొప్పులవారిగూడెం, కొవ్వలితో పాటు అనేక గ్రామాల్లో తీవ్ర గాయాలపాలై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మంగళవారం పరామర్శించారు. బాధితులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొఠారు విలేకరులతో మాట్లాడుతూ మీడియా ముందు చింతమనేని చెప్పే డాబు కబుర్లకు జనమంతా విస్తుపోతున్నారని, ఎన్నికల్లో ఓడిపోతున్నామని స్పష్టంగా తెలియడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై కత్తులు, కర్రలతో దాడులు, దౌర్జన్యాలు చేస్తే టీడీపీ విజయం సాధిస్తుందా అని ప్రశ్నించారు. మ్యాండెటరీ ఇచ్చి రౌడీషీటర్కు ఆయుధాన్ని ఇచ్చినట్లు చంద్రబాబు చింతమనేనిని దెందులూరు నియోజకవర్గానికి వదిలారన్నారు. మ్యాండెట్ ఇచ్చిన వెంటనే వరుసగా నాలుగైదు గ్రామాల్లో చింతమనేని వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు చేశారన్నారు. ఎట్టి పరిస్ధితుల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి చేసిన వారిని, ప్రొత్సహించిన వారిని, భాగస్వాములను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సైతం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దెందులూరులో, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండానే ఎగరటం తథ్యమన్నారు. టీడీపీ నేతల దాడులను ఉపేక్షించంపెదవేగి: సార్వత్రిక ఎన్నికల బరిలో ఓడిపోతున్నామని తెలిసి పోలింగ్కు ఆటంకాలు కల్పించాలనే కుట్రతో పలు గ్రామాల్లో హింసకు పాల్పడిన చింతమనేని లెక్కలన్నీ సరిచేస్తానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి హెచ్చరించారు. మంగళవారం పోలింగ్ సమయంలో టీడీపీ శ్రేణుల దాడుల్లో తీవ్ర గాయాలపాలై పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులను ఎమ్మెల్యే పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందే ఏర్పాటు చేశారు. తాను అండగా ఉన్నానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చంద్రబాబు చింతమనేనికి టికెట్టు ఇచ్చినప్పటి నుంచి దెందులూరులో నీచమైన దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఎన్నికల వరకు సంయమనం పాటించామని, ఇక ఎలాంటి కవ్వింపు చేష్టలను సహించేది లేదన్నారు. ప్రజలు తన గెలుపును ఖాయం చేశారని, కార్యకర్తలకు అండగా నిలుస్తానని అబ్బయ్య చౌదరి చెప్పారు. ఓటమి భయంతోనే చింతమనేని హింసకు దిగుతున్నాడు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చింతమనేని దాడుల్లో గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన వారికి పరామర్శ -
మీ ఆదరణ మరువలేనిది
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరు (ఆర్ఆర్ పేట): నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే తనను ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా విశేషంగా ఆదరించే ఏలూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ వారి సొంత కుటుంబ సభ్యుడిగా ఆదరించడాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి సోమవారం జరిగిన ఎన్నికల వరకు తన వెన్నంటి ఉండి తన కోసమే రేయింబవళ్ళు నిస్వార్థంగా పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల త్యాగం తన గెలుపునకు సోపానంగా ఉపయోగపడుతుందని, తన విజయంలో కీలక భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరినీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని, వారికి భవిష్యత్లో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఏలూరు (ఆర్ఆర్పేట): తన తండ్రి కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రిగా ప్రజా సేవ చేయడం తనకు ఆదర్శమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్న వయసులోనే కష్టనష్టాలకు ఓర్చుకుని ప్రజా సంక్షేమమే పరమావధిగా చేస్తున్న పాలనకు స్ఫూర్తి పొంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతకు కృతజ్ఞతలు చెబుతున్నానని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరుతో పాటు దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, కై కలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను ఎక్కడికి వెళ్లినా తమ సొంత బిడ్డలా తనను అక్కున చేర్చుకున్నారన్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన వెన్నంటే ఉండి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు వెరవకుండా పనిచేశారన్నారు. తన ప్రజలు, కార్యకర్తల ఆదరణాభిమానాలతో తన గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసుల రాజీకి కృషి చేయాలి ఏలూరు (టూటౌన్): కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతోన్న కేసులకు సంబంధించి ఇరుపక్షాలకు సమన్యాయం చేసేందుకు రాజీ ప్రయత్నం ద్వారా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉమ్మడిగా కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాభవన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటుచేశారు. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న రత్నప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాదులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు ఏర్పాటుచేశామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకుని రాజీ మార్గం ద్వారా కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కానాల రామకృష్ణారావు, టి.సుబ్బారావు, పి.