
పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా
చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతులు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, వెంకటేష్, నర్సింహ, రజినిబాబు, నరేష్ కుమార్, బొల్లు శ్రీనివాసులు, యుగంధర్గౌడ్, మధు గౌడ్, శంకర్ యాదవ్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ రూపురేఖలు మారుస్తా
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
భక్తిభావం పెంపొందించుకోవాలి
పాన్గల్: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని గోప్లాపూర్లో సీతారామాంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. పండుగలను శాంతియుత వాతావరణంలో ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. పిల్లలను గొప్ప చదువులు చదివించాలని.. విద్యబుద్ధులతో పాటు సోదర భావం, ప్రేమానురాగాలు, ధైర్యం, సాహసం, పట్టుదలవంటి లక్షణాలను నేర్పించాలన్నారు. మహాత్ముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా లక్ష్యం కోసం ప్రయత్నించాలని సూచించారు. కుటుంబాల్లో చిన్న, చిన్న విషయాలకు సోదరుల మధ్య ఘర్షణలు, తల్లిదండ్రులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విండో డైరెక్టర్ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు రవికుమా ర్, వెంకటేష్నాయుడు, పుల్లారావు, రాముయాదవ్, భాస్కర్యాదవ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు.