ఓటెత్తిన చైతన్యం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంతో పోలిస్తే పోలింగ్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.55గా నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా (నర్సాపురం పార్లమెంట్) గతంలో 81.02 శాతం నమోదు కాగా ఈ సారి 82.60 నమోదైంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. రెండు జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్లను కలపాల్సి ఉంది.
ఏలూరు జిల్లాలో..
నియోజకవర్గం 2019 2024
చింతలపూడి 81.83 80.05
దెందులూరు 84.70 85.01
ఏలూరు 67.59 71.02
కై కలూరు 88.50 87.50
నూజివీడు 86.19 87.32
పోలవరం 86.55 84.16
ఉంగుటూరు 86.88 87.75
పశ్చిమగోదావరి జిల్లాలో..
నియోజకవర్గం 2019 2024
ఆచంట 81.46 82.80
భీమవరం 77.73 79.35
పాలకొల్లు 81.55 82.28
నర్సాపురం 82.09 84.38
తణుకు 80.00 82.16
తాడేపల్లిగూడెం 80.43 81.60
ఉండి 84.73 86.20