రత్నరాజు రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించారు. ఏలూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్ఎంఎం నాగరాజు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అతిరాత్ర మహాయాగంతో సస్యశ్యామలం భీమవరం (ప్రకాశం చౌక్): యాగాలతో మంచి యోగాలు కలుగుతాయని ఆంధ్రప్రదేశ్ సేవ్ టెంపుల్స్ చైర్మన్ గజల్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం నుంచి నిర్వహించే అతిరాత్ర మహాయాగ కార్యక్రమాల కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ యాగాలతో మంచి యోగాలు శుభ పరిణామాలు కలుగుతాయన్నారు. దేశ విదేశాల నుంచి, రాజధాని ఢిల్లీ నుంచి కూడా దీని వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. భీమవరంలో యజ్ఞకర్త జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్యశర్మ సారధ్యంలో తలపెట్టడం శుభపరిణామం అన్నారు. ఈ యాగంతో సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. -
స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
ఏలూరు (మెట్రో): ఏలూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఈవీఎంలను మూడంచెల భద్రత వ్యవస్థల మధ్య భద్రపరచామని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లాలో సోమవారం ఏలూరు పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ ముగించుకుని ఏలూరులోని సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. జిల్లాలో 83.4 శాతం పోలింగ్ నమోదైందన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో సోమవారం సాయంత్రం 6 లోపున పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించామని, రాత్రి వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి సిబ్బంది ఈవీఎంలను తీసుకుని వచ్చి స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచే కార్యక్రమం మంగళవారం ఉదయం వరకు జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర పారా మిలట్రీ భద్రతా బలగాల పహారాలో ఉంటాయన్నారు. రెండో అంచెలో రాష్ట్ర రిజర్వ్ భద్రతా దళాలు, మూడో అంచెలో స్థానిక పోలీస్ ఫోర్స్ భద్రత అందిస్తాయన్నారు. ఈవీఎంలను పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు, వివిధ రాజకీయ ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచి, వారి సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీళ్లు వేసి కేంద్ర భద్రతా బలగాలకు అప్పగించామన్నారు. ఈవీఎంల భద్రతను, స్ట్రాంగ్ రూమ్ల సీళ్లను తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామన్నారు. అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించవచ్చన్నారు. జూన్ 4వ తేదీన ఏలూరులోని సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఐటీడీఏ పీఓ ఎం.సూర్యతేజ, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఈవీఎంలకు మూడంచెల భద్రత
ఏలూరు (మెట్రో): వట్లూరులోని సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలకు మూడంచెల భద్రత వ్యవస్థను అమలు చేయనున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం ఈవీఎంలను భద్రపర్చిన గదులకు సీళ్లు వేశారు. మూడంచల భద్రత వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) కేంద్ర భద్రతా దళాలు పహారా కాయనుండగా, దాన్ని వెలుపుల వైపు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళాలు బందోబస్తు నిర్వహిస్తాయి. కళాశాల చుట్టుపక్కల మరో బృందం షిఫ్టుల వారిగా విధులు నిర్వహిస్తాయి. 24/7 సీసీ కెమెరాలు నిఘాతో పాటు రికార్డింగ్ చేస్తాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని కలెక్టర్ తెలిపారు. -
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ విజయవాడ మేరిస్స్టెల్లా కాలేజ్ ఆవరణలో 7వ ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి కె కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాస్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలుర జట్టు ఎంపిక ఈ నెల 16వ తేదీన మార్టేరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, బాలికల జట్టు ఎంపిక ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాలలో ఉదయం 9 గంటలకు చేపడతామని వెల్లడించారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్తో పాటు జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు అసోసియేషన్ కార్యదర్శి కె మురళీకృష్ణ 94411 71933 నంబర్లో సంప్రదించాలన్నారు. -
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు ఈ నెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి యన్.భారతి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బాలురకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల పోలసానిపల్లి పాఠశాల నందు 16వ తేదీన, బాలికలకు అదే పాఠశాలలో 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి, ఆరుగొలను, నరసాపురం గురుకుల పాఠశాలల్లో చేరేందుకు 16వ తేదీ ఉదయం 9 గంటలకు పోలసానిపల్లిలో కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడు గురుకుల పాఠశాలల్లో చేరేందుకు 17వ తేదీ ఉదయం 9 గంటలకు పోలసానిపల్లి పాఠశాల ప్రాంగణంలో కౌనెల్సింగ్కు హాజరు కావాల్సిందిగా కోరారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఇప్పటికే ఆన్లైన్ విధానంలో సీట్లు భర్తీ చేయడం జరిగిందని, మిగిలిన సీట్లు మెరిట్తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుగుణంగా సీట్లు భర్తీ చేయబడతాయని చెప్పారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పదోతరగతి మార్క్లిస్ట్, ఆధార్ తమ వెంట తీసుకు రావాలన్నారు. బాలురకు సంబంధించి మొత్తం 140 సీట్లు ఖాళీలుండగా వీటిలో ఎస్సీ–94, బీసీ–10, బీసీ–సి 27, ఎస్టీ–6, ఓసీ–3 సీట్లు కలవని చెప్పారు. బాలికలకు సంబంధించి మొత్తం 122 సీట్లు ఖాళీలు ఉండగా వీటిలో ఎస్సీ–97, బీసీ–11, బీసీ–సి 2, ఎస్టీ–12 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా సమన్వయ కర్త యన్.భారతి కోరారు. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
అధికారుల అత్యుత్సాహం.. వైఎస్సార్ సీపీ ఓట్లకు గండి
ముసునూరు: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ల ప్రవర్తన, అధికారుల అత్యుత్సాహంతో వైఎస్సార్ సీపీ ఓట్లకు గండి పడింది. సోమవారం మండల వ్యాప్తంగా 57 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ అధికారులు పలు చోట్ల అధికార పార్టీకి వ్యతిరేకంగా, టీడీపీ గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. మండల కేంద్రం ముసునూరులోని 79వ పోలింగ్ బూత్లో ఓటర్లు దేవినేని శ్రీవర్షిణి కెనడా, తులిమెల్లి రవికిషోర్ అమెరికాలో ఉన్నారు. దీనిపై ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్న టీడీపీ ఏజెంట్లు, పోలింగ్ అధికారితో కుమ్మకై ్క, వైఎస్సార్ సీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలోకి రాక ముందే స్థానికులతో దొంగ ఓట్లు వేయించారు. మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తూ, కవ్వింపు చర్యలకు దిగారు. దీనికి తోడు గోపవరంలోని 96వ పోలింగ్ బూత్లో వృద్ధురాలు ఓటు వేయడానికి రాగా, పోలింగ్ అధికారి ఎంపీ అభ్యర్థికి ఓటు వేయించి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయకుండా అడ్డుకుని ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఆమె కోరినా వినకుండా, సైకిల్ గుర్తుకు ఓటు వేయించింది. ఆమెతో పాటు వచ్చిన కోడలు ఈ విషయాన్ని గుర్తించి అధికారిని నిలదీసింది. దీంతో ఆ అధికారి దండాలు, దస్కాలు పెడుతూ ఆమెను క్షమాపణ కోరాడు. రెండు చోట్లా వైఎస్సార్ సీపీ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి, ఘర్షణ వాతావరణాన్ని నివారించారు. -
మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు
ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వెళ్లింది. అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్వాడీ టీచర్ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు. అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
కుక్కునూరు: ట్రాక్టర్ ఢీకొనడంతో మోటార్సైకిల్పై వెళుతున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ముత్యాలంపాడుకు చెందిన మాగంటి నవకాంత్ (33) సోమవారం సారపాక నుంచి తన మోటార్సైకిల్పై కుక్కునూరు వైపు వస్తున్నాడు. వేలేరు ముత్యాలమ్మ గుడి దాటిన తరువాత మలుపు రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ నవకాంత్ మోటార్ సైకిల్ను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటెత్తిన ఏలూరు
పోలింగ్ ప్రశాంతం ● 79 శాతం పోలింగ్ నమోదు ● జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ● రాత్రి 9 గంటల వరకు సాగిన ఓటింగ్ ప్రక్రియ ● స్ట్రాంగ్రూమ్కు చేరుతున్న ఈవీఎంలు, వీవీప్యాట్లు ● పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా ఓ (పో) టెత్తింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తిస్థాయి ప్రశాంత వాతావరణంలో సాగింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,774 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. మండుటెండలో సైతం క్యూలైన్ల్లో ఓటర్లు బారులు తీరడం విశేషం. రాత్రి 9 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 79 శాతం పోలింగ్ నమోదైంది. సుమారు 40 బూత్ల్లో 8 గంటలు దాటే వరకు పోలింగ్ కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు, ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోగా కేంద్ర ఎన్నికల సంఘ పరిశీలకులు, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ డి. మేరీ ప్రశాంతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 7 గంటల నుంచి.. ఉదయం 7 గంటలకే జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు 10.53 శాతం, ఉదయం 11 గంటలకు 24.23 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.05 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 59.14 శాతం, సాయంత్రం 5 గంటలకు 72.03 శాతం, సాయంత్రం 6 గంటలకు 75.05 శాతం పోలింగ్ నమోదైంది. 