5న భీమవరంలో చెస్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

5న భీమవరంలో చెస్‌ టోర్నమెంట్‌

Jun 2 2025 1:05 AM | Updated on Jun 2 2025 1:22 AM

5న భీ

5న భీమవరంలో చెస్‌ టోర్నమెంట్‌

భీమవరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం అనసూయ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సహకారంతో ఈ నెల 5న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు అనసూయ చెస్‌ అకాడమీ కోచ్‌ మాదాసు కిషోర్‌ చెప్పారు. ఆదివారం టోర్నమెంట్‌ బ్రోచర్‌ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో నిర్వహించే టోర్నమెంట్‌లో అండర్‌–5, 7, 9, అండర్‌ 11, అండర్‌ 13, అండర్‌ 15, బాల, బాలికలకు ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకోసం 90632 24466 నెంబరులో సంప్రదించాలన్నారు.

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ

కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు రద్దీ ఎక్కువగా కనిపించింది. పవిత్ర కోనేరులో స్నానాలాచరించిన భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, ఇలా అన్నీ కలిపి రూ.85,340 ఆదాయం వచ్చిందని చెప్పారు.

5న భీమవరంలో చెస్‌ టోర్నమెంట్‌ 
1
1/1

5న భీమవరంలో చెస్‌ టోర్నమెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement