
అహల్యబాయి సేవలు మరువలేనివి
వనపర్తిటౌన్: సాధారణ భారతీయ మహిళ వీరనారిగా మారుతుందడానికి రాణి అహల్యబాయి హోళ్కర్ ఉదాహరణ అని మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు అహన్య రాజు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధ ఆధ్వర్యంలో అహల్యబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుర వీధుల్లో మహిళలతో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త యుద్ధంలో చనిపోగా రాజ్యపాలన చేశారని.. నేటి మహిళా లోకానికి ఆమె ఆదర్శమన్నారు. తన రాజ్యంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ద్వారక, వారణాసి, నాసిక్, గయ, కాశీ, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, సోమనాథ్ తదితర ప్రముఖ ఆలయాలను పునరుద్ధరించారని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆమె పేరిట సీ్త్రశక్తి పురస్కారాన్ని అందజేస్తోందని.. ఇండోర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాణి అహల్యబాయి విమానాశ్రయంగా నామకరం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.పురుషోత్తంరెడ్డి, మహిళామోర్చా రాష్ట్ర నాయకులు జ్యోతి రమణ, పి.అలివేలమ్మ, జిల్లా ప్రధానకార్యదర్శి రామన్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగుపోగు కుమార్, జిల్లా అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు, కార్యదర్శి బోయల రాము, మాజీ మహిళామోర్చా అధ్యక్షురాలు కల్పన, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా ప్రధానకార్యదర్శి సూగూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.