16,37,430 మంది ఓటర్లకుగాను 12,28,973 మంది ఓటర్లు సాయంత్రం 6 గంటల సమయానికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 5,95,441 మంది పురుషులు, 6,33,478 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో పురుషులు కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు. సుమారుగా 5 నుంచి 7 శాతం మహిళా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు ఏలూరు జిల్లా యంత్రాంగం పోలింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన సదస్సులు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. కలెక్టరేట్లో భారీ డిజిటల్ కౌంట్డౌన్ గడియారాన్ని విద్యుత్ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. అలాగే ఏలూరుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయిదా గ్రామ పంచాయతీలోని కాకిసనూరు పోలింగ్ కేంద్రంలో 472 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ పోలింగ్ అధికారులకు, సిబ్బందికి గిరిజన సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అలాగే ఏలూరు జిల్లా కేంద్రంలో 2,044 వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పోలింగ్ సరళిని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు గ్రో గ్రీన్ నినాదంతో కొన్నిచోట్ల మొక్కలు పంపిణీ చేశారు. అలాగే డీపీఓ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి సంప్రదాయ వస్త్రధారణతో ఓటర్లను స్వాగతించారు. సోమవారం ఉదయం 5.30 గంటల్లోపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్పోల్ నిర్వహించే సాంకేతిక సమస్యలున్న ఈవీఎంలను సరిచేశారు. అలాగే 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 2,044 వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటుచేశారు. సీనియర్ సిటిజన్లు, విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ సరళి ఇలా.. జిల్లాలో ఉదయం నుంచి పోలింగ్ శాతం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య, మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 1,774 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ల నాని, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా నూజివీడు నియోజకవర్గంలో 81.01 శాతం, అత్యల్పంగా ఏలూరు నగరం 66.25 శాతం పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు నమోదైంది. ఓటు వేశానంటూ సెల్ఫీ తీసుకుంటూ..పోలింగ్ శాతం ఇలా.. నియోజకవర్గం ఉ. 9 గంటలు 11 గంటలు మ.1 గంట 3 గంటలు సా.5 గంటలు 6 గంటలు చింతలపూడి 9.07 22.80 38.66 55.45 69.00 71.41 దెందులూరు 11.20 26.85 42.90 60.66 74.25 77.00 ఏలూరు 10.74 27.96 38.04 54.22 64.59 66.25 కై కలూరు 9.10 24.13 39.69 61.73 73.78 78.53 నూజివీడు 9.88 24.91 42.11 64.62 77.08 81.01 పోలవరం 9.91 22.03 37.13 58.86 72.29 75.37 ఉంగుటూరు 11.31 25.18 42.64 59.38 74.22 77.05 మొత్తం 10.53 24.32 40.05 59.14 72.03 75.05 -
పకడ్బందీ ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో వేకువజామునే మాక్ పోలింగ్తో ప్రారంభించిన ఓటింగ్ సరళి, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించారు. సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు తక్షణమే ఈవీఎంల సమస్యలు పరిష్కరించి పోలింగ్ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో సుమారు 20 వేల మంది అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ చేరుతూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్కు అర్ధరాత్రి వరకు చేరుకుంటూనే ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ఈవీఎంలను ఏలూరు సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ మంగళవారం వేకువజాము వరకు సాగనుంది. ఏలూరు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి వారికి కేటాయించిన రూట్లలో బస్సులను సైతం తిరిగి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడంచెల భద్రత నడుమ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లో ఈవీఎంలు, పోలింగ్ మెటీరియల్ను భద్రపరిచారు. ఎన్నికల కమిషన్ కితాబు ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్నికలపై అవగాహన కల్పించే విధుల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారుల తీరును ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొనియాడింది. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో సంప్రదాయ వస్త్రాలతో ఓటర్లను స్వాగతం పలకడాన్ని అభినందించింది. అలా గే మారుమూల కొండరెడ్డి ప్రాంతమైన కాకిసనూరుకు గోదావరి నదిపై బోటుపై వెళ్లి విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బందిని సత్కరించడం వంటి కార్యక్రమాలకు ప్రశంసలు కురిపించింది. 14 సార్లు ఓటు వేశా భీమడోలు: ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కును బాధ్యతతో ఉపయోగించుకోవాలని 90 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాలేటి బ్రహ్మారావు అన్నారు. భీమడోలులో సోమవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. తాను 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఓటు వేశానని అన్నారు. ఎన్నికల సంఘం తనకు హోమ్ ఓటింగ్కు అవకాశం ఇచ్చిందని, అయినా తాను పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకే మొగ్గు చూపానన్నారు. తనకు ఓపిక ఉండటంతో క్యూలైన్లో నిలుచుకుని ఓటు హక్కు వినియోగించుకున్నానన్నారు. 14 సార్లు ఓటు వేసే భాగ్యాన్ని భగవంతుడు కలిగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కోరారు. ఓటేసేందుకు ఆస్ట్రేలియా నుంచి.. గణపవరం(నిడమర్రు): సముద్రాలు దాటి ఆస్ట్రేలియా నుంచి స్వగ్రామం చిలకంపాడు గ్రామానికి ఓ టు వేసేందుకు వచ్చి నట్టు మురళీ రామ్మో హన్రావు అనే యువకుడు తెలిపారు. 11న రాత్రి ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి సోమవారం మధ్యాహ్నానికి చిలకంపాడు చేరుకున్నానని, ఓటు విలువ గ్రామస్తులకు తెలియజేసేందుకు వ్యయప్రయాసలతో వచ్చానని అన్నారు. -
మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు
ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వెళ్లింది.అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్వాడీ టీచర్ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు.అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. -
నియోజకవర్గాల వారీగా ఓటర్లు
నియోజకవర్గం పురుషులు మహిళలు థర్డ్జెండర్స్ మొత్తం ఉంగుటూరు 1,01,545 1,04,886 6 2,06,437 దెందులూరు 1,08,915 1,15,089 9 2,24,013 ఏలూరు 1,12,426 1,22,872 47 2,35,345 పోలవరం 1,22,760 1,31,212 9 2,53,981 చింతలపూడి 1,34,295 1,38,733 41 2,73,069 నూజివీడు 1,18,104 1,20,867 10 2,38,981 కై కలూరు 1,01,196 1,04,404 4 2,05,604 మొత్తం 7,99,241 8,38,063 126 16,37,430 -
ఓటేద్దాం.. రండి
సౌకర్యాల కల్పనపై ఆరా ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించి సౌకర్యాల కల్పనపై సిబ్బందిని ఆరా తీశారు. సిబ్బందికి భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం రుచి చూశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ విజయవంతంగా ముగిసింది. ఆయా కేంద్రాల వద్ద రిటర్నింగ్ అధికా రుల పర్యవేక్షణలో సిబ్బంది ఎన్నికల సామగ్రి తో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. అధికారుల సమష్టి కృషితో ఎన్నికల సిబ్బంది అనుకున్న సమయం కంటే ముందుగానే బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో పయనమయ్యారు. ఉంగుటూరు కేంద్రం వద్ద వసతులను ఎన్నికల పరిశీలకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత సో మవారం జరిగే ఎన్నికల పో లింగ్లో ప్రతి పౌ రుడూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కోరారు. మ న భవిష్యత్తును మన మే నిర్ణయించుకునే అవకాశం ఎన్నికల ద్వారా కలుగుతుందన్నారు. ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల సమరం తుదిదశకు చేరుకుంది. సోమవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఒక పార్లమెంట్ స్థానం, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 16,37,430 మంది ఉండగా 1,744 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 20 వేల మంది సిబ్బంది జిల్లాలో ఎన్నికల విధుల్లో 16 వేల మంది సిబ్బంది, 4 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాలను 193 సెక్టార్లుగా విభజించి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం, వీవీ ప్యాట్లతో పాటు ఎన్నికల సామగ్రిని అందించారు. ఏ లూరుతో పాటు ఆయా నియోజకవర్గాల ప్రధాన మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మ ధ్యాహ్నం నుంచి పోలింగ్ సిబ్బంది సామగ్రితో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పడవపై వెళ్లే వేలేరుపాడు మండలంలోని కాకిసనూరు పోలింగ్ కేంద్రానికి మధ్యాహ్నమే సిబ్బంది చేరుకున్నారు. అదనపు ఈవీఎంలు అధికారులు సోమవారం ఉదయం 5.30 గంటలకు మాక్పోల్, ఉదయం 7 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు దూరంగా ఉండటంతో అక్కడ సెక్టార్ ఆఫీసర్ల వద్ద రెండు అదనపు ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా ఈవీఎం సాంకేతిక సమస్య తలెత్తితే 15 నుంచి 20 నిమిషాల్లో అందించేలా చర్యలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున బెల్ అధికారులు అందుబాటులో ఉంటారు. ఫోన్ సౌకర్యం లేని 13 పోలింగ్ కేంద్రాల్లో వీహెచ్ఎఫ్ సెట్లను ఏర్పాటుచేశారు. 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు జిల్లాలో 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా 1,069 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు. దివ్యాంగుల సౌకర్యార్థం 1,100 వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. పోలింగ్ సిబ్బంది తరలింపునకు 150 ఆర్టీసీ, 350 ప్రైవేటు వాహనాలు ఏర్పాటుచేశారు. విస్తృత ఏర్పాట్లు జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడి యాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద షామి యానాలు, తాగునీరు సౌకర్యంతోపాటు హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 15,615 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను, 896 మంది వృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్ను వినియోగించుకున్నారన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 మహిళా పోలింగ్ కేంద్రాలు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో యువత కోసం రెండు ప్రత్యేక కేంద్రాలు, విభిన్న ప్రతిబావంతుల కోసం ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మెటీరియల్ను సరిచూసుకుని.. దెందులూరు: ఏలూరు సీఆర్ఆర్ ఉమెన్స్ కళాశాలలో దెందులూరు అ సెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల మెటీరియల్ పంపిణీని ఆదివారం చేపట్టినట్టు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి తెలిపారు. మెటీరియల్ సరిచూసుకుని ఆయా కేంద్రాలకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల సామగ్రితో ఉద్యోగిని నేడే ఎన్నికల పోలింగ్ జిల్లాలో 16.37 లక్షల మంది ఓటర్లు 1,744 పోలింగ్ కేంద్రాలు 415 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత -
ఏలూరులో వార్ వన్ సైడే
ఇంటికే సంక్షేమం జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి 600 రకాల సేవలను స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్న పరిస్థితి. నాడు–నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 మంది ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లల్లో రూ.3,880 కోట్ల పెన్షన్ , 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యాకానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి.. ఊళ్లు రూపురేఖలు మారాయి.. ప్రతి ఊరిలో నాడు–నేడులో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి.. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగే ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరింది. విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్కే మళ్లీ పట్టం కట్టనున్నారు ప్రజలు. జిల్లాలో మరోసారి క్లీన్స్వీప్ సాధించే దిశగా ఫ్యాన్ పార్టీ దూసుకువెళ్తుంది. 90 శాతం మందికి పైగా పథకాలు సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజల చెంతకు పాలన చేరువైంది. అర్హతే ప్రామాణికంగా పక్కా పారదర్శకంగా పథకాలు అందాయి. అలాగే ప్రతి పల్లెలో ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మా రడం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. 90 శాతం మందికి పైగా ప్రజలు పారదర్శకంగా పథకాలు అందుకోవడం ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచింది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సర్కా రు అండగా నిలిచి ప్రాణనష్టాన్ని నివారించడంతో పాటు ప్రజలకు పల్లెల్లోనే మెరుగైన వైద్యాన్ని అందించి అభిమానాన్ని చూరగొంది. సైకిల్ మరమ్మతులతో సరి దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కై కలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు. ఇక జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. జగన్ అంటే నిజం ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. అలాగే ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు వంటివి జరిగాయి. ఏలూరులో 50 ఏళ్ల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్ను రూ.80 కోట్లతో పూర్తి చేయించారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జగన్ కోసం జనం సిద్ధం జిల్లాలో క్లీన్స్వీప్ దిశగా వైఎస్సార్సీపీ ఐదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమం, అభివృద్ధి ప్రజల చెంతకు పాలన చేరువ ఏళ్ల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏలూరు వైద్య కళాశాల కల సాకారం ఎన్నికల ప్రచారంలో చేతులెత్తేసిన కూటమి అభ్యర్థులు క్లీన్స్వీప్ చేయనున్న వైఎస్సార్సీపీ జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్స్వీప్ దిశగా దూసుకువెళ్తుంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కై కలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్షోకు అపూర్వ స్పందన వచ్చింది. ఇక పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే 60 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఏలూరు ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్కు కేటాయించింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏలూరు నుంచి ఆళ్ల నాని, దెందులూరు నుంచి కొఠారు అబ్బయ్యచౌదరి, ఉంగుటూరు నుంచి పుప్పాల వాసుబాబు, నూజివీడు నుంచి మేకా వెంకట ప్రతాప అప్పారావు, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు, చింతలపూడి నుంచి కంభం విజయరాజు, పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు. -
ఆమే కీలకం
● జిల్లాలో సింహభాగం మహిళా ఓటర్లే ● పురుషుల కంటే 38,822 మంది అధికం ● మొత్తం ఓటర్లు 16.37 లక్షలు సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు నిర్ణేతలు కానున్నారు. నిర్ణయాత్మకశక్తిగా మారనున్నారు. జిల్లాలో తుది ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారే ప్రధాన భూమిక పోషించనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 16,37,430 ఉండగా వీరిలో పురుషులు 7,99,241 మంది, మహిళలు 8,38,063 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లు 38,822 మంది అధికంగా ఉన్నారు. -
ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆదిశంకరాచార్యుని జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. క్షేత్రపాలకుని ఆలయంలో ముందుగా అర్చకులు, పండితులు ఆదిశంకరాచార్యుని ఉత్సవ మూర్తికి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం గర్భాలయంలో శివదేవుని వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తరువాత ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి వాహనంలో ఆదిశంకరాచార్యుని చిత్రపటాన్ని, ఉత్సవమూర్తిని ఉంచి క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆదిశంకరాచార్యుని విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఆలయానికి చేరుకున్న తరువాత శంకరాచార్యుని ఉత్సవమూర్తికి, అలాగే గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. -
ఓట్ల పండగకు సొంతూళ్లకు..
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఓట్ల పండగకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇతర జిల్లాల్లో స్థిరపడినా ఓటు హక్కును ఈ జిల్లాలోనే వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో స్థిరపడిన జిల్లా వాసులను జిల్లాకు తరలించడానికి ఆర్టీసీ 42 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. వీటిలో ఇంద్ర, అమరావతి వంటి ఏసీ బస్సులతో పాటు సూపర్ డీలక్స్ బస్సులు కూడా ఉన్నాయి. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలకు చెందిన బస్సులు గత శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రజలను తరలించే పనిలో పడ్డాయి. 42 ప్రత్యేక బస్సులే కాకుండా హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ జిల్లాకు వచ్చే సుమారు 20 బస్సులు కూడా ప్రజలను తీసుకువస్తున్నాయి. కాగా ఓటు వేయడానికి వస్తున్న ప్రవాస పశ్చిమ వాసులకు రానుపోను చార్జీలకయ్యే మొత్తాన్ని ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒక సామాజికవర్గానికి చెందిన నాయకులు హైదరాబాద్ నుంచి ఓటర్లను తరలించడానికి సుమారు 20 ప్రైవేట్ ఏసీ బస్సులను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కొత్త యువ ఓటర్లు 42,196 కాగా జిల్లాలో 18 – 19 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు 42,196 మంది ఉన్నారు. వీరిలో 22,661 మంది యువకులు ఉండగా, 19,535 మంది యువతులు ఉన్నారు. వీరిలో ఉంగుటూరు నియోజకవర్గంలో 3195 మంది యువకులు, 2,828 మంది యువతులు, దెందులూరు నియోజకవర్గంలో 3,266 మంది యువకులు, 2,887 మంది యువతులు, ఏలూరు నియోజకవర్గంలో 3,026 మంది యువకులు, 2,655 మంది యువతులు ఉన్నారు. అలాగే పోలవరం నియోజకవర్గంలో 3,350 మంది యువకులు, 2,926 మంది యువతులు, చింతలపూడి నియోజకవర్గంలో 3,708 మంది యువకులు, 3,089 మంది యువతులు, నూజివీడు నియోజకవర్గంలో 3298 మంది యువకులు, 2,713 మంది యువతులు, కై కలూరు నియోజకర్గంలో 2818 మంది యువకులు, 2,437 మంది యువతులు ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 20 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న ఓటర్లు 2,89,116 మంది ఉన్నారు. వీరిలో 1,47,987 మంది యువకులు, 1,41,091 మంది యువతులు ఉన్నారు. వీరిలో కూడా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 20 శాతం మంది ఉంటారని అంచనా. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జిల్లాలో 100 నుంచి 109 సంవత్సరాల మధ్య వయసు కలిగిన సూపర్ సీనియర్ ఓటర్లు 21 మంది ఉండగా, 90 నుంచి 99 సంవత్సరాల మధ్య వయస్కులు 1,276 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాకు తరలివస్తున్న ప్రవాస జిల్లా వాసులు హైదరాబాద్ నుంచి 42 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు రోజువారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులూ 20 పైనే -
రంగవల్లులతో ఓటరు చైతన్యం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్నికల ప్రాముఖ్యతపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్, పోలీస్ పరిశీలకులు టి.శ్రీధర్, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వీటిని తిలకించారు. సెల్ఫీ స్టాండ్, మోడల్ ఈవీఎం, ఫొటో గ్యాలరీని వారు పరిశీలించారు. సెయింట్ థెరిస్సా కళాశాల సమావేశ మందిరంలో ఓటేద్దాం.. రండి కదిలి రండి... పేరిట ఏర్పాటు చేసిన దీపాలంకరణ ఆకట్టుకుంది. అనంతరం ఓటు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు. 13న స్థానిక సెలవు ఏలూరు(మెట్రో): ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని కార్యాలయాలకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయం, అత్యవసర సేవల విభాగాలను మినహాయించినట్టు పేర్కొన్నారు. వేతనంతో కూడిన సెలవు : పోలింగ్ రోజున జిల్లాలో దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఏలూరు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ తెలిపారు. దుకాణాలు, సంస్థల యజమానులు ఓటు హక్కు కలిగిన వారి ఉద్యోగులు, సిబ్బందికి సెలవు మంజూరు చేయాలని, ఎటువంటి వేతన తగ్గింపు చేయరాదని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బీజేపీది డబుల్ ఫెయిల్యూర్ సర్కార్
భీమవరం: కేంద్రంలోని బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, డబుల్ ఫెయిల్యూర్ సర్కారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ పంచన టీడీపీ, జనసేన చేరడం సిగ్గుచేటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భీమవరంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని పవన్ మాట్లాడుతున్నారని వాటి గురించి ఆయనకేం తెలుసని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయలేకపోయినా, రైల్వేజోన్ ఇవ్వకపోయినా ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు పాల్గొన్నారు. -
జిల్లాకు పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాకు సంబంధించి 2024–25 విద్యా సంవత్సరానికి గాను పాఠ్య పుస్తకాలు వస్తున్నాయని సమగ్రశిక్ష అదనపు పథక సంచాలకుడు బి.సోమశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల స్టాక్ పాయింట్ను ఆయన పరిశీలించారు. ఇక్కడకు 8,9,10 తరగతులకు సంబంధించిన 65,822 పుస్తకాలు, పెదపాడు స్టాక్ పాయింట్కు 9వ తరగతికి సంబంధించి 7,865 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. పాఠ్యపుస్తకాలన్నీ పూర్తిస్థాయిలో వచ్చిన అనంతరం పాఠశాలల పునః ప్రారంభానికి విద్యార్థులకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. తరువాత పెదపాడులో స్టాక్ పాయింట్ను ఆయన పరిశీలించారు. భద్రపర్చాల్సిన బాధ్యత అధికారులదే.. భీమడోలు: మండలానికి చేరిన పాఠ్య పుస్తకాలను స్టాక్ పాయింట్లలో భద్రపర్చాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని డీఈఓ ఎస్.అబ్రహం అన్నా రు. భీమడోలు జెడ్పీ హైస్కూల్లో స్టాక్ పాయింట్కు చేరుకున్న పాఠ్య పుస్తకాలను శనివారం ఆయన పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎక్కడా కొరత లేకుండా ఇండెంట్ ప్రకారం పుస్తకాలు వచ్చిందీ లేనిదీ పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ఎంఈఓలు ఈదుపల్లి శ్రీనివాసరావు, అయినపర్తి భాస్కర్కుమార్ హెచ్ఎం బి.శ్రీనివాసరావు, సీఆర్ఎంటీలు సత్యప్రసాద్, రాధాకృష్ణ, రమణ ఉన్నారు. -
ప్రచారానికి తెర
● మూగబోయిన మైకులు ● పోలింగ్కు సర్వం సిద్ధం ఏలూరు (మెట్రో): సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ లో భాగంగా చేపట్టిన ప్రచారపర్వం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. జిల్లావ్యాప్తంగా ప్రచారాలు నువ్వానేనా అన్నట్టు సాగా యి. గతనెల 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగా 25 వరకు నామినేషన్ల ప్రక్రియను కొనసాగింది. 26న నామినేషన్లు పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టాలు ముగిశాయి. వైఎస్సార్సీపీ ఫుల్ జోష్ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, కై కలూరు, నరసాపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. భారీస్థాయిలో ప్రజలు తమ అభిమాన నేతను చూ సేందుకు తరలివచ్చారు. అలాగే ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి, భీమవరం, త ణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించారు. రోడ్షోగా సాగిన యాత్రలో ప్రజలు నీరాజనాలు పలికారు. అలాగే భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పోలింగ్కు సిద్ధం : జిల్లాలో సోమవారం ఉద యం 7 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. ఆదివారం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, పోలింగ్ సామగ్రిని తